సాక్షి, తిరుపతి: జిల్లాలో ఇసుక రవాణా యథేచ్ఛగా సా గుతోంది. జిల్లాలోని నగరాలు, పట్టణాలేగాక పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటకలో భవన నిర్మాణాలు ఊపందుకోవడంతో ఇసుకకు ఎక్కడలేని డిమాండ్ ఏర్పడింది. ఇదే అదనుగా భావించిన ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. పైగా అక్రమ రవాణాను అరికట్టే అధికారులు కొందరు సమైక్య ఉద్యమంలో ఉండడం దొంగలకు లాభిస్తోంది. అవినీతికి అలవాటుపడిన కొందరు అధికారులు ఇసుక దొంగలకు సహకరిస్తుండడంతో నదులు, పొలాలు అన్న తేడా లేకుండా ఇసుకను తవ్వేస్తున్నారు.
ఆదివారం జిల్లా సరిహద్దు ప్రాంతంలో 200కు పైగా ఇసుక లారీలు పట్టుబడడమే దీనికి నిదర్శనం. జిల్లాలో ఇసుక నిల్వలు ఎక్కువగా ఉన్నాయి. డిమాండ్ ఎక్కువగా ఉండడంతో కుప్పం నుంచి శ్రీకాళహస్తి వరకు వంకలు, వాగులు, నదీతీర ప్రాంతాల్లోని సాగు భూము ల్లో ఉన్న ఇసుకును ఇష్టానుసారం తవ్వి లారీలు, టిప్పర్లు, ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నారు. శ్రీకాళహస్తి పరిధిలోని స్వర్ణముఖి నదిలో ఇసుక దాదాపు కనుమరుగైంది.
సాగు భూములనూ వదలని వైనం
స్వర్ణం కరిగిపోవడంతో నదీతీర ప్రాంతాల్లోని సాగు భూములపై కన్నుపడింది. అనుకున్నదే తడవుగా ఇసుకాసురులు భూముల యజమానులను కలసి రూ.లక్షలు ఆశచూపి బంగారం లాంటి భూములను ఎందుకూ పనికిరాకుండా మార్చేస్తున్నారు. చంద్రగిరి నుంచి శ్రీకాళహస్తి వరకు సాగు భూములన్నీ బోరుమంటున్నా యి. తిరుపతి సమీపంలోని స్వర్ణముఖి నది ఒడ్డున ఉన్న వందలాది ఎకరాల్లో ఉన్న ఇసుకను తోడేస్తున్నారు.
రేణిగుంట, గాజులమండ్యం, పాపానాయుడుపేట, గోవిందవరం, వికృతమాల, కొత్తవీరాపురం, తొండమనాడు, శ్రీకాళహస్తి ప్రాంతాల్లోని సాగు భూములన్నీ ఇసుకాసురుల కబంధ హస్తాల్లో చిక్కుకున్నా యి. స్వర్ణముఖి పరీవాహక ప్రాంతాల్లోని ప్రభు త్వ భూముల్లోనూ ఇసుకను తోడేస్తున్నారు. పాపానాయుడుపేట-పెన్నగడ్డం మార్గంలో స్వ ర్ణముఖి నది ఒడ్డున ఉన్న భూములను కొంతమంది రైతులు లీజుకు తీసుకుని అందులోని ఇసుకును అమ్మి సొమ్ము చేసుకుంటున్నా రు. ప్రశ్నించిన వారికికొంత ముట్టజెపుతున్నారు.
కాసులు కురిపిస్తున్న ఇసుక రవాణా
ఇసుక అక్రమ రవాణా కొందరు అధికారులకు, స్థానికులకు కాసులు కురిపిస్తోంది. ఇసుక ట్రాక్టర్ లేదా లారీ కనిపిస్తే పోలీసు, రెవెన్యూ శాఖకు చెందిన కొందరు అధికారులకు పండగే. వాహనాన్ని బట్టి రేటు నిర్ణయించి వసూళ్లు చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చే జీతం కన్నా ఇసుకాసురుల నుంచి వచ్చే మామూళ్లే అధికంగా ఉన్నాయని ఓ అధికారి బహిరంగంగానే చెబుతున్నాడు.
ఇసుకాసురులు
Published Mon, Sep 23 2013 3:41 AM
Advertisement
Advertisement
ఈనాడు సంస్థల ఛైర్మన్ రామోజీరావు కన్నుమూత
రాజీనామా చేసి వెళ్లిపోండి.. టీడీపీ కార్యకర్తల అల్టిమేటం
పట్టలేని సంతోషం.. మర్చిపోలేని విషాదం.. రెండూ ఈ నెలలోనే!
పిఠాపురం వర్మపై జనసేన దాడి
ఇదేం వ్యాధి..నిద్రలో షాషింగ్ చేయడమా..?
టీడీపీ యథేచ్ఛదాడులతో ఏపీలో ఆటవిక పరిస్థితులు: వైఎస్ జగన్
పాస్వర్డ్ మర్చిపోయాడు.. 11 ఏళ్ల తరువాత చూస్తే రూ. కోట్ల డబ్బు
T20 WC 2024: పాక్ను మట్టికరిపించిన అమెరికా జట్టులో సగం మంది మన వారే..!
ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం - ఆనంద్ మహీంద్రా ట్వీట్
T20 WC 2024 IND VS PAK: రోహిత్ శర్మ సూపర్ సిక్సర్.. వైరల్ వీడియో
ప్రధాని మోదీకి వైఎస్ జగన్ అభినందనలు
యాత్రికుల బస్సుపై ఉగ్రదాడి..9 మంది మృతి
నయన్- విఘ్నేశ్ వివాహ వార్షికోత్సవం.. భర్త ఎమోషనల్ పోస్ట్!
T20 World Cup 2024: భారత్-పాక్ మ్యాచ్.. సందడి చేసిన క్రిస్ గేల్
నయన్- విఘ్నేశ్ పెళ్లి రోజు.. తమ పిల్లలతో సెలబ్రేట్ చేసుకున్న స్టార్ కపుల్! (ఫోటోలు)
మోదీ 3.0లో .. 30 మంది కేబినెట్ మంత్రులు వీరే
విదేశాల్లో భారతీయ కార్లకు ఫుడ్ డిమాండ్!.. గత నాలుగేళ్లలో..
T20 World Cup 2024: టీమిండియాతో మ్యాచ్.. టాస్ గెలిచిన పాకిస్తాన్.. తుది జట్లు ఇవే..!
తప్పక చదవండి
- ఎన్నికల వరకే రాజకీయాలు.. ఎన్నికల తర్వాత అభివృద్దే తారక మంత్రం
- మూత పెట్టకుండా వండుతున్నారా? ఐసీఎంఆర్ స్ట్రాంగ్ వార్నింగ్
- అలాంటి సర్జరీ చేయించుకోమని సలహా ఇచ్చారు: టాలీవుడ్ హీరోయిన్
- రైతు కూతురు డిప్యూటీ కలెక్టర్గా..!
- కేంద్ర కేబినెట్: ఏపీ నుంచి ముగ్గురు ఎంపీలు
- ఒకే రన్వేపై రెండు విమానాలు.. ముంబైలో తప్పిన ప్రమాదం
- ఈ 'బంగారు తేనీరు'.. ధర ఎంతంటే? అక్షరాలా..
- బ్యాడ్ లాంగ్వేజ్ ఉపయోగిస్తున్నారా? పరిశోధనలో షాకింగ్ విషయాలు
- దాయాదుల సమరానికి సర్వం సిద్దం.. అందరి కళ్లు పిచ్పైనే?
Advertisement