సమ్మె విరమించిన సీమాంధ్ర గెజిటెడ్‌,పంచాయతీ ఉద్యోగులు | Sakshi
Sakshi News home page

సమ్మె విరమించిన సీమాంధ్ర గెజిటెడ్‌,పంచాయతీ ఉద్యోగులు

Published Thu, Oct 17 2013 4:59 PM

seemandhra Gazetted and Panchayati Raj employees winding strike

హైదరాబాద్:  సీమాంధ్ర గెజిటెడ్‌ ఉద్యోగులు, పంచాయతీరాజ్ ఉద్యోగులు సమ్మె విరమించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో ఆ ఉద్యోగుల నేతలు జరిపిన చర్చలు ఫలించాయి. సమ్మె విరమించమని ముఖ్యమంత్రి వారిని కోరారు. అందుకు వారు అంగీకరించారు.  ప్రజల ఇబ్బందులను దృష్టిలోపెట్టుకొని సమ్మె విరమిస్తున్నట్లు సీమాంధ్ర గెజిటెడ్‌ ఉద్యోగుల సంఘాల నేతలు చెప్పారు. అవసరమనుకుంటే మళ్లీ సమ్మె చేస్తామని వారు చెప్పారు.

Advertisement
Advertisement