నూజివీడు : మతిస్థిమితం లేని వ్యక్తిని దొంగ గా భావించి స్తంభానికి కట్టేసి కొట్టి చంపిన కేసులో నూజివీడు మండలం అన్నవరం గ్రా మానికి చెందిన ఏడుగురు నిందితులను బుధవారం పోలీసులు అరెస్టు చేశారు. సీఐ కేవీ స త్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. అ న్నవరంలో ఈనెల తొమ్మిదో తేదీ రాత్రి సమయంలో సంచరిస్తున్న ముదినేపల్లి చిగురుకోటకు చెందిన మతిస్థిమితం లేని సంధి బెంజి మన్(46)ను దొంగగా భావించి గ్రామస్తులు పలువురు స్తంభానికి కట్టివేసి చితకబాదారు.
ఈ ఘటనలో బెంజిమన్ మరణించాడు. దీని పై కేసు నమోదైంది. దర్యాప్తు సందర్భంగా గ్రామానికి చెందిన ఎనిమిది మందిని నిందితులుగా గుర్తించారు. వారిలో పోలిశెట్టి సీతారామయ్య, లేళ్ల గోపాలరావు, యాదల వెంకటేశ్వరరావు, పాటిమీద ప్రసాదరావు, దున్నపోతుల శ్రీనివాసరావు, మొలుగుమాటి కృష్ణమోహన్, మట్టా రామకృష్ణలను బుధవారం ఉదయం అన్నవరంలో అరెస్టు చేశారు. మరో నిందితుడు అబ్బసాని అవినాష్ను అరెస్టు చేయాల్సి ఉందని సీఐ పేర్కొన్నారు.
ఈ కేసులో మరికొంతమంది నిందితులున్నారని, వారిని గుర్తించాల్సి ఉందన్నారు. మృతుడు బీ టెక్ చదివాడని, విజయవాడలోని ఓ ప్రైవేటు మందుల కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్గా కూడా పనిచేశాడన్నారు. ఇతనికి ఇద్దరు సోదరీమణులు, ఒక సోదరుడు ఉన్నారన్నా రు. ఇ తని తండ్రి కూడా విజయవాడలోని అదే కంపెనీలో ఏజీఎంగా పనిచేశాడన్నారు. బెంజిమన్ మతిస్థిమితం లేకపోవడంతో ఊళ్ల వెంట తిరుగుతాడని కుటుంబసభ్యులు తెలిపారన్నారు. అన్నవరం వాసులు తొందరపాటుతో దొంగ గా భావించి కొట్టడంతోచనిపోయాడన్నారు.
ఎవరినీ కొట్టవద్దు
రాత్రి వేళల్లో అనుమానాస్పదంగా తిరిగేవారిని గ్రామస్తులు ఎక్కడైనా పట్టుకుంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలే గానీ కొట్టవద్దని సీఐ సత్యనారాయణ సూచించారు. చట్టాన్ని ఎవరూ కూడా తమ చేతులలోకి తీసుకోవడానికి వీల్లేదన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.
బెంజిమన్ హత్య కేసులో ఏడుగురి అరెస్టు
Published Thu, Jul 17 2014 1:51 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
హోమ్ ఓటింగ్ ప్రక్రియ వేగవంతం చేయండి
మోదీని ఆపే దమ్ము కేసీఆర్కే ఉంది
కాలవ అండ .. కరిగిన కొండ!
వైఎస్ జగన్తోనే సంక్షేమం
ప్రమాదంలో ఒకరి మృతి
ఐస్క్రీం తిని 100 మందికి అస్వస్థత
పాండవపురలోనూ అబార్షన్ దందా
స్టీరింగ్ విరిగి.. వరి మడిలోకి
కస్టడీలో రేవణ్ణ విచారణ
వీడియో బాధితుల కోసం సిట్ సహాయవాణి
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement