సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రచార యావ అధికారులనే విస్మయ పరుస్తోంది. ఇదే ప్రచార యావతో గోదావరి పుష్కర కార్యక్రమాల నిర్వహణను సినిమా తరహాలో చిత్రీకరణకు పూనుకుని తొక్కిసలాటకు కారణమయ్యారని, 29 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయినా చంద్రబాబు వైఖరిలో ఎలాంటి మార్పూ రాలేదని ఉన్నతాధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. తాజాగా తిత్లీ ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యలను ఎక్కడికక్కడ వీడియోల్లో చిత్రీకరించాల్సిందిగా ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ మేరకు ప్రభుత్వం అన్ని శాఖలకు ఆదేశాలు జారీ చేసింది. ఆయా శాఖల వద్ద వీడియో కెమెరాలు ఉంటే సరేనని.. లేనిపక్షంలో తక్షణమే వీడియో గ్రాఫర్లను నియమించుకోవాలని సూచించింది.
బాధితులకు భోజనం అందించడం, మంచినీటి సరఫరాతో పాటు పడిపోయిన చెట్లు తొలగించడం, విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేయడంతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్లు తుపాను బాధితులతో కలసి ఉన్న ఫొటోలతో కూడిన వీడియోలను రూపొందించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ వీడియోలన్నింటితో డాక్యుమెంటరీని రూపొందించి సినిమా థియేటర్లలో ప్రదర్శించడం ద్వారా ప్రచారం పొందాలనేది ముఖ్యమంత్రి యోచన అని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఒక పక్క బాధితులను ఆదుకోవడానికి విరివిగా విరాళాలు ఇవ్వాల్సిందిగా పిలుపునిస్తూ మరోపక్క ప్రజా ధనాన్ని ఇలా ప్రభుత్వ ప్రచారం కోసం దుర్వినియోగం చేస్తుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హుద్హుద్ తుపాను సమయంలో కూడా ప్రచారం కోసం రూ.36.63 లక్షల రూపాయలను వ్యయం చేశారని, సహాయక చర్యలతో ప్రచార ప్రకటనలను జారీ చేశారని ఒక ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు.
చంద్రబాబు సమర్పించు.. తిత్లీ సినిమా!
Published Wed, Oct 24 2018 4:57 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- అబద్ధాల వసంతం.. గ్రూపు రాజకీయాలే ఆసాంతం
- మహిళలపై టీడీపీ అభ్యర్థి అనుచిత వ్యాఖ్యలు
- అవన్నీ అపోహలే
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
Advertisement