'సీమాంధ్ర కేంద్ర మంత్రులు కాంగ్రెస్ అధిష్టానానికి తొత్తులు' | Sakshi
Sakshi News home page

'సీమాంధ్ర కేంద్ర మంత్రులు కాంగ్రెస్ అధిష్టానానికి తొత్తులు'

Published Sat, Nov 16 2013 3:23 PM

Seemandhra Union Ministers are puppets in the hands of Congress High Command

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసేందుకే సోనియా గాంధీ విభజిస్తున్నారని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్ రెడ్డి ఆరోపించారు. సీమాంధ్ర ప్రాంత ప్రజల మనోభావాలను కేంద్ర మంత్రులు పట్టించుకోవడం లేదంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 

 

కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి కేంద్ర మంత్రులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇప్పటికైన కేంద్రమంత్రులు వెంటనే తమ మంత్రి పదవులకు రాజీనామా చేయాలని సురేష్ రెడ్డి డిమాండ్ చేశారు.

Advertisement
Advertisement