చల్లపల్లి : ‘గుర్తింపులేని పాఠశాలలు నిర్వహిస్తే లక్ష రూపాయల వరకు జరిమానా విధిస్తాం’.. విద్యాశాఖ గతంలో ఇచ్చిన ప్రకటన ఇది. ఈ మేరకు జీవో కూడా ఇచ్చింది.
‘లక్ష రూపాయల జరిమానా తర్వాత కూడా తరగతులు నిర్వహిస్తే రోజుకు రూ.10 వేల చొప్పున జరిమానా విధిస్తాం’..
ఇది జిల్లా విద్యాశాఖాధికారి ఇటీవల చేసిన హెచ్చరిక.
గుర్తింపు లేని పాఠశాలలపై అధికారులు, ప్రభుత్వం ప్రకటనలు, జీవోలు ప్రచారానికే పరిమితమవుతున్నాయి. ఆచరణలో అమలుకు నోచుకోవడం లేదు. గుర్తింపులేని పాఠశాలలు జిల్లాలో 145 ఉన్నా.. వాటిలో అడ్మిషన్లు శరవేగంగా జరిగిపోతున్నా.. వాటిపై చర్యలు తీసుకోవడంలో అధికారులు చొరవ చూపడం లేదు. జిల్లాలో 2012లో 300 గుర్తింపులేని పాఠశాలలు ఉండగా, గత ఏడాది 170కి తగ్గాయి. ఈ ఏడాది 145 ఉన్నాయి. అధికారులు కూడా గుర్తింపులేని పాఠశాలల జాబితాను ప్రకటించారు. అయినా వాటిలో విద్యార్థులు చేరకుండా చర్యలు తీసుకోకపోవడం, పాఠశాలను సీజ్ చేయకపోవడం విమర్శలకు దారితీస్తోంది.
ప్రచారానికే పరిమితం...
గుర్తింపు లేని పాఠశాలలపై చర్యలు తీసుకోవాల్సిన జిల్లా అధికారులు ప్రచార కార్యక్రమాలకే పరిమితమవుతున్నారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇలాంటి పాఠశాలలను గుర్తించి వాటిలో విద్యార్థులు చేరకుండా చర్యలు తీసుకోవడంతో పాటు వాటిని సీజ్ చేస్తున్నారు. గుర్తింపులేని పాఠశాలలను 24 గంటల్లో సీజ్ చేయాలని కడప జిల్లా కలెక్టర్ శశిధర్ గురువారం ఆదేశించారు. మరికొన్ని జిల్లాల్లోనూ కలెక్టర్లు ఇలాంటి ఆదేశాలనే ఇచ్చి అమలు చేస్తున్నారు. మన జిల్లాలో మాత్రం ఇలాంటి పాఠశాలల జాబితాను కరపత్రాల రూపంలో ముద్రించి అవగాహన కార్యక్రమాలకే పరిమితమవుతున్నారు.
జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో పేరుమోసిన కార్పొరేట్ పాఠశాలలకు సైతం గుర్తింపు లేకపోవడం గమనార్హం. అలాంటి పాఠశాలలపై చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది.
జరిమానాలు ఏమయ్యాయి?
గుర్తింపులేని పాఠశాలలు నిర్వహిస్తే లక్ష రూపాయల వరకు జరిమానా విధించాలని విద్యాశాఖ గతంలో నిర్ణయించింది. అయినా ఆ పాఠశాలలు తరగతులు నిర్వహిస్తే రోజుకు రూ.10 వేల చొప్పున జరిమానా విధిస్తామని గతంలో డీఈవో ఆర్భాటంగా ప్రకటించారు. గుర్తింపులేని పాఠశాలలు గత వారం రోజుల నుంచి తరగతులు నిర్వహిస్తుండటం, అడ్మిషన్లు తీసుకోవడం చేస్తున్నా ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడంపై తల్లిదండ్రులు మండిపడుతున్నారు.
గుర్తింపు లేని పాఠశాలలపై చర్యలేవీ
Published Sun, Jun 22 2014 2:48 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఓటీటీకి వచ్చేస్తోన్న మర్డర్ మిస్టరీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
‘ప్రజ్వల్ రేవణ్ణ’ పై కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు
అమ్మానాన్న, ధర చెక్ చేయకుండానే కొనుక్కోవాలి : ఆటో డ్రైవర్ కుమార్తె ఘనత
నీ ముగ్గురు భార్యలను పరిచయం చెయ్యు పవన్ కళ్యాణ్ ను ఏకిపారేసిన ముద్రగడ
20 ఏళ్ల తర్వాత 'మన్మథుడు' హీరోయిన్ రీఎంట్రీ.. కాకపోతే!
ఓటేద్దాం.. ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం
27 ఏళ్లుగా ఆమె మహిళ..పెళ్లి కుదిరాక వెలుగులోకి షాకింగ్ విషయం..!
కన్నీళ్లు పెట్టుకున్న రోహిత్ శర్మ.. డ్రెస్సింగ్ రూంలో అలా!
మెట్ గాలాలో మెరిసిన ఆలియా.. ఆ చీరకు ఎందుకంత క్రేజ్ అంటే?
నష్టాల్లో ముగిసిన స్టాక్మార్కెట్ సూచీలు
తప్పక చదవండి
- అమ్మానాన్న, ధర చెక్ చేయకుండానే కొనుక్కోవాలి : ఆటో డ్రైవర్ కుమార్తె ఘనత
- Rekha Jhunjhunwala: ఒక్కరోజులోనే రూ.800 కోట్ల నష్టం
- 'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
- జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
- ‘ఒకవేళ బెయిల్ ఇస్తే’.. కేజ్రీవాల్కు కండీషన్ పెట్టిన సుప్రీంకోర్టు
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
- ప్లే ఆఫ్స్ రేసులో ఉన్నారా? హార్దిక్ సమాధానం ఇదే!
- వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- వైజాగ్ మాల్యా.. వంశీ!
- LS Elections 3rd Phase: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్
Advertisement