* భారీగా పెరిగిన రవాణా ఛార్జీలు, కూరగాయల ధరలు
* రెట్టింపవుతున్న పెళ్లి బడ్జెట్
సాక్షి, హైదరాబాద్: సమైక్య ఉద్యమ సెగ పెళ్లిళ్లకూ తాకింది. రవాణా వ్యవస్థ స్తంభించిపోవడంతో కూరగాయల ధరలు కొండెక్కాయి. ప్రైవేటు వాహనాలు, కూరగాయల ధరలకు రెక్కలు రావడంతో బడ్జెట్ అంచనాలను మించుతోందని పెళ్లిళ్లు చేసే వారు చెబుతున్నారు. శ్రావణ మాసం కావడంతో ఈ నెల 21, 23, 24, 25 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా 10 వేలకు పైగా వివాహాలు జరుగనున్నాయి.
అయితే పరిస్థితులు అనూహ్యంగా మారి సీమాంధ్రలో సకలజనుల సమ్మె మొదలవ్వడంతో బస్సులు రోడ్డెక్కడంలేదు, దుకాణాలు తెరుచుకోవడంలేదు. దీంతో పెళ్లిళ్ల కోసం ప్రైవేటు వాహనాలనే ఆశ్రయించాల్సి వస్తోంది. డిమాండ్ పెరగడంతో ప్రైవేటు ఆపరేటర్లు పెద్ద మొత్తంలో డిమాండ్ చేస్తున్నారు. కిలో మీటరుకు 6 నుంచి 15 రూపాయలుగా ఉన్న వాహనాల ఛార్జీలను ఏకంగా 20 నుంచి 30 రూపాయల వరకూ పెంచారు. అయినా కొన్ని చోట్ల వాహనాలు దొరకడం కూడా కష్టంగా ఉందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సీమాంధ్రకు సరిహద్దుల్లో ఉన్న తెలంగాణా ప్రాంతం నుంచి పెళ్లికి వెళ్లాల్సిన వధూవరుల పరిస్థితి మరోలా ఉంది. ఆందోళనలు జరిగితే వాహనాలు నిలిపివేస్తారనే వారు భయపడుతున్నారు. షామియానాలు, ఇతర టెంట్ సామాన్లకు కూడా అనుకోని విధంగా గిరాకీ పెరిగింది. ప్రతీ చోట ఆందోళనల కోసం టెంట్లను తీసుకెళ్ళడంతో పెళ్లిళ్లకు అవి లభించే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో చాలామంది దేవాలయాలనో, కల్యాణ మండపాలనో ఆశ్రయించాల్సి వస్తోంది.
కొండెక్కిన ధరలు
ఉద్యమసెగతో కేటరింగ్ రేట్లు కూడా కొండెక్కాయి. నెల రోజుల క్రితం బుక్ చేసుకున్న కేటరింగ్ రేట్లను ఒక్కసారిగా పెంచారు. ఆందోళనల కారణంగా తమకు నిత్యావసరాలు దొరకడమే కష్టంగా ఉందని, కూరగాయల ధరలు విపరీతంగా పెరిగాయని, అందువల్ల ఒప్పందం మేరకు కేటరింగ్ చేయలేమని వారు తెగేసి చెబుతున్నారు.
సీమాంధ్ర ఆందోళనలతో కూరగాయల రవాణా పూర్తిగా స్తంభించింది. వారంరోజుల క్రితం వరకూ కిలో రూ. 20 వరకు ఉన్న కూరగాయల ధరలు ఇప్పుడు ఏకంగా రూ. 50 పైగా పలుకుతున్నాయి. పచ్చిమిర్చి ఏకంగా రూ. 100 దాటింది. ఉల్లి ధర వారంలోనే 25 నుంచి 70 రూపాయలకు చేరింది.
పెళ్లిళ్లకూ సమైక్య సెగ
Published Sat, Aug 17 2013 12:09 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
గాజువాకలో సీఎం రోడ్ షో, పాత గాజువాక సెంటర్లో ప్రారంభమైన బహిరంగ సభ (ఫోటోలు)
దర్శకుడిగా మారిన ప్రముఖ ఫోటోగ్రాఫర్
సడెన్గా మిస్ యూఎస్ఏ స్థానం నుంచి తప్పుకుంటున్న మోడల్!కారణం ఇదే..
హైదరాబాద్లో కుండపోత.. వాతావరణశాఖ వార్నింగ్
Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @గాజువాక (విశాఖపట్నం జిల్లా)
ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
ఏపీలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం
T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
తప్పక చదవండి
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
- ‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
- దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
- 'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
- జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
- తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
- LS Elections: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్.. ఓటింగ్ శాతం ఎంతంటే..
Advertisement