Sakshi News home page

శారదా పీఠం దానికే అంకితం

Published Sat, Jul 6 2019 8:35 PM

The Sarada Peetham is Dedicated to It - Sakshi

సాక్షి, ఢిల్లీ: ధర్మ పరిరక్షణ కోసం నిరంతరం పోరాటం చేసేందుకే  శారదా పీఠం అంకితమని విశాఖ శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి పేర్కొన్నారు. హిందూ దేవాలయాల భూముల ఆక్రమణకు, అన్య మత ప్రచారానికి వ్యతిరేకంగా శారదా పీఠం పోరాటం చేసిందని చెప్పారు. ఈ పోరాటంలో తాను అలిసిపోయానని, ఇక నుంచి శారద పీఠానికి ఉత్తరాధికారిగా స్వామి స్వాత్మనంద పని చేస్తారని వెల్లడించారు. హిందూధర్మ పరిరక్షణ కోసం అన్ని తరాలు పనిచేయాలనేది శారదాపీఠం సంకల్పమని ఆయన వ్యాఖ్యానించారు. 

Advertisement
Advertisement