మేడ్చల్, న్యూస్లైన్: సీఎం పాల్గొన్న వనమహోత్సరం కార్యక్రమంలో కండ్లకోయ గ్రామ సర్పంచ్ నరేందర్రెడ్డికి అవమానం ఎదురైంది. గ్రామ ప్రథమ పౌరుడైన సర్పంచిని వేదికపైకి ఆహ్వానించినా.. వేదికపై కూర్చోవడానికి కనీసం కుర్చీ కూడా వేయలేదు. దీంతో సమావేశం జరిగినంతసేపూ ఆయన మాజీ మంత్రి సబిత, జిల్లా కలెక్టర్ శ్రీధర్ వెనుక నిలబడ్డాడు. ప్రొటోకాల్ ప్రకారం గ్రామంలో ఏ అధికారిక కార్యక్రమం నిర్వహించినా స్థానిక సర్పంచికి వేదికపై చోటు కల్పిస్తారు. సోమవారం నిర్వహించిన సీఎం సభలో మాత్రం నిర్వాహకులు సర్పంచిని ఇలా అవమానించారు.
వ్యాపారుల సంక్షేమానికి కృషి
కాటేదాన్, న్యూస్లైన్: రాష్ర్టంలోని అన్ని పట్టణాల్లో గల వీధివ్యాపారుల సంక్షేమంకోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని మెఫ్మా రాష్ట్ర అసిస్టెంట్ డెరైక్టర్ రాజశేఖరరెడ్డి పేర్కొన్నారు. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని మైలార్దేవ్పల్లి డివిజన్ కాటేదాన్లో సోమవారం మెఫ్మా, జీహెచ్ఎంసీ సంయుక్తంగా వీధివ్యాపారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. స్థానిక కార్పొరేటర్ టి.ప్రేమ్దాస్గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వీధివ్యాపారులకు వారి అభ్యున్నతికోసం రాష్ట్రప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో రాజశేఖరరెడ్డి మాట్లాడుతూ.. పట్టణ పేదరిక నిర్మూలనకోసం రాష్ట్ర ప్రభుత్వం వీధివ్యాపారులకు బ్యాంకులద్వారా రుణాలను అందజేసి చేయూతనిచ్చేందుకు వీధి వ్యాపారుల నియంత్రణామండలిని ఏర్పాటు చేసిందని చెప్పారు. రాష్ట్రంలోనే తొలిసారి ఈ కార్యక్రమం కాటేదాన్లో నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. వీధివ్యాపారం చేసే అందరికీ 15 మంది చొప్పున గ్రూపులను ఏర్పాటుచేసి వారికి బ్యాంకుల ద్వారా రుణాలను అందజేస్తారని, దీని కారణంగా వీధి వ్యాపారుల పేదరిక నిర్మూలనకు దోహదపడుతుందన్నారు.కమిటీలో సర్కిల్ డిప్యూటీ కమిషనర్, టౌన్ ప్లానింగ్ ఏసీపీ , డీపీఓ , బ్యాంకు మేనేజర్లతోపాటు స్థానిక పోలీసు అధికారులు ఉంటారని తెలిపారు.
గ్రూపులకోసం ఏ ర్పాటుచేసే కమిటీ సభ్యులైన వీధి వ్యాపారులు తమ చిరునామా, ఓట ర్ఐడీ, ఫొటో, ఆధార్కార్డు, తదితర పత్రాలను సంబంధిత అధికారులకు సమర్పించాల్సి ఉంటుం దని తెలిపారు. వీధివ్యాపారుల నియంత్రణ మండలి ద్వారా వారికి రక్షణ కల్పిస్తూ సర్కిల్ పరిధిలో ఒకేచోట వ్యాపారం చేసుకునేందుకు స్థలాలు సైతం ప్రభుత్వం కేటాయిస్తుందని చెప్పారు. కార్యక్రమంలో సర్కిల్ పీఓ పత్యానాయక్, నాయకులు మాధవరెడ్డి, విజయ్కుమార్, అనంతయ్య, స్వామిగౌడ్, గట్టయ్య, రమేష్గుప్తా పాల్గొన్నారు.
సీఎం సభలో సర్పంచ్కు అవమానం
Published Tue, Aug 20 2013 6:14 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వారితో భయంకరమైన అనుభవాలు ఎదుర్కొన్నా: హీరామండి నటి
కేజ్రీవాల్కు మరో షాక్.. ‘ఎల్జీ’ సంచలన నిర్ణయం
మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)
గాలివానలో చిక్కుకున్న హెలికాఫ్టర్.. నవీన్ పట్నాయక్కు తప్పిన ప్రమాదం
సోనాక్షీతో ఇంటిమేట్ సీన్స్.. ఆమె ఆమ్మగారు ఏమన్నారంటే: నటుడు
నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!
2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!
వరల్డ్కప్ ట్రోఫీతో ఫోజులిచ్చిన యువరాజ్.. ఫోటోలు వైరల్
ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..
తప్పక చదవండి
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- ‘SRH కాదు.. పరుగుల విధ్వంసానికి మారు పేరు ఆ జట్టే’
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- అందుకేనా అమిత్ షా అలా మాట్లాడింది!
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement