కిర్లంపూడి : కిర్లంపూడి మండలం వీరవరం గ్రామానికి చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు తోట రామస్వామి సోమవారం మధ్యాహ్నం కాకినాడ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన చాలాకాలం పాటు కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. పెద్దాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆ పార్టీ తరఫున పలుమార్లు టిక్కెట్ ఆశించారు. ఇటీవలి సార్వత్రిక ఎన్నికలకు ముందు తన మేనల్లుడైన చలమలశెట్టి సునీల్.. కాకినాడ లోక్సభ నియోజకవర్గం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేయడంతో ఆ పార్టీలో చేరారు.
కిర్లంపూడి మండలంలోనే కాకుండా పెద్దాపురం నియోజకవర్గ స్థాయిలో ఆయన కీలక నాయకునిగా వ్యవహరిస్తూ వచ్చారు. నాలుగు రోజుల క్రితం అస్వస్థతకు గురవడంతో కాకినాడలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మధ్యాహ్నం మృతి చెందారు. బంధువులు, వివిధ పార్టీల నాయకులు వీరవరంలో రామస్వామి మృతదేహానికి నివాళులర్పించారు. కాకినాడ ఎంపీ తోట నరసింహంతోపాటు చలమలశెట్టి సునీల్, చలమలశెట్టి గోపి, జగ్గంపేట పీఏసీఎస్ అధ్యక్షురాలు, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సతీమణి జ్యోతుల మణి, జ్యోతుల కుమార్తె సునీత, సోదరుడు సుబ్బారావులు రామస్వామి మృతదేహాన్ని సందర్శించి కుటుంబ సభ్యులను ఓదార్చారు.
తోట రామస్వామి మరణ వార్త విని తీవ్ర దిగ్భ్రాంతికి గురైన జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, హైదరాబాద్ నుంచి ఫోనులో ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సంతాపం తెలిపారు. రామస్వామి కుటుంబాన్ని పరామర్శించినవారిలో విశాఖ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ తోట నగేష్, మాజీ ఎమ్మెల్యే పంతం గాంధీమోహన్, వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు తోట ఈశ్వరరావు, తోట గాంధీ తదితరులున్నారు.
సీనియర్ రాజకీయ నాయకుడు తోట రామస్వామి మృతి
Published Tue, Jun 24 2014 12:15 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
హోమ్ ఓటింగ్ ప్రక్రియ వేగవంతం చేయండి
మోదీని ఆపే దమ్ము కేసీఆర్కే ఉంది
కాలవ అండ .. కరిగిన కొండ!
వైఎస్ జగన్తోనే సంక్షేమం
ప్రమాదంలో ఒకరి మృతి
ఐస్క్రీం తిని 100 మందికి అస్వస్థత
పాండవపురలోనూ అబార్షన్ దందా
స్టీరింగ్ విరిగి.. వరి మడిలోకి
కస్టడీలో రేవణ్ణ విచారణ
వీడియో బాధితుల కోసం సిట్ సహాయవాణి
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement