సింగపూర్ మంత్రితో కలిసి {పారంభించిన చంద్రబాబు
కళాకారులతో కలిసి సంప్రదాయ, గిరిజన నృత్యాలు
విదేశీయులకు ఆంధ్ర పిండి వంటలు, స్థానిక పంటలు పరిచయం
పారిశ్రామిక వేత్తలతో సమావేశం
విశాఖపట్నం: సంక్రాంతి సంబరాలు ప్రారంభమయ్యాయి. సీఎం చంద్రబాబునాయుడు మంగళవారం విశాఖలోని కైలాసగిరిలో ఈ వేడుకలను ప్రారంభించారు. సింగపూర్ ప్రతినిధులతో కలిసి సంబరాల్లో పాల్గొన్నారు. జానపద కళాకారులతో కలిసి సంప్రదాయ నృత్యాలు చేశారు. పిండి వంటలను ఆరగించారు. అనంతరం సింగపూర్ ప్రతినిధులతో పాటు స్థానిక పారిశ్రామిక వేత్తలతో సమావేశమయ్యారు. ఉదయం 11.55 నిమిషాలకు ప్రత్యేక విమానంలో సింగపూర్ బృందంతో కలిసి చంద్రబాబు విశాఖ చేరుకున్నారు. విమానాశ్రయం నుంచి కైలాసగిరికి వెళ్లే మార్గమధ్యలోని మాధవధారలో ఎమ్మె ల్యే విష్ణుకుమార్ రాజు,టీడీపీ నేత సనపల పాండు రంగారావులు ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. అక్కడి నుంచి కైలాసగిరి చేరుకున్నారు. సింగపూర్ మంత్రితో పాటు గాలిపటాలు ఎగురవేసి సంబరాలను ప్రారంభించారు. గిరిజన కళాకారులతో కలిసి థింసా నృత్యం చేశారు. కోలాటం ఆడారు. గంగిరెద్దుల విన్యాసాలను తిలకించారు. తప్పెటగూళ్లు, పులివేషాలు, హరిదాసుల కీర్తనలు వంటి వాటిని విదేశీయులకు పరిచయం చేశారు. మన ప్రాంతంలో పండిన చెరకు, అరటి, గుమ్మడికాయలు, కంద,క్యారెట్ వంటి పంటల వివరాలను వారికి వివరించారు. సింగపూర్ మంత్రి ఎస్. ఈశ్వరన్కు భారీ గుమ్మడికాయను సీఎం చంద్రబాబు బహూకరించారు.
సీఎం వెంట వచ్చిన సింగపూర్ మంత్రితో పాటు పారిశ్రామిక బృందం సంక్రాంతి సంబరాలను ఆసక్తిగా తిలకించారు. ప్రతి ప్రదర్శనను తమ కెమెరాల్లో బంధించడంతో పాటు ‘సెల్ఫీ’లు తీసుకున్నారు. విశాఖ వాసులు ఏర్పాటు చేసిన ఆంధ్ర పిండి వంటలను సీఎం చంద్రబాబు వారికి రుచి చూపించారు. ఈశ్వరన్కు స్వయంగా తినిపించారు. బీచ్ రోడ్డులో విశాఖ అందాలను, సముద్ర సోయగాలను విదేశీ బృందానికి చూపించారు. నొవాటెల్ హోటల్లో పారిశ్రామిక వేత్తలు,సింగపూర్ బృందంతో సమావేశమయ్యారు. విశాఖకు భారీ పెట్టుబడులు తీసుకువచ్చి రాష్ట్రంలో అగ్రగామిగా నిలబెడతానన్నారు. తాము కూడా అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామని సింగపూర్ మంత్రి, అతని బృందం హామీ ఇచ్చారు.
సమావేశం అనంతరం సీఎం కృష్ణా జిల్లా విజయవాడ పర్యటనకు విదేశీ బృందంతో కలిసి వెళ్లారు. సీఎం వెంట ఎంపీలు కంబంపాటి హరిబాబు, అవంతి శ్రీనివాస్, రాష్ట్ర మంత్రులు గంటా శ్రీనివాసరావు, చింతకాయల అయ్యన్నపాత్రుడు, నారాయణ, అచ్చెం నాయుడు, జిల్లా ఎమ్మెల్యేలు, కలెక్టర్ ఎన్.యువరాజ్, జాయింట్ కలెక్టర్ నివాస్, ఈపీడీసీఎల్ సీఎండీ ఆర్.ముత్యాలరాజు, ఇన్చార్జ్ సీపీ అతుల్సింగ్, డిఐజీ పి.ఉమాపతి, వుడా వీసీ టి.బాబూరావునాయుడు, నగరపాలక సంస్థ కమిషనర్ ప్రవీణ్కుమార్,ఎస్పీ కోయ ప్రవీణ్, డీసీపీలు త్రివిక్రమ్వర్మ, రవికుమార్మూర్తి ఉన్నారు.
సంక్రాంతికి శ్రీకారం
Published Tue, Jan 13 2015 11:47 PM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తీన్మార్ మల్లన్నను అనర్హుడిగా ప్రకటించాలి
51 జంటలకు సామూహిక వివాహాలు
తీన్మార్ మల్లన్నను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి
వానొస్తే మునకే!
రైలొచ్చినా రోడ్డుమార్గమే..
కురుస్తున్న పెద్దాస్పత్రి భవనం
రెండో రోజూ కొనసాగిన తనిఖీలు
పోక్సో కేసులో 20ఏళ్ల జైలుశిక్ష
● తాతయ్యగుంట గంగమ్మకు తోటివేషాలతో మొక్కులు ● అమ్మవారికి సేవకు పోటెత్తిన భక్తులు
ఐకేఎస్తో వేదిక్ వర్సిటీ ఒప్పందం
తప్పక చదవండి
- అంతర్జాతీయ ప్రమాణాలతో ఖమ్మం మార్కెట్ ఆధునీకరణ
- రైతుల ఖాతాల్లోకి పెట్టుబడి రాయితీ
- Lok Sabha Election 2024: అభిజిత్ గంగోపాధ్యాయ్కు ఈసీ నోటీసులు
- రుణమాఫీపై నేడు నిర్ణయం
- ఏడేళ్ల తర్వాత సవాల్ చేస్తారా?
- Delhi liquor scam: నిందితుల జాబితాలో ఆప్, కేజ్రీవాల్
- వివాదాస్పదులైతే పక్కకే..
- Lok Sabha Election 2024: యువ పిడికిలి..దీప్సితా ధర్
- Centre for the Study of Developing Societies: ఒపీనియన్లు వేరువేరయా!
- కేసీఆర్ను ఢీకొట్టలేక కవితను జైలుకు పంపారు
Advertisement