వైఎస్ఆర్‌సీపీలో టీడీపీ నేతల చేరిక | Sakshi
Sakshi News home page

వైఎస్ఆర్‌సీపీలో టీడీపీ నేతల చేరిక

Published Tue, May 30 2017 6:04 PM

వైఎస్ఆర్‌సీపీలో టీడీపీ నేతల చేరిక - Sakshi

ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గానికి చెందిన పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కంభం మండలం పెద్ద నల్లకాల్వ గ్రామానికి చెందిన 50 మంది వరకు నేతలు, కార్యకర్తలు మంగళవారం నాడు వైఎస్ఆర్‌సీపీలో చేరారు.

నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసేందుకు నియోజకవర్గ ఇన్‌చార్జి ఐవీ రెడ్డితో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు వాళ్లు తెలిపారు. నాయకులకు ఐవీ రెడ్డి పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కంభం మండల పార్టీ కన్వీనర్ రామిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కంభం మండల వైఎస్ఆర్‌సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement