గొర్రెల మందపై దూసుకెళ్లిన లారీ | Sakshi
Sakshi News home page

గొర్రెల మందపై దూసుకెళ్లిన లారీ

Published Mon, Apr 27 2015 5:50 PM

sheep farmer and 27 sheeps died in accident

పాచిపెంట : గొర్రెల మందపై దూసుకెళ్లిన ఓ లారీ 27 గొర్రెలతో పాటు గొర్రెల కాపరిని కూడా పొట్టన పెట్టుకుంది. వివరాల ప్రకారం... విజయనగరం జిల్లా పాచిపెంట మండలం గంగన్‌దొరవలస గ్రామ సమీపంలో సోమవారం గొర్రెల మందపైకి ఓ లారీ దూసుకెళ్లింది.

ఈ ఘటనలో గొర్రెల కాపరి రొయ్యి గంగరాజు(15)తోపాటు, అతని 27 గొర్రెలు అక్కడిక్కడే మృతిచెందాయి. ప్రస్తుతం లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement