సోనియా ఎదుట మాట్లాడేలేని సీమాంధ్ర పెద్దలు | Sakshi
Sakshi News home page

సోనియా ఎదుట మాట్లాడేలేని సీమాంధ్ర పెద్దలు

Published Thu, Aug 22 2013 11:03 AM

Seemandhra congress leaders don't have guts to talk sonia gandhi

సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్రమంత్రులు, పార్లమెంట్ సభ్యులు, రాష్ట్ర మంత్రలలకు యూపీఏ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఎదుట మాట్లాడే ధైర్యం లేదని  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు గురువారం ఏలూరులో వ్యాఖ్యానించారు. అందుకే రాష్ట్రంలో ఈ పరిస్థితి నెలకొందని ఆయన పేర్కొన్నారు. కాగా ప్రజల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే పోరాటం చేస్తుందని ఆయన స్పష్టం చేశారు.



తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు తన పదవికి రాజీనామా చేసిన తర్వాతే తెలుగు ప్రజల ఆత్మగౌరవం పేరిట బస్సు యాత్ర ప్రారంభించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కర్రా రాజారావు డిమాండ్ చేశారు. అసలు వేర్పాటువాదో లేక సమైక్యవాదో ప్రజలకు స్పష్టం చేయాలని ఆయన  చంద్రబాబుకు సూచించారు. ఓ వేళ రెండు కళ్ల సిద్దాంతంతో చంద్రబాబు బస్సుయాత్ర చేస్తే ప్రజలే తగిన బుద్ది చెబుతారని రాజారావు ఎద్దేవా చేశారు.

Advertisement
Advertisement