సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:పచ్చదనానికి ఎసరు పెడుతున్నారు. నీరు, భూమి, వృక్షం ఇలా దేన్నీ విడిచిపెట్డడం లేదు. మొత్తంగా వాల్టా చట్టాన్నే ఉల్లంఘిస్తున్నారు. రాష్ట్ర విభజన తరువాత ఆర్థిక పరిస్థితిని సాకుగా చూపి అన్నిచోట్ల నదులు, కాలువలు.. అని చూడకుండా ఇసుక కనిపిస్తే తవ్వుకునేందుకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చేస్తోంది. అందులో భాగంగా జిల్లాలో నాగావళి నదికి ఇరువైపులా అనేక చోట్ల ఇసుక రీచ్ల నిర్వహణకు అనుమతి ఇచ్చేందుకు జిల్లా యంత్రాంగం ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. ఆదాయమే పరమావధిగా తెలుగుదేశం నేతలూ ఇందుకు వంతపాడుతున్నారు. ఈ విషయమై ఇటీవల బూర్జ, పొందూరు, ఆమదాలవలస మండలాలకు చెందిన కొంతమంది జాయింట్ కలెక్టర్ను కలిసి జిల్లా పరిస్థితులను వివరించారు. ఇదే విషయాన్ని జిల్లా పంచాయతీ అధికారి, మైన్స్ విభాగం ఏడీల దృష్టికి తీసుకువెళ్లారు. ఆమదాలవలస గోపీనగరం ప్రాంతంలో గతంలో ఇసుక దందాలను నివారించేందుకు ప్రయత్నించిన రెవెన్యూ అధికారులను చంపుతామని కూడా బెదిరించారని ఆ ప్రాంత వాసులు గుర్తుచేస్తున్నారు. ఈ ప్రాంతంలో రీచ్ల్ని ప్రారంభిస్తే మాఫియా చెలరేగే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు.
చట్టం ఏం చెబుతోంది
వాల్టా-2002 చట్టంలోని సెక్షన్ 27 రూల్ 2, 3 ప్రకారం గ్రామీణ, పట్టణ సురక్షిత మంచి నీటి పథకాలున్న ప్రాంతాల్లో ఇసుక రీచ్లు నిషిద్ధం.
{బిడ్జిలు, ఆనకట్టలకు 500 మీటర్ల పరిధిలోపు క్వారీలు ఉండకూడదు.
ఇసుక పొర మూడు మీటర్ల మందం ఉన్న ప్రాంతాల్లో ఒక మీటర్ వరకు తవ్వుకోవచ్చు.
నది తీరంలో 15 మీటర్ల లోపు, నది వెడల్పులో 5వ వంతు లోపు ప్రాంతాల్లో ఇసుక రీచ్లకు అనుమతి లేదు.
రాష్ట్రస్థాయి పర్యావరణ ప్రభావ గణాంకాల సంస్థ (సీయ్) నిబంధనల ప్రకారం కార్మికులతోనే ఇసుక ఎత్తించాలి. యంత్రాల వినియోగం కూడదు.
వర్షాకాలంలో ఎలాంటి పరిస్థితుల్లోనూ ఇసుక తవ్వరాదు.
రీచ్ల కారణంగా వ్యవసాయం, మంచినీరు, పరిశ్రమలకు ఎలాంటి ఆటంకం ఉండకూడదు.
కేవలం పగటిపూట మాత్రమే తవ్వకాలకు అనుమతించాలి.
తీరం నుంచి ముఖ్య రహదారికి ఆనుకుని ఇరువైపులా చెట్లు నాటాలి.
భవిష్యత్తు ఇసుక రీచ్లివే
ఈ నిబంధనల్లో చాలావాటిని ఉల్లంఘిస్తూ పలు కొత్త రీచులను అధికార యంత్రాంగం గుర్తించింది. ఆమదాలవలస మండలం నిమ్మతొర్లువాడ, కొరపాం, గరిమెళ్ల కొత్తవలస, తొగరాం, దిబ్బలపేట, ముద్దాడపేట, దూసి, తోటాడ, నెల్లిమెట్టతోపాటు పొందూరు మండలం గంద్రేడు, సింగూరు బొడ్డేపల్లి, బూర్జ మండలం లాభాం, గుత్తావల్లి, చిన్నలంకాం ప్రాంతాల్లో కేవలం ఆదాయం కోసమే రీచుల నిర్వహణకు అనుమతిలిచ్చేందుకు రంగం సిద్ధం చేశారని తెలిసింది. ఇప్పటికే కాఖండ్యాంలో ఈ విధంగా అనుమతిలిచ్చి ప్రజాగ్రహం చవిచూశారు.
ఇవీ నష్టాలు
కొత్త ఇసుక రీచ్లొస్తే నారాయణపురం ఆనకట్టకు ప్రమాదం వాటిల్ల వచ్చు.
ఇక్కడ సుమారు 50 వేల క్యూసెక్కుల ప్రవాహం సాగరంలో కలుస్తోంది.
చిన్నలంకాం, లాభాం, గుత్తావల్లి, గరిమెళ్ల కొత్తవలస, కొరపాం ప్రాంతాలు నదీప్రవాహం ఎదురుగా ముంపునకు గురయ్యే అవకాశం ఉంది.
ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే తొగరాం సహా రక్షణ కవచం ఉండదు.
ఇప్పటికే ఇసుకలపేట, కొత్తవలస, దిబ్బలపేట గ్రామాలు పూర్తిగా కోతకు గురయ్యాయి. ముద్దాడపేట ప్రాంతానిదీ ఇదే పరిస్థితి. దూసి ప్రాంతంలో ఉన్న రైల్వే బ్రిడ్జికి కూడా ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది.
వాల్టా.. ఉల్టా!
Published Sun, Jan 4 2015 3:56 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వారి వల్లే మా ఎంగేజ్మెంట్ జరిగింది: అదితిరావు హైదరీ
పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటి (ఫోటోలు)
రాణించిన హెడ్, కమ్మిన్స్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'దీదీ గిరి' అంగీకరించను: పశ్చిమ బెంగాల్ గవర్నర్
బాబే కాదు ప్రధాని మోదీ కూడా యూటర్న్ తీసుకున్నారు: అమర్నాథ్
త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనున్న టాలీవుడ్ హీరోయిన్.. భర్తపై అలాంటి పోస్ట్!
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి నగదు
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
కాంగ్రెస్కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement