పందుల దాడిలో చిన్నారులకు తీవ్ర గాయాలు | Sakshi
Sakshi News home page

పందుల దాడిలో చిన్నారులకు తీవ్ర గాయాలు

Published Sun, Jan 17 2016 1:15 PM

Serious injuries in the pigs attack on children

విజయనగరం జిల్లా నెల్లిమర్ల పట్టణంలో పందుల దాడిలో ఇద్దరు చిన్నారులకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఆదివారం ఉదయం పట్టణంలోని సెగిడి వీధిలో సోదరులైన మొకర హర్షవర్దన్ (8), మొకర వైభవ్ (7) ఇంటి సమీపంలో మూత్ర విసర్జనకు వెళ్లగా... పందులు దాడి చేశాయి. ఇద్దరికీ తీవ్ర గాయాలు అవగా విశాఖలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.



 

Advertisement

తప్పక చదవండి

Advertisement