Sakshi News home page

సంక్రాంతి కానుకను ప్రకటించిన చంద్రబాబు

Published Tue, Dec 23 2014 12:23 PM

సంక్రాంతి కానుకను ప్రకటించిన చంద్రబాబు - Sakshi

హైదరాబాద్ : తెల్ల రేషన్ కార్డుదారులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంక్రాంతి కానుకను ప్రకటించింది. సంక్రాంతి నాడు ప్రతి ఇంట్లో ఆనందం వెల్లివిరియాలని ... ప్రతి పేదవాడి జీవితంలో వెలుగులు నిండాలని...అందుకు పండుగ సందర్భంగా ఉచితంగా సరకులు పంపిణీ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.

తెల్ల రేషన్ కార్డు లబ్దిదారులకు ...అరకిలో కందిపప్పు, బెల్లం, పామాయిల్ (1/2 కేజీ)  నెయ్యి (100 గ్రాములు) బెల్లం అరకిలో, కేజీ శనగలు, గోధుమ పిండి ఉచితంగా పంపిణీ చేస్తామని చంద్రబాబు  వెల్లడించారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వంపై రూ. 280 కోట్ల భారం పడనుంది. ప్రభుత్వ నజరానాతో 1.30 కోట్ల తెల్లకార్డు దారులకు ప్రయోజనం పొందనున్నారు. అంతకు ముందు కాంగ్రెస్ సీనియర్ నేత జి.వెంకటస్వామి మృతికి ఏపీ అసెంబ్లీ రెండు నిమిషాలు మౌనం పాటించింది.

Advertisement

What’s your opinion

Advertisement