సాక్షి నెట్వర్క్ : సమైక్యాంధ్రప్రదేశ్ పరిరక్షణ ఉద్యమం సీమాంధ్రలో పతాకస్థాయికి చేరుతోంది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం కృష్ణాజిల్లా విజయవాడలో వైద్యులు భారీ ర్యాలీ చేపట్టారు. జిల్లాలోని సుమారు 500లకు పైగా ఆస్పత్రుల్లో వైద్య సేవలు నిలిచిపోయాయి. ప్రకాశం జిల్లాలోనూ ప్రైవేట్ ఆసుపత్రులన్నీ వైద్యసేవలు నిలిపివేశాయి. ఒంగోలులో, గుంటూరు జిల్లా తాడికొండలో ఉపాధ్యాయులు భారీ ర్యాలీ చేపట్టారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరులో ఆర్టీసీ ఉద్యోగులు బస్సులతో ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు టవర్క్లాక్ సెంటర్లో మానవహారం నిర్వహించారు. అనంతపురంలో విద్యుత్ ఉద్యోగులు ఎస్ఈ కార్యాలయం ఎదుట మహాధర్నా చేపట్టారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల వైద్య సిబ్బందితో పాటు, ల్యాబ్ టెక్నీషియన్లు ల్యాబ్లు మూసేసి నగరంలో భారీ ప్రదర్శన నిర్వహించారు.
కర్నూలులో ఈనెల 29న బహిరంగ సభ నిర్వహించనున్నట్లు సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక జిల్లా చైర్మన్ వి.సి.హెచ్.వెంగల్రెడ్డి తెలిపారు. మార్కెటింగ్ శాఖ, వ్యవసాయ మార్కెట్ కమిటీల అధికారులు, ఉద్యోగులు ఈనెల 19వ తేదీ అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మె చేపట్టనున్నట్లు ప్రకటించారు. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు వైద్యులు ఆస్పత్రులకు తాళాలు వేసి, నిరసన తెలియజేశారు. వైఎస్సార్ జిల్లా పోరుమామిళ్లలో పశువైద్యాధికారులు ఎడ్లబండ్లతో ర్యాలీ, మానవహారం నిర్వహించారు.
రాజంపేటలో ఉపాధ్యాయులు రోడ్డుపై పాఠాలు బోధించి నిరసన తెలిపారు. జమ్మలమడుగులో డిగ్రీ కాలేజీ లెక్చరర్లు ర్యాలీ నిర్వహించి అనంతరం పిడతలతో ‘సమైక్యభజన’ నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని మోరంపూడి వద్ద జాతీయ రహదారిపై ఉపాధ్యాయులు మానవహారం నిర్వహించి నోట్లో పాల పీకలతో నిరసన తెలిపారు. కోనసీమలో ప్రైవేట్ విద్యాసంస్థల బంద్ నిర్వహించారు. రాజమండ్రి, కాకినాడ, అమలాపురంలో ప్రైవేట్ నర్సింగ్ హోంలు బంద్ పాటించాయి. జగ్గంపేటలో సుమారు అయిదు వేల మందితో సమైక్య సింహగర్జన నిర్వహించారు. విశాఖలోని ఆంధ్రా యూనివర్సిటీలో 600మంది ఉద్యోగులు సామూహికంగా నిరశన దీక్షలో పాల్గొన్నారు. గాజువాకలో విద్యార్థులు మానవహారంగా ఏర్పడ్డారు. వంగపండు తన ఆటాపాటలతో అలరించారు.
రాష్ట్రంలో అందరి బతుకుబాగుండాలని బతుకమ్మలతో పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో విద్యార్థినులు ప్రదర్శన నిర్వహించారు. పాలకుల మనసు మార్చి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని శ్రీకాకుళం జిల్లా పాలకొండలో మహిళలు ఘటాలతో కోటదుర్గమ్మ ఆలయానికి వెళ్లి, ప్రత్యేక పూజలు చేశారు. నివగాం గ్రామస్తులు అమ్మవారికి ముర్రాటలు సమర్పించారు. కవిటి మండలంలో సుమారు 200 మంది రైతులు ర్యాలీ చేపట్టి మానవహారంగా ఏర్పడ్డారు. సీతంపేట మండలం గొయిది గ్రామస్తులు వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలోని శాంతి ర్యాలీ నిర్వహించారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో బ్రాహ్మణులు రాష్ట్రంలో సుఖశాంతులు వృద్ధి చెందాలని కోరుతూ రోడ్డుపై కూర్చొని అష్టోత్తర శతనామాలు, విష్ణు సహస్రనామ పారాయణం చేశారు. నెల్లిమర్లలో విజయనగరం- పాలకొండ రహదారిని మెడికల్ కళాశాల విద్యార్థులు దిగ్బంధించారు.
విభజన భయంతో ఒంటికి నిప్పంటించుకుని...
రాష్ట్ర విభజన భయంతో ఓ యువకుడు బలిదానానికి యత్నించాడు. విభజన ప్రకటన వెలువడిన రోజు నుంచి తీవ్ర మానసిక వేదనకు గురైన కర్నూలు నగరంలోని వడ్డేగేరి కాలనికి చెందిన షేక్ అబ్దుల్ఖాన్(30) మంగళవారం టీవీలో వార్తలు చూస్తూ ఒంటిపై నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన మేరకు.. విభజన ప్రకటన వెలువడి 50 రోజులవుతున్నా కేంద్రం స్పందించకపోవడంతో తీవ్రంగా కలత చెందాడు. తెలంగాణ కోసం అక్కడి ప్రజలు ఆత్మాహుతి చేసుకున్నారు. అలాగే తానూ చేసుకుంటే తప్పేంటని కుటుంబసభ్యులతో తరచూ చెప్పేవాడు. అన్నట్లుగానే మంగళవారం మధ్యాహ్నం మిద్దెపెకైక్కి కిరోసిన్ పోసుకుని నిప్పటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
ఒకే భాష... ఒక్కటే రాష్ట్రం
Published Wed, Sep 18 2013 2:32 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆర్మీ ఉద్యోగికి జైలుశిక్ష
హిందూ, ముస్లింలను వేరు చేస్తున్న బీజేపీ
మూగ జీవాలను రక్షించుకోవాలి..
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement