విశాఖపట్నం : గిరిజన ప్రాంతాల్లో ఆదివాసీ పార్టీయే ఉండాలని విశ్రాంత ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ పేర్కొన్నారు. గిరిజనులు పార్టీల వారీగా చీలిపోయూరని, ఐక్యంగా ఉంటే ప్రభుత్వాలే దారికొస్తాయని గిరిజనులకు సూచించారు. ఆదివాసీల సమస్యల పరిష్కారం కోరుతూ జి.మాడుగుల, చింతపల్లి, కొయ్యూ రు, గూడెం కొత్తవీధి, పాడేరు, అనంతగిరి ప్రాంతాల నుంచి గిరిజనులు గురువారం విశాఖకు తరలివచ్చారు.
రైల్వే స్టేషన్ నుంచి సౌత్ జైల్రోడ్డు మీదుగా జీవీఎంసీ గాంధీ పార్కు వరకు ప్రదర్శనగా వచ్చి సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. దీక్షనుద్దేశించి శర్మ మాట్లాడుతూ శాంతియుతంగా చేసే ఏ ఉద్యమానికైనా బలం చేకూరుతుందని, ప్రతి వారు గాంధీ మార్గంలో నడవాలని గిరిజనులకు సూచించారు. అడవుల విషయంలో ఆదివాసీలకు చారిత్రక అన్యాయం జరుగుతుందని సాక్షాత్తు భారత పార్లమెంట్ అంగీకరించిందన్నారు. అన్యాయూన్ని సరిచేసేందుకు అటవీ హక్కుల చట్టాన్ని 2006లో తెచ్చారని,చట్టం అమలు విశాఖ ఏజెన్సీలో ఘెరంగా ఉందన్నారు.
ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ వృత్తిదారుల యూనియన్ కార్యదర్శి జి.బాలు, రైతు స్వరాజ్య వేదిక కన్వీనర్ పి.ఎస్.అజయ్కుమార్ మాట్లాడుతూ సాంప్రదాయ కుంచాలతో సరుకులు కొనుగోలు చేయడాన్ని ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద నేరంగా ప్రకటించాలని కోరారు. తూనికలు, కొలతల చట్టాన్ని అమలు పరిచే అధికారాలు గ్రామ సభలకు ఇవ్వాలని, వడ్డీ వ్యాపారం చేసేవారు నగదు రూపంలో తప్ప ఆదివాసీలు పండించిన పంటలు తీసుకోవడాన్ని నిషేధించాలని డిమాండ్ చేశారు. ఆదివాసీలకు ఇచ్చిన సాధారణ రేషన్కార్డులను అంత్యోదయ అన్న యోజన కార్డులుగా మార్చాలని కోరారు.
Breadcrumb
ఏజెన్సీలో గిరిజన పార్టీయే ఉండాలి
Published Fri, Oct 3 2014 12:55 AM
Related news
-
కొత్తపల్లి గీతకు డిపాజిట్ దక్కేనా?
సాక్షి, విశాఖపట్నం: ఆమె పేరు కొత్తపల్లి గీత. 2014లో అరకు పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి వైఎస్సార్సీపీ తరఫున ఎంపీగా గెలుపొందారు. అప్పట్లో ఆమెకు 4,13,191 ఓట్లు పోలయ్యాయి. సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి గుమ్మడి సంధ్యారాణిపై ఆమె 91,398 ఓట్ల మెజారిటీ సాధించారు. ఎంపీ అయిన కొన్నాళ్లకే ఆమె వైఎస్సార్సీపీని వీడారు. ఆపై 2018లో సొంతంగా జన జాగృతి పార్టీని స్థాపించారు. ఆ పార్టీ తరఫున 2019 ఎన్నికల్లో విశాఖపట్నం లోక్సభ స్థానం నుంచి బరిలో నిలిచారు. 2014లో అరకు నుంచి 4 లక్షలకు పైగా ఓట్లను, 90 వేలకు పైగా ఆధిక్యాన్ని సాధించిన ఆమె అదంతా తన బలంగా భావించారు. ఆ నమ్మకంతో 2019 ఎన్నికల్లో పోటీ చేసిన ఆమెకు తన సత్తా ఏపాటిదో తెలిసొచ్చింది. 2019 ఎన్నికలకు విశాఖ లోక్సభ నియోజకవర్గంలో 18,29,300 మంది ఓటర్లున్నారు.వీరిలో 12,39,754 ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరిలో కొత్తపల్లి గీతకు 1,158 మంది మాత్రమే ఓట్లు వేశారు. ఇది మొత్తం ఓట్లలో 0.09 శాతం మాత్రమే కావడం విశేషం. దీంతో ఆమె డిపాజిట్లు కోల్పోవడమే కాదు.. నోటాకు పడిన ఓట్లలో ఒక శాతం కూడా పొందలేక పోయారు. 2019 విశాఖ లోక్సభ స్థానానికి 14 మంది పోటీ చేశారు. వీరందరిలో ఆమె అత్యల్పంగా 1,158 ఓట్లు మాత్రమే సాధించి 13 వ స్థానంలో నిలిచారు. మిగిలిన 12 మంది ఆమెకంటే ఎక్కువ ఓట్లను సాధించిన వారే! వీరిలో విజయం సాధించిన వైఎస్సార్సీపీ అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణకు 4,36,906 ఓట్లు లభించాయి. ఆ తర్వాత టీడీపీ అభ్యర్థి భరత్కు 4,32,492, జనసేన అభ్యర్థి వీవీ లక్ష్మీనారాయణకు 2,88,874, బీజేపీ అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరికి 33,892, నోటాకు 16,646 ఓట్లు వచ్చాయి. బలం తెలిసి.. బీజేపీలో చేరి.. 2019 ఎన్నికల్లో ఘోర పరాజయంతో జనంలో తనకు వ్యక్తిగతంగా ఎంత బలముందో గీతకు తేటతెల్లమైంది. 2014లో వచ్చిన ఓట్లను చూసి తనను తాను అతిగా ఊహించుకున్న ఆమెకు అదంతా తన బలం కాదన్న వాస్తవం అర్థమైంది. దీంతో ఎన్నో ఆశలతో స్థాపించిన జన జాగృతి పార్టీకి మనుగడ లేదన్న నిర్ధారణకు వచ్చిన ఆమె ఆ పార్టీ చాప చుట్టేసి 2019 జూన్లో బీజేపీలో విలీనం చేశారు. తాను కూడా బీజేపీలో చేరిపోయారు. అరకులో మరోసారి పరీక్ష ఈసారి ఎన్నికల్లో కొత్తపల్లి గీత అరకు లోక్సభ స్థానం నుంచి బీజేపీ అభ్యరి్థగా పోటీ చేస్తున్నారు. అరకు నుంచి మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. గత ఎన్నికల్లో కనీసం 1,200 ఓట్లు కూడా తెచ్చుకోలేని గీత ఈ ఎన్నికల్లో ఎలా విజయం సాధిస్తారోనని అరకు పార్లమెంటరీ నియోజకవర్గంతో పాటు ఉమ్మడి విశాఖ జిల్లా ఓటర్లు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. తొలిసారి ఎంపీగా పోటీ చేసి నాలుగు లక్షలకు పైగా ఓట్లతో గెలిచి.. ఆ తర్వాత ఎన్నికల్లో పోటీ చేసి వందల ఓట్లకు దిగజారిన అభ్యర్థి ఈమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
Road Accident: నక్కపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం
విశాఖపట్నం : వారు ప్రయాణిస్తున్న కారు యమదూతలా మారింది.. టైరు రూపంలో యమపాశం విసిరింది.. జాతీయ రహదారిపై వెదుళ్లపాలెం వద్ద జరిగిన ఘోర ప్రమాదం రెప్పపాటులో ముగ్గురి ప్రాణాలు హరించింది. రెండు కుటుంబాల్లో విషాదం నింపింది. వివరాలివి. జీవీఎంసీ 91వ వార్డు గవరవీధి, ఎన్ఏడీ జంక్షన్, కూర్మనపాలెం ప్రాంతాలకు చెందిన నలుగురు కారులో శనివారం ఉదయం కాకినాడ బయలు దేరారు. శరగడం వెంకటలక్ష్మి (37) తన కొడుకు వికాస్, మేనమామ కొడుకు దాడి గగన్ (15)లతో కలిసి వ్యక్తిగత పనిమీద కారులో ప్రయాణమయ్యారు. వీరితో పాటు వికాస్ స్నేహితుడైన సుంకర మధుకర్(27) బయలుదేరాడు.పాయకరావుపేటలో వెంకటలక్ష్మి తల్లిని చూసి అక్కడ నుంచి కాకినాడ వెళ్లాలనుకున్నారు. కారు వెదుళ్లపాలెం జంక్షన్ వద్దకు చేరుకునే సరికి హఠాత్తుగా టైరు పేలడంతో అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టి అవతల రూట్లోకి దూసుకుపోయింది. తుని నుంచి విశాఖ వైపు వెళ్తున్న కంటైనర్ లారీని ఢీకొట్టడంతో కారు ముందు భాగం నుజ్జు నుజ్జయింది. ఈ ఘటనలో కారులో ఉన్న వెంకటలక్ష్మి, దాడి గగన్, సుంకర మధుకర్ అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ప్రమాద తీవ్రతకు కారు టాప్ పైకి లేచిపోయింది. డోర్లు ఊడిపోయాయి. ప్రమాదంలో వికాస్ ప్రాణాలతో బయటపడ్డాడు. తీవ్ర గాయాలపాలైన అతన్ని నక్కపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రెండు నెలల్లో జర్మనీ వెళ్లాల్సి ఉండగా.... వికాస్ స్నేహితుడైన మధుకర్ విశాఖ స్టీల్ప్టాంట్లో మెకానికల్ విభాగంలో అప్రెంటీస్ చేస్తున్నట్టు తెలిసింది. తుని ప్రాంతానికి చెందిన అతడు ఎన్ఏడీ జంక్షన్లో ఉంటున్నాడు. అతడు రెండు నెలల్లో ఉన్నత చదువు, ఉద్యోగం కోసం జర్మనీ వెళ్లడానికి ఏర్పాట్లు చేసుకున్నాడు. ఇంతలోనే మృత్యువు రోడ్డు ప్రమాద రూపంలో కబళించి అనంత లోకాలకు తీసుకెళ్లిపోయింది. విషయం తెలిసిన కుటుంబ సభ్యులు హుటాహుటిన నక్కపల్లి చేరుకుని కన్నీరు మున్నీరుగా విలపించారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు దుర్మరణం పాలవడంతో విషయం తెలుసుకున్న బంధువులు, కుటుంబ సభ్యులు సంఘటన స్దలానికి చేరుకుని రోదించారు. కారులో చిక్కుకున్న మృతదేహాలను స్థానికుల సాయంతో పోలీసులు బయటకు తీసి పోస్టుమార్టం కోసం నక్కపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ విజయ్కుమార్ తెలిపారు.గవరవీధిలో విషాదఛాయలు గోపాలపట్నం: వెదుళ్లపాలెం జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదంలో శరగడం వెంకటలక్ష్మి మృతి చెందగా ఆమె కుమారుడు వికాస్ గాయాలపాలవడంతో గవరవీధిలో విషాదఛాయలు అలుముకున్నాయి. గవరవీధిలో ఉంటున్న శరగడం నర్సింగరావు సప్లయర్ దుకాణం నిర్వహిస్తున్నాడు. రోడ్డు ప్రమాదంలో అతడి భార్య వెంకటలక్ష్మి మృతి చెందగా కుమారుడు వికాస్ గాయాలపాలయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న బంధువులు, స్నేహితులు, స్థానికులు పెద్ద ఎత్తున ఇంటికి తరలివచ్చి కన్నీరుమున్నీరయ్యారు. వెంకటలక్ష్మి ఎప్పుడు నవ్వుతూ నవి్వస్తూ అందరితో కలివిడిగా ఉండేదని స్థానికులు చెబుతున్నారు. ప్రమాదంలో మృతి చెందిన దాడి గగన్ది కూర్మన్నపాలెం కాగా.. శనివారం ఉదయం టోల్గేట్ వద్ద కారు ఎక్కాడు. -
ఏయూను వదలని ‘ఎల్లో’ కుతంత్రం!
సాక్షి, విశాఖపట్నం: ఎన్నికలు సమీపిస్తుండటంతో ఎల్లో మీడియా బరితెగించేస్తోంది. అధికారులు, పోలీసులు, వలంటీర్లు.. ఇలా ప్రతి ఒక్కరినీ తప్పుపడుతూ సొంత తీర్పులిచ్చేస్తున్న ఎల్లో మీడియా ఇప్పుడు విశ్వవిద్యాలయాలను కూడా వాటి పని వాటిని చేసుకోనీయడం లేదు. ప్రతిదానికి యాగీ చేయడం.. వైఎస్సార్సీపీకి అనుకూలంగా ప్రచారం చేసేస్తున్నారని అసత్యాలు, అబద్ధాలు అచ్చేయడమే పనిగా పెట్టుకుంది. చివరకు జాతీయ స్థాయిలో పేరు ప్రతిష్టలున్న ఆంధ్రా విశ్వవిద్యాలయాన్ని కూడా ఎల్లో మీడియా తమ రాజకీయ ప్రయోజనాలకు రోడ్డుకు ఈడుస్తోంది. ఇదెలా తప్పు? ఆంధ్రా యూనివర్సిటీలో చదువుకుని ఉద్యోగాలు సాధించినవారికి శుక్రవారం వారి తల్లిదండ్రుల చేతుల మీదుగా అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వాలని విశ్వవిద్యాలయం సంకల్పించింది. అయితే ఇందులో కూడా ఎల్లో మీడియా తప్పులు వెతికింది. ఎచీవర్స్ డే పేరిట విద్యార్థులను, వారి తల్లిదండ్రులను పిలిపించి వైఎస్సార్సీపీకి అనుకూలంగా ప్రచారం చేస్తారని అభూతకల్పనలతో ఈనాడు పత్రిక ఒక అశుద్ధ కథనం అచ్చేసింది. ఏయూ ఈ కార్యక్రమం ఏర్పాట్లు చేస్తుంటే ఎన్నికల సంఘం ఏం చేస్తోందని.. తన కథనంలో రంకెలేసింది. దీంతో ఈనాడు పత్రిక దుర్బుద్ధికి భయపడిన అధికారులు అచీవర్స్ డేని రద్దు చేస్తున్నట్టు గురువారం ప్రకటించారు. ఫలితంగా ఏయూలో చదువుకుని ఉద్యోగాలు సాధించి తమ తల్లిదండ్రుల చేతుల మీదుగా అపాయింట్మెంట్ ఆర్డర్లు తీసుకోవాలని ఆశించిన 2,287 మంది తీవ్రంగా నిరాశ చెందారు. కాగా టీడీపీ విశాఖ ఎంపీ అభ్యర్థి శ్రీభరత్కు చెందిన గీతం యూనివర్సిటీ మాత్రం ఎలాంటి ఎన్నికల కోడ్ వర్తించదంటూ ఏప్రిల్ 24న అచీవర్స్ డే నిర్వహించడం గమనార్హం. అక్రమాల ‘గీతం’ కోసమే పన్నాగం.. ఈ ఏడాది ఏయూ సైన్స్ కళాశాల పరిధిలో 802, ఇంజనీరింగ్లో 900, ఆర్ట్స్లో 410, బీఈడీలో 175కి పైగా ఉద్యోగాలు విద్యార్థులకు లభించాయి. ఏ ప్రభుత్వ విశ్వవిద్యాలయానికి ఇప్పటి వరకూ సాధ్యం కాని రికార్డును ఏయూ సొంతం చేసుకుంది. సైన్స్లో ఏకంగా 802 ఉద్యోగాలు రావడం ఇదే తొలిసారి. ఇంతటి ఘనమైన కీర్తిని సొంతం చేసుకున్న సమయంలో అచీవర్స్డేని తప్పుపడుతూ, దాన్ని ఎన్నికలకు ముడిపెడుతూ ఈనాడు పత్రిక తన దుర్బుద్ధిని చాటుకుంది. విద్యార్థి విశ్వవిద్యాలయంలో చేరినప్పుడు నిర్దేశించుకున్న లక్ష్యాన్ని సాధించిన సందర్భంగా ఏటా ఏయూలో అచీవర్స్ డే నిర్వహిస్తున్నారు.వేదికపై విద్యాన్థితో పాటు వారి తల్లిదండ్రులను సత్కరించి, వారికి విద్యార్థితో పాదాభివందనం చేయిస్తారు. ఏయూలో విద్యార్థులకు నియామక పత్రాలు అందించి, తల్లిదండ్రులను గౌరవించే ఈ కార్యక్రమాన్ని నేషనల్ అక్రిడిటేషన్ కౌన్సిల్ (నాక్) నిపుణుల బృందం సైతం ఇటీవల ప్రశంసించింది. అయితే దీన్ని ఈనాడు పత్రిక తట్టుకోలేకపోయింది. పేద కుటుంబాల పిల్లలకు లక్షల రూపాయల వేతనాలతో ఉద్యోగాలు సాధించడంతో ప్రభుత్వ యూనివర్సిటీ అయిన ఏయూ ప్రతిష్ట పెరిగింది. దీంతో టీడీపీ నేత భరత్కు చెందిన గీతం యూనివర్సిటీకి, టీడీపీకి కంటగింపుగా ఏయూ మారింది. టీడీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న భరత్ స్వయంగా గీతం డీమ్డ్ వర్సిటీకి అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన తన వర్సిటీ ఉద్యోగులతో విద్యార్థుల్ని, వారి తల్లిదండ్రుల్ని సిబ్బంది ప్రభావితం చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అనుమతి ఇచ్చి రద్దు చేశారు.. క్లాజ్ –22 ప్రకారం ఎన్నికల సమయంలోనైనా యూనివర్సిటీల పరిధిలో అపాయింట్మెంట్స్, రిక్రూట్మెంట్స్ ఆపడానికి వీల్లేదు. అందుకే.. 15 రోజుల ముందుగానే జాయింట్ కలెక్టర్ డా.మయూర్ అశోక్కు ఏయూ అధికారులు అచీవర్స్ డే కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఎలాంటి అభ్యంతరం లేదని జేసీ కూడా అనుమతులు మంజూరు చేశారు. అచీవర్స్ డే కోసం విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఇప్పటికే విశాఖకు చేరుకున్నారు. అయితే ఈనాడు విషకథనంతో అధికారులు చివరి క్షణంలో అచీవర్స్ డేకు ఇచ్చిన అనుమతులను రద్దు చేశారు. నేనెలా ప్రభావితమవుతాను? నాకు 22 ఏళ్లు. పూర్తి పరిణితి చెందిన నేను సమావేశంలో ఒక వ్యక్తి చెప్పే ప్రసంగానికి ప్రభావితమై ఓటు వేస్తానని ఎలా అనుకుంటున్నారు? విద్యను రాజకీయంతో ముడిపెట్టడం ఏమాత్రం సరికాదు. ఏటా అచీవర్స్ డేను నిర్వహిస్తుండగా ఈ ఏడాది అడ్డుకోవడం తప్పు. – ఒ.గోవర్ధన్, బయోటెక్నాలజీ విభాగంచాలా బాధగా ఉంది.. నేను నాలుగు ఉద్యోగాలకు ఎంపికయ్యాను. 10 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం వచ్చింది. తల్లిదండ్రుల సమక్షంలో అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకోవచ్చని చాలా సంతోషించాను. ఇప్పుడు అచీవర్స్డే రద్దు కావడం పట్ల చాలా బాధగా ఉంది. – ఎ.స్వాతి, స్టాటిస్టిక్స్ విభాగం -
తీరంలో లంగరు... భవిష్యత్తు బంగరు
సాగరమంటేనే జలనిధి...అపార మత్స్య సంపదకు పెన్నిధి... సాగర తీరాన వెలసిన రాజధానులు ఆయా రాష్ట్రాలకు ఆర్థిక సుసంపన్నతను సమకూర్చాయి..మత్స్యకారుల జీవనప్రమాణాలను పెంచాయి...వారి జీవితాల్లో ఆర్థిక వెలుగులు నింపాయి..పరిశ్రమల స్థాపనకు పునాదులు వేశాయి...ఆయా రాష్ట్రాల ఆర్థిక రూపురేఖలను మార్చేశాయి...ఈ ఆలోచనే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని విశాఖపట్నాన్ని పాలనారాజధానిగా చేయాలన్న గొప్ప సంకల్పానికి ప్రేరేపించింది...ఇప్పటిదాకా మనం గొప్పగా చెప్పడానికి విశాఖపట్నంలోని పోర్టు ఒక్కటే రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ రంగంలో కనిపిస్తోంది... దేశంలోనే సుదీర్ఘ తీరమున్న రెండో రాష్ట్రంగా గుర్తింపు పొందీ పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల ఏర్పాటుకు చాలా అవకాశమున్నా ...పాలించడం చేతకాని పద్నాలుగేళ్ల చంద్రబాబు పాలన వల్ల వాటి ఏర్పాటు సాధ్యం కాలేదు...సీఎంగా జగన్మోహన్రెడ్డి దూరదృష్టితో ఆలోచించడం వల్లే ఈ రోజు నాలుగు పోర్టులు, పది ఫిషింగ్ హార్బర్లు్ల రాష్ట్రానికి అపార సంపదనివ్వబోతున్నాయి...మత్స్యకారుల ఆర్థిక స్తోమతను పెంచబోతున్నాయి...మరెన్నో పరిశ్రమల స్థాపనకు ఈ పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు వేదికలు కాబోతున్నాయి... రాష్ట్ర పురోగమనానికి ఇలాంటి ఆలోచన ఉన్న నేతలు ఉంటేనే నలుచెరగులా ప్రగతి లంగరు వేస్తుంది... సీఎం జగన్ రూపంలో రాష్ట్రానికి బంగరు భవిష్యత్తు అద్దుకుంటోంది. – చంద్రశేఖర్ మైలవరపు, సాక్షి, అమరావతి పది ఫిషింగ్ హార్బర్లు...రాష్ట్రంలోని మత్స్యకారుల సుదీర్ఘ కల సాకారమవుతోంది. ఇంతకాలం వలస కూలీలుగా పొరుగు రాష్ట్రాలకు వెళ్లే మత్స్యకారులు ఇప్పుడు అధునాతన మెకనైజ్డ్ బోట్లు కొనుగోలు చేసుకుని చేపలు పట్టుకునే వెసులుబాటు అందుబాటులోకి వస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 555 మత్స్యకార గ్రామాల్లో 6.3 లక్షల మత్స్యకారులకు ప్రయోజనం కలి్పంచే విధంగా పది ఫిషింగ్ హార్బర్లు, ఆరు ఫిష్ ల్యాండింగ్ సెంటర్లను రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. ప్రతిపక్ష నాయకుడిగా జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రమంతా పాదయాత్ర చేస్తున్న సందర్భంలో రాష్ట్రంలో ఫిషింగ్ హార్బర్లు లేవన్న విషయాన్ని మత్స్యకారులు ఆయన దృష్టికి తెచ్చారు.రాష్ట్రంలో ఫిషింగ్ హార్బర్లు లేకపోవడంతో ఉపాధి కోసం గుజరాత్, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలకు వలస వెళ్లాల్సి వస్తోందంటూ మత్స్యకారులు వాపోయారు. తాను ముఖ్యమంత్రి కాగానే రాష్ట్రంలోని వీరికి స్థానికంగానే ఉపాధి కల్పించే విధంగా ఫిషింగ్ హార్బర్లు ఏర్పాటు చేస్తానని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. ఆ హమీ మేరకు రూ.3,66.07 కోట్లతో రెండు దశల్లో పది ఫిషింగ్ హార్బర్లను, రూ.126.91 కోట్లతో ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. దేశాన్ని సుసంపన్నం చేయడంలో జలధి ప్రాధాన్యం ఎనలేనిదని చైనా, సింగపూర్ వంటి దేశాలు ఏనాడో గుర్తించాయి. ఈ సత్యాన్ని గుర్తించే ఆ దేశాల ఆర్థిక వ్యవస్థలను పరుగులు పెట్టించడంలో పోర్టులు కీలకపాత్ర పోషిస్తున్నాయి. అత్యంత రద్డీ ఉండే ఓడరేవుగా సింగపూర్ అగ్రస్థానంలో ఉండగా , టాప్ 15 పోర్టుల్లో 8కి పైగా పోర్టులు ఒక్క చైనాలోనే ఉన్నాయి. మన దేశంలో చెన్నై, కోల్కతా, ముంబైలు మెట్రోపాలిటన్ నగరాలుగా మారడంలో పోర్టులు కీలకపాత్ర పోషించాయనడంలో సందేహం లేదు.దేశంలోనే రెండో అత్యంత పొడవైన 974 కి.మీ సుదీర్ఘ తీరప్రాంతం కలిగిన ఆంధ్రప్రదేశ్లో పోర్టులను అభివృద్ధి చేయడం ద్వారా కొత్త మహానగరాలుగా సృష్టించుకునే అవకాశమున్నప్పటికీ, ఆ దిశగా 14 ఏళ్ల పాటు సీఎంగా పనిచేసిన చంద్రబాబు ఏరోజూ పట్టించుకోలేదు. అసలు ఆ ఆలోచనే ఆయనకు లేదు. 2019లో ఎన్నికల ముందు ఎటువంటి అనుమతులు లేకుండా కేవలం ప్రచారం కోసం టెంకాయలు కొట్టి చేతులు దులిపేసుకున్నాడాయన. దీనికి భిన్నంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే రాష్ట్రానికి ఉన్న సుదీర్ఘ సముద్ర తీరాన్ని ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక ప్రాజెక్టులను చేపట్టింది. ప్రతి 50 కి.మీ.కు ఒక పోర్టు లేదా ఫిషింగ్ హార్బరు... ప్రతీ 50 కి.మీ.కు ఒక పోర్టు లేదా ఫిషింగ్ హార్బరు (మినీ పోర్టు)లు, ఫిష్ల్యాండ్ సెంటర్లను జగన్ ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఒకేసారి నాలుగు పోర్టులతో పాటు పది ఫిషింగ్ హార్బర్లు, ఆరు ఫిష్ ల్యాండ్ సెంటర్ల నిర్మాణాన్ని చేపట్టి రికార్డు సృష్టించింది. వీటికోసం సుమారు రూ.25,000 కోట్ల వ్యయం చేస్తుండటం అద్భుతం. రూ.3,736.14 కోట్ల వ్యయంతో రామాయపట్నం, రూ.5,155.73 కోట్లతో మచిలీపట్నం, రూ.4,361.91 కోట్లతో మూలపేట పోర్టులను రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తుండగా, పీపీపీ విధానంలో కాకినాడ సెజ్లో గేట్వే పోర్టును రూ.2,123.43 కోట్లతో అభివృద్ధి చేస్తున్నారు.రామాయపట్నం పోర్టు పనులు దాదాపు పూర్తి కావచ్చాయి. కేంద్ర కస్టమ్స్ శాఖ నుంచి అనుమతులు రాగానే తొలి నౌకను తీసుకురావడానికి సిద్ధంగా ఉంది. మచిలీపట్నం, మూలపేట పోర్టు పనులు వేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో విశాఖ, గంగవరం, కాకినాడ యాంకరేజ్, కాకినాడ, రవ్వ క్యాప్టివ్ పోర్టు, కృష్ణపట్నం పోర్టులు ఉండగా, 2025 నాటికి రాష్ట్రంలో పోర్టుల సంఖ్యను 10కి పెంచాలని జగన్ ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది.వాణిజ్య ఎగుమతుల్లో 5వ స్థానంలో రాష్ట్రం... వాణిజ్య ఎగుమతులను పెంచడం ద్వారా రాష్ట్రంలో ఉపాధి అవకాశాలను మెరుగు పరిచే విధంగా జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను అందిస్తున్నాయి. 2019లో దేశ వాణిజ్య ఎగుమతుల్లో తొమ్మిదో స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఈ ఐదేళ్లలో తీసుకున్న చర్యలతో ఐదో స్థానానికి చేరింది. 2019లో కేవలం రూ.90,000 కోట్లుగా ఉన్న వాణిజ్య ఎగుమతుల విలువ 2023–24 నాటికి రూ.1.60 లక్షల కోట్లకు పెరిగిందిపోర్టు ఆధారిత పారిశ్రామిక పార్కులు... పోర్టులను ఆధారంగా చేసుకుని చుట్టుపక్కలా పారిశ్రామిక ప్రగతిని విస్తరించడానికి ప్రణాళికలు రూపొందిస్తోంది. కేవలం పోర్టులను నిర్మించడమే కాకుండా పోర్టు ఆధారిత పారిశ్రామిక ప్రగతిపై దృష్టి సారించాల్సిందిగా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కొత్తగా నిర్మిస్తున్న రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట పోర్టుల వద్ద భారీ పారిశ్రామిక పార్కుల నిర్మాణానికి సంబంధించి ముగ్గురు ఐఏఎస్ అధికారులతో కమిటీని వేశారు.ఈ క్రమంలో తొలుత అందుబాటులోకి వస్తున్న పోర్టుకు సమీపంలో సుమారు 8,000 ఎకరాల విస్తీర్ణంలో పారిశ్రామిక పార్కుతో పాటు తెట్టు వద్ద కార్గో ఎయిర్ పోర్టును అభివృద్ధి చేస్తున్నారు. తొలి దశలో 4,850 ఎకరాల్లో పారిశ్రామిక పార్కు అభివృద్ధి చేయనుండగా, దీనికోసం గుడ్లూరు మండలం చేవూరులో 1312.58 ఎకరాలు, రావూరులో 951.77 ఎకరాల భూ సేకరణకు సంబంధించి నెల్లూరు జిల్లా కలెక్టర్ తాజాగా నోటిఫికేషన్ జారీ చేశారు. ఫిషింగ్ హార్బర్ల వద్ద ప్రాసెసింగ్ యూనిట్లు... ఫిషింగ్ హార్బర్ల సమీపంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తోంది. ఈ ప్రగతి ఫలితంగా ప్రస్తుతం 150 మిలియన్ టన్నులుగా ఉన్న రాష్ట్ర ఎగుమతుల సామర్థ్యం 300 మిలియన్ టన్నులకు చేరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ పోర్టుల ఏర్పాటుతో లక్షలాది మందికి ఉపాధి లభించనుండటంతో పాటు వ్యాట్, జీఎస్టీ రూపంలో రాష్ట్ర ఖజానాకు భారీ ఆదాయం సమకూరనుంది. రామాయపట్నం సమీపానే ఇండోసోల్ సోలార్ ప్రాజెక్టు.... రామాయపట్నం పోర్టు సమీపంలో ఇండోసోల్ రూ.25,000 కోట్లతో ఏర్పాటు చేస్తున్న భారీ సోలార్ ఉపకరణాల తయారీ యూనిట్ తొలి దశ పనులను పూర్తి చేసుకుని ఈ మధ్యే ఉత్పత్తిని ప్రారంభించింది. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఎగుమతుల్లో 10 శాతం వాటాను చేజిక్కించుకోవాలని సీఎం జగన్ అధికారులకు లక్ష్యాన్ని నిర్దేశించారు. 2030 నాటికి 10 శాతం మార్కెట్ వాటాతో టాప్ 3 రాష్ట్రాల్లో ఒకటిగా నిలవాలన్న లక్ష్యానికి అనుగుణంగా పలు కీలక చర్యలు తీసుకుంటోంది. ఫిషింగ్ హార్బరు లేకపోవడం వల్ల బోట్లను ఒడ్డుకు చేర్చడం చాలా కష్టమయ్యేది. అమావాస్య, పౌర్ణమి సమయంలో సముద్రంలో ఆటుపోట్లు ఎక్కువగా ఉండటం వల్ల ఆ సమయంలో ఈ ఇబ్బంది మరింత అధికంగా ఉండేది. కొన్ని సందర్భాల్లో బోట్లు తీరానికి తగలడం వల్ల పగిలిపోయేవి. ఇప్పుడు మచిలీపట్నంలో అత్యాధునిక వసతులతో హార్బర్ నిర్మిస్తుండటంతో బోట్లను సురక్షితంగా నిలబెట్టుకోవచ్చు. –పైకం ఆంజనేయులు, ఫైబర్ బోట్ల యజమానుల సంఘం, మచిలీపట్నంనిన్నటిదాకా కూలీలం... ఇకపై యజమానులవుతాం.రాష్ట్రంలో ఫిషింగ్ హార్బర్లు లేకపోవడంతో నెల్లూ రు, ప్రకాశం జిల్లా తీరప్రాంత మత్స్యకారులు ఇన్నాళ్లూ చెన్నై, మంగళూరు ప్రాంతాలకు వెళ్లి వలస కూలీలుగా పనిచేసుకునేవాళ్లం. ఇప్పుడు ఇక్కడే ఫిషింగ్ హార్బర్లు వస్తుండటంతో అత్యాధునిక మెకనైజ్డ్ బోట్లు కొనుగోలు చేసుకుని యజమానులుగా మారే అవకాశాన్ని ఈ ప్రభుత్వం కలి్పంచింది. ఫిషింగ్ హార్బరు, దీనికి అనుబంధంగా వచ్చే పరిశ్రమల వల్ల ఒక్క జువ్వలదిన్నెలోనే 15,000 మందికి పైగా ఉపాధి లభించనుంది. తుపాన్లు వచ్చినా తట్టుకునే విధంగా జువ్వలదిన్నె హార్బర్ను నిర్మిస్తున్నారు. – కొండూరు అనిల్ బాబు, చైర్మన్, ఏపీ ఫిషరీస్ కో–ఆపరేటివ్ ఫెడరేషన్ (ఆఫ్కాఫ్) మినీపోర్టు స్థాయిలో నిర్మాణం ఇప్పటి వరకు బోట్లు నిలపడానికే సరైన సదుపాయాల్లేక ఐదారుచోట్ల ఆపేలా నానా అవస్థలు పడుతుండేవాళ్లం. పాదయాత్ర సమయంలో మా పరిస్థితిని వైఎస్ జగన్ దృష్టికి తీసుకొస్తే మినీ ఫిషింగ్ హార్బర్ నిర్మిస్తామన్నారు. ఇప్పుడు ఏకంగా రూ.361 కోట్లతో రాష్ట్రంలోనే అతిపెద్ద హార్బరును మినీపోర్టు స్థాయిలో నిర్మిస్తున్నారు. బోట్లు నిలపడం నుంచి రిపేర్లు, డీజిల్, వేలంపాటలు, అమ్మకాలు...ఇలా అన్నీ ఒకేచోట ఉండేలా నిర్మిస్తుండటంతో వ్యయం తగ్గి లాభాలు పెరుగుతాయి.దీని ద్వారా తొండంగి, కొత్తపల్లి, కాకినాడ రూరల్ మండలాలకు చెందిన 50,000 మత్స్యకార ప్రజలకు ప్రయోజనం లభిస్తుంది. ఈ స్థాయిలో హార్బర్ నిర్మాణ పనులు ఇంత వేగంగా జరుగుతాయని ఎవరూ ఊహించలేదు. మేమంతా సీఎం వైఎస్ జగన్కు రుణపడి ఉంటాం. –ఎన్. మణికంఠబాబు, సర్పంచ్, అమినాబాద్, ఉప్పాడ రామాయపట్నం► ప్రాజెక్టు వ్యయంరూ.3,736.14 కోట్లు ►తొలి దశలో పోర్టు సామర్థ్యం 34.04 ఎంఎంటీపీఏ ►పూర్తిస్థాయి సామర్థ్యం138.54 టన్నులు ►తొలి దశలో బెర్తులు నాలుగు (రెండు జనరల్, ఒకటి కోల్, ఒకటి మల్టీపర్పస్) ►తొలి దశలో వచ్చే ఓడల పరిమాణం 80,00 డీడబ్ల్యూటీపనులు ప్రారంభించిన తేదీ జూన్ 24, 2022 కార్యకలాపాల ప్రారంభం జనవరి, 2024 మచిలీపట్నం ►ప్రాజెక్టు వ్యయం రూ.5,156 కోట్లు ►తొలి దశలో పోర్టు సామర్థ్యం 35 ఎంఎంటీపీఏ►పూర్తిస్థాయి సామర్థ్యం 116 టన్నులు ►తొలి దశలో బెర్తులు నాలుగు (రెండు జనరల్, ఒకటి కోల్, ఒకటి మల్టీపర్పస్) ►తొలి దశలో వచ్చే ఓడల పరిమాణం 80,00 డీడబ్ల్యూటీ పనులు ప్రారంభించిన తేదీ ఏప్రిల్ 21, 2023 కార్యకలాపాల ప్రారంభం అక్టోబర్, 2025 మూలపేట ►ప్రాజెక్టు వ్యయం : రూ.4,361.91 కోట్లు ►తొలి దశలో పోర్టు సామర్థ్యం23.50 ఎంఎంటీపీఏ ►పూర్తిస్థాయి సామర్థ్యం: 83.30 టన్నులు ► తొలి దశలో బెర్తులు: నాలుగు రెండు జనరల్, ఒకటి కోల్, ఒకటి మల్టీపర్పస్) ►తొలి దశలో వచ్చే ఓడల పరిమాణం1,20,000డీడబ్ల్యూటీ పనులు ప్రారంభించిన తేదీ ఏప్రిల్ 18, 2023 కార్యకలాపాల ప్రారంభం అక్టోబర్, 2025 కాకినాడ గేట్ వే►ప్రాజెక్టు వ్యయం : రూ.2,123.43 కోట్లు ►తొలి దశలో పోర్టు సామర్థ్యం16 ఎంఎంటీపీఏ► తొలి దశలో బెర్తులు: నాలుగు (రెండు జనరల్, ఒకటి కోల్, ఒకటి క్రాఫ్ట్ బెర్త్) ►తొలి దశలో వచ్చే ఓడల పరిమాణం 1,20,000 డీడబ్ల్యూటీ పనులు ప్రారంభించిన తేదీ నవంబర్ 20, 2021 కార్యకలాపాల ప్రారంభం నవంబర్, 2024 -
ఓటుకు కోట్లు కేసులో పారిపోయి వచ్చింది అందుకేగా: మంత్రి బొత్స
సాక్షి, విశాఖపట్నం: నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..? అంటూ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. రాజకీయాల్లో నేతల తలలపై రూపాయి పెట్టి విలువ కట్టడమే నీ బతుకు.. ఓటుకు కోట్లు కేసులో పారిపోయి తిరుగుతున్న నీచుడు బాబు’’ అంటూ దుయ్యబట్టారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఓటమి నీ కళ్ల ముందు కనిపిస్తుంటే.. నీ నోటికి అడ్డూఅదుపూ ఉండదా..?. విశాఖ రాజధానిగా సమర్ధించని నువ్వు ఉత్తరాంధ్రపై నంగనాచి కబుర్లా..?. ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధే లక్ష్యంగా జగన్ ఆలోచనలు ఉన్నాయి. ప్రజా నాయకుడు జగన్పై నోటికొచ్చినట్లు మాట్లాడటం మర్యాద కాదు’’ అంటూ మంత్రి హితవు పలికారు.మంత్రి బొత్స సత్యనారాయణ ఇంకా ఏమన్నారంటే.. ఓటమి తెలిసే.. చంద్రబాబులో అసహనంచంద్రబాబు మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నాడు. ఆయన భాష, మాట్లాడే తీరును చూస్తే ప్రజలు అసహ్యించుకుంటున్నారు. రాజకీయం అనుభవశాలిగా చెప్పుకుంటూనే కంట్రోల్ తప్పి మాట్లాడుతున్నాడు. ముఖ్యమంత్రిని పట్టుకుని నెత్తిమీద అర్ధరూపాయి పెడితే దమ్మిడీకి కొనరంటున్నాడు. స్పీకర్నైతే రకరకాల పేర్లతో పిలుస్తాడా..? అసలెందుకు అంత సహనం కోల్పోయి మాట్లాడుతున్నాడు..? రాజకీయాల్లో ఎన్నికలు వస్తూపోతూ ఉంటాయి. నాయకులుగా గెలుస్తాం. ఓడతాం.. అయితే, తాను, తన కూటమి ఓడిపోబోతుందని తెలిసి అంత సహనం కోల్పోయి నోటికేదొస్తే అది మాట్లాడితే ప్రజలు హర్షిస్తారా..? అతను ఏమనుకుంటున్నాడు.? ప్రజలు ఛీకొట్టే విధంగా మాట్లాడటానికి అతను సిగ్గుపడాలి. వెన్నుపోటు రాజకీయాల్లో నీకన్నా నీచుడెవడు..?నీచుడంటే ఎవరు..? పిల్లనిచ్చిన మామను వెన్నుపోటు పొడిచి అతని అధికారం లాక్కుని.. పార్టీని, పార్టీ జెండాను హస్తగతం చేసుకున్నోడు ఏమవుతాడు..? ఆ మామ తాలూకూ చావుకు కారణమైన వాడివి నువ్వు.. మరి, నిన్నేమని సంభోధించాలి..? నీచుడనాల్నా.. అంతకన్నా పెద్ద మాట ఇంకేమైనా ఉందా..? దీనికి చంద్రబాబే సమాధానం చెప్పాలి. ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారు..రాజకీయ నేతల తలల మీద ఎంత పెట్టాలో.. ఏ రకంగా వాళ్లను కొనాలో.. బేరాలకు లొంగే నేతల గురించి కొలమానం నీకు తెలుసు. అంతమాత్రానా అందర్నీ వేలం పెడతానంటే ఎలా కుదురుతుంది..? మరి, నీకు అంత సామర్ధ్యం ఉండబట్టే కదా.. హైదరాబాద్ నుంచి ఇక్కడకు పారిపోయి వచ్చింది..? ఓటుకు కోట్లు కేసులో నువ్వు చేసింది ఇదేనని అందరికీ తెలుసుకదా..? అతెందుకు.. అసలు, నీ తల మీద ఉన్న విలువెంతో నీకు తెలుసా..? నువ్వొక చెల్లని కాసు అనేకదా.. నిన్ను 2019లో ప్రజలు ఓడించి మూలన కూర్చొబెట్టారు. అలాంటి నువ్వు.. ప్రజా మద్దతుతో రాష్ట్రంలో 151 స్థానాలతో ముఖ్యమంత్రి అయిన జగన్ మోహన్రెడ్డి గారిని పట్టుకుని వేలం వేస్తానంటావా..? ఆ మాట అనడాని కి నీకు సిగ్గుగా అనిపించలేదా..? నీ మాట్లాడే తీరును, భాషను, సహనం కోల్పోయి ఏ విధంగా ప్రవర్తిస్తున్నావనేది ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారు. విశాఖ రాజధానిగా, ఉత్తరాంధ్ర సమగ్ర అభివృద్ధే మా ధ్యేయంఎస్.కోటలో నా గురించి మాట్లాడుతూ.. ఏం బొత్సా అని పిలిచావ్..? సరే, నాకంటే వయస్సులో పెద్దోడివనుకుంటా.. నువ్వు అలా నన్ను సంభోదించినా నేనేం అనుకోను. ఎస్.కోటను విశాఖపట్టణంలో కలపకుండా విజయనగరంలోనే ఎందుకు ఉంచావన్నావు. నీమాటకే వస్తే.. ఎస్.కోటను విశాఖలో కలపడం వలన ఏంటి లాభం..? సమాధానం చెప్పు..? మా ఉద్దేశంలో విశాఖ ఎగ్జిక్యూటివ్ రాజధానిగా చేసుకుని ఉత్తరాంధ్ర ప్రాంత 34 ప్రాంతాల్ని సమగ్ర అభివృద్ధిలోకి తేవడం మా అభిమతం. ఇక్కడి ప్రాంత ప్రజల మనోభావాల్ని దెబ్బ తీసే హక్కు నీకెవరిచ్చారు...? మేం వారి అభిప్రాయాల్ని గౌరవిస్తాం కనుక ఉత్తరాంధ్రలో ఆయా ప్రాంతాల అభివృద్ధి ఎలా చేయాలనేది మాకు తెలుసు. విశాఖను రాజధానిగా నువ్వెందుకు సమర్ధించవు..?విశాఖపట్టణాన్ని ఎగ్జిక్యూటివ్ రాజధానిగా చేస్తాం.. దీన్ని దేశంలోనే అతిపెద్ద నగరంగా తీర్చిదిద్దుతామని జగన్మోహన్ రెడ్డి గారు కంకణం కట్టుకుని పనిచేస్తున్నారు. నువ్వేమో.. ఇక్కడ రాజధాని ఉండటానికే వీల్లేదంటూ.. ఆ స్థాయి పట్టణంగా విశాఖ పెరగకూడదని నువ్వు అడ్డుపడుతున్నావు. విశాఖ రాజధానిగా నువ్వు సమర్ధించనప్పుడు ఎస్.కోట గురించి ఎందుకు మాట్లాడుతున్నావు..? ఒకవేళ, నువ్వు విశాఖపట్టణాన్ని రాజధానిగా సమర్ధిస్తే.. ఒక్క విశాఖ ఏంటి..? అనకాపల్లి, పార్వతిపురం, విజయనగరం, ఎస్.కోట, శ్రీకాకుళం తో పాటు ఉత్తరాంధ్ర ప్రాంతమంతా అభివృద్ధి చెందుతోంది కదా..? ఉత్తరాంధ్ర అభివృద్ధిపై నంగనాచి కబుర్లొద్దుగతంలో విశాఖ జిల్లాలోనే ఉన్న అనకాపల్లిని జిల్లా చేశామంటే.. అదొక వెనుకబడిన ప్రాంతంగా ఉండాలని చేశామా..? పరిపాలనా సౌలభ్యం కోసమే ఆ ప్రాంత ప్రజలకూ అభివృద్ధి ఫలాలు శరవేగంగా దక్కాలని కాదా..? మరి, ఇవ్వన్నీ ఏం తెలియకుండా నీ లెక్కలేంటి..? నీ నోటికి ఏదొస్తే అది మాట్లాడి ప్రజల్ని రెచ్చగొట్టాలనుకుంటున్నావా..? విశాఖ ఎగ్జిక్యూటివ్ రాజధాని అయితే ఉత్తరాంధ్ర ప్రాంత జిల్లాలన్నీ అభివృద్ధిలోకి రావడంతో పాటు విశాఖ ప్రపంచస్థాయి నగరం అవుతోందనేది అందరికీ తెలుసు. అలాంటిది, నువ్వేమో ఒక్క పక్కన కోర్టులకెళ్లి మరీ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనకు మోకాలడ్డుతూ.. ఎన్నికలనగానే, ఇక్కడకొచ్చి ఉత్తరాంధ్ర అభివృద్ధిపై నంగనాచి కబుర్లు చెబుతావా..? ఉత్తరాంధ్ర ప్రజలు నువ్వు చెప్పే మాటల్ని నమ్మేంత అమాయకులేమీ కాదని తెలుసుకో.. అవినీతి చక్రవర్తి బిరుదాంకితుడు చంద్రబాబు:-చంద్రబాబు కాలేజీకి సైకిల్ మీదనే వెళ్లేవాడనేది ఆయన సన్నిహితులే గతంలో పలు సందర్భాల్లో చెప్పారు. మరి, నేనైతే.. కాలేజీకి స్కూటర్ మీద వెళ్లాను. రెండెకరాలతో రాజకీయంలోకి వచ్చిన చంద్రబాబుకు ఇవాల్టికి రూ.1400 కోట్లు ఏ విధంగా వచ్చాయి..? అంతమొత్తం ఎలా సంపాదించాడు..? మరి, మేమూ 15 ఏళ్లపాటు అనేక ప్రభుత్వాల్లో మంత్రులుగా చేశాం కదా..? అన్ని కోట్లు రూపాయలు మాకెందుకు రాలేదు..? ఎన్ని కుంభకోణాలు చేసి అన్ని రూ.వేల కోట్లు సంపాదించావో ప్రజలకు సమాధానం చెప్పు. అవినీతి చక్రవర్తి అనే బిరుదును ప్రజలు నీకిచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని తెలుసుకో.. ఇప్పటికైనా, నీ భాషను సరిచేసుకోకపోతే చాలా దెబ్బతింటావు. రాజకీయాల్లో సహనం కోల్పోయి మరీ అంతగా నోరుపారేసుకోవడం మంచిది కాదు. ప్రజలు నీ మాటలు విని అసహ్యించుకుంటున్నారు. ఉత్తరాంధ్ర నీ జాగీరేం కాదు..?ఉత్తరాంధ్ర ప్రాంత నేతలుగా మేము రాజకీయాల్లో ఎప్పట్నుంచో ఉన్నాం. ఈ ప్రాంత ప్రజల తాలూకూ మనోభావాలు.. ఆత్మగౌరవం మాకు తెలుసు. అలాంటిది, ఈరోజు ఎన్నికలనగానే నువ్వొచ్చి ఉత్తరాంధ్ర ప్రాంతం నీ జాగిరు అన్నట్టు మాట్లాడితే ఎలా కుదురుతుంది..? వయసులో పెద్దోడివైనప్పటికీ, కొంచెం వళ్లు దగ్గరబెట్టుకుని మాట్లాడితే బాగుంటుంది. నోటికేదొస్తే అది మాట్లాడుతానంటే ఈ ప్రాంత ప్రజలు చూస్తూ ఊరుకోరు.పేద పిల్లలకు సీబీఎస్ఈ సిలబస్తో టోఫెల్ శిక్షణ:రాష్ట్రంలోనే కాకుండా.. దేశంలోని అనేకమంది ప్రజాస్వామ్యవాదులు, మేధావులు జగన్ విజయం గురించి మాట్లాడతున్నవన్నీ వాస్తవాలే కదా..? మరి, ఆయన గానీ మళ్లీ ముఖ్యమంత్రి కాకపోతే.. పేద పిల్లలకు నాణ్యమైన విద్య, ఆయా కుటుంబాలకు ఖరీదైన వైద్యం దూరం అవుతుంది కదా..? ఈ రాష్ట్రంలో మూడోతరగతి నుంచే పిల్లలకు టోఫెల్ పరీక్షకు తయారుచేసే విద్యావిధానంలో దేశంలో ఎక్కడైనా ఉందా..? విదేశాలకు వెళ్లే విద్యార్థులకు ఇంగ్లీషు భాషపై పట్టుతో మాట్లాడేందుకు టోఫెల్ను గతంలో నేర్చుకునేవాళ్లు. కానీ, మన పిల్లలకు మూడో తరగతి నుంచి టోఫెల్ నేర్పిస్తూ.. బేసిక్, జూనియర్, సీనియర్ అంటూ టెస్టులు పెట్టి ప్రభుత్వమే వాళ్లకు ఫీజులు కడుతూ ఇంగ్లీషు మీడియంను వృద్ధిలోకి తెస్తున్నాం. గతంలో సీబీఎస్ఈ సిలబస్తో నడిచే హైస్కూళ్లు రాష్ట్రంలో అన్ని కలిపితే 100 ఉండేవి కాదు. అలాంటిది, ఇవాళ వెయ్యికి పైగా సెంట్రల్ సిలబస్తో హైసూళ్లను అప్గ్రేడ్ చేశాం. ఇంగ్లీషు మీడియం పట్ల కొత్తగా మేం చైతన్యం తెచ్చాం. ఐబీ విద్యను రాష్ట్ర విద్యావిధానంలోకి తెస్తున్నాం. జెనీవాలోని సంస్థతో మాట్లాడి.. ఆ సంస్థ మేనేజ్మెంట్ను ఏపీకి రప్పించి.. జగన్మోహన్రెడ్డి గారి సమక్షంలో ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకున్నాం. వచ్చే విద్యా సంవత్సరంలో ఒకటో తరగతి నుంచి 12వ తరగతి వరకు ఐబీ కొలబరేషన్తో ప్రభుత్వ స్కూళ్లల్లో సరికొత్త విద్యావిధానాన్ని నడిపించ నున్నాం. మరి, విద్యావ్యవస్థలో ఇలాంటి అద్భుతాలు ఎప్పుడైనా చూశామా..? అదే ఐబీ చదువుకోవాలంటే, ట్యూషన్ ఫీజు ఒక్కో విద్యార్థికి ఆరేడు లక్షల రూపాయలు వెచ్చించాలి. అలాంటిది, ప్రభుత్వ స్కూళ్లల్లో ఉచితంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామంటే అది సంతోషమే కదా..? ఇది మా ప్రభుత్వం తాలూకూ నిబద్ధత. మా ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి గారి ఆలోచన. అందుకే, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మళ్లీ జగన్మోహన్రెడ్డి గారే ఎందుకు అవసరమనేది చెబుతున్నాం.రాష్ట్రంలో ముందెన్నడూ లేనివిధంగా ఇప్పుడు 17 మెడికల్ కాలేజీలు కొత్తగా వస్తున్నాయి. కాలేజీకి వంద సీట్ల చొప్పున తీసుకుంటే.. ఈ రాష్ట్ర విద్యార్థులకు 1700 మెడికల్ సీట్లు అందుబాటులోకి వస్తున్నట్లే కదా..? అందులో 70 శాతం పేద విద్యార్థులకు సీట్లు వస్తున్నాయి. రూ. కోటి నుంచి రూ.2 కోట్లు ఖర్చుపెట్టి సీట్లు పొందలేని విద్యార్థులకు ఉచితంగా మెడికల్ సీట్లు వస్తున్నాయి. మెడికల్ కాలేజీకి అనుబంధంగా ఒక సూపర్ స్పెషాల్టీ ఆస్పత్రి వస్తుంది. ఆ ఊరి పేదవాడికి ఖరీదైన నాణ్యమైన వైద్యం ఉచితంగానే అందుతోంది. నీ విజన్తో పేదోడికి మేలు జరిగిందా బాబూ..?ఇవన్నీ ప్రభుత్వం చేస్తోన్న కార్యక్రమాలే కదా..? వీటిని చెప్పకుండా నోటికేదొస్తే అది మాట్లాడటం.. అభివృద్ధి లేదని అదేపనిగా ఊదరగొడితే ఎలా కుదురుతుంది..? ప్రజలకు ఇవ్వన్నీ తెలిసిన వాస్తవాలని మీరు మరిస్తే ఎలా..? చంద్రబాబు పాలనలో ప్రజలకు మేలు చేసే ఇలాంటి మంచి ఆలోచనలు ఎప్పుడైనా చేశాడా..? అంటే, నీ విజన్లో పేదోడికి ఏనాడైనా మేలు జరిగిందా..? జగన్ గెలుపు అనివార్యమంటోన్న మేధావులు:అనేకరంగాల్లో మేధావులైన వారు సైతం ఇవాళ జగన్ గారి పరిపాలనా సంస్కరణలను మెచ్చుకుంటున్నారు. ఆయన ఎన్నిక అనేది ఆయన ముఖ్యమంత్రి కావడం కోసం కాదు. ఈ రాష్ట్రంలోని పేద, మధ్యతరగతి కుటుంబాల అభివృద్ధి కోసం. ఆయా కుటుంబాల్లోని పేద పిల్లల చదువులు అంతర్జాతీయ స్థాయిలో పెరగాలంటే .. అది రాబోయేకాలంలో దేశానికి, రాష్ట్రానికి పెట్టుబడిగా ఉండాలనేది జగన్ గారి తాపత్రయం. అందుకే, విద్య, వైద్యం, వ్యవసాయంలో అనేక సంస్కరణలు చేపట్టారని పెద్దలు ఉదాహరణలుతో సహా వివరించడం చాలా బాగుంది. ఒకవేళ, జగన్ గారే కనుక గెలవకపోతే.. ఇప్పటిదాకా రాష్ట్రంలో విద్యావైద్యంలో కొనసాగిన సంస్కరణలు ఆగిపోయే ప్రమాదం ఉందని మేధావులే చెబుతున్నారు. అవి ఆగిపోతే, ఈ రాష్ట్రంలోని సామాన్య, మధ్యతరగతి పేద కుటుంబాల ప్రజలు ప్రమాదంలో పడిపోతారని చెబుతున్నారు.ఇదీ చదవండి: జైత్రయాత్రను తలపించిన సీఎం జగన్ బస్సుయాత్ర
Related News by category
-
ఇదేందయ్యా.. భార్గవా?
సాక్షి, నంద్యాల: నంద్యాల పార్లమెంట్ స్థానానికి ఓ వ్యక్తి స్వతంత్య్ర అభ్యర్థిగా నామినేషన్ వేయడం, ఉపసంహరించుకోవడం ఇప్పుడు జిల్లాలో చర్చగా మారింది. ఆయన ఎవరో కాదు ఆళ్లగడ్డ టీడీపీ అభ్యర్థి భూమా అఖిల ప్రియ భర్త మద్దూరు భార్గవ రామ్ నాయుడు. టీడీపీ నుంచి నంద్యాల ఎంపీగా బైరెడ్డి శబరి పోటీ చేస్తున్నారు. అయితే నామినేషన్లలో చివరి రోజు ఈనెల 25వ తేదీ భార్గవ రామ్ చడీచప్పుడు కాకుండా నంద్యాల ఎంపీగా నామినేషన్ వేశారు. ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నట్లు తాను సమర్పించిన నామినేషన్ల పత్రాల్లో పేర్కొన్నారు. ఈ విషయం తెలుసుకున్న శబరి.. అఖిలప్రియ వ్యవహారశైలిపై పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఎన్నికల ఖర్చు భరిస్తామని హామీ ఇస్తేనే భార్గవరామ్ నామినేషన్ విత్ డ్రా చేసుకుంటారని.. లేని పక్షంలో ఇండిపెండెంట్గా బరిలో ఉంటామని అఖిల ప్రియ చెప్పినట్లు ప్రచారం సాగింది. అయితే నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగుస్తుండడంతో టీడీపీలో హైడ్రామా నడిచింది. భార్గవరామ్ తన నామినేషన్ విత్డ్రా చేసుకోకుంటే పార్టీ పరంగా తీవ్ర చర్యలు తీసుకుంటామని అధిష్టానం నుంచి గట్టి హెచ్చరికలు చేయడంతో భార్గవ్ నామినేషన్ విత్ డ్రా చేసుకున్నట్లు తెలిసింది. ‘సార్.. ఏం ఆశించి నామినేషన్ వేశారో’ అన్న చర్చ ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా సాగుతోంది. ఈ తంతంగంపై బైరెడ్డి శబరి అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. -
‘ఓ బోగస్ బాబూ.. ఈ జగన్లా ఏం చేశావు?’
ప్రకాశం, సాక్షి: నాయకుడంటే ప్రజల్లో ఒక నమ్మకం ఉండాలని.. ఒక మాట చెబితే కచ్చితంగా చేసి తీరతాడని ప్రజలు భావించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. అయితే చంద్రబాబుకి ఓటేయడమంటే మళ్లీ మోసపోవడమేనని తేల్చి చెప్పారాయన. మంగళవారం ఒంగోలు పార్లమెంట్ స్థానం పరిధిలోని కొండేపి నియోజకవర్గం టంగుటూరులో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో సీఎం జగన్ ప్రసంగించారు. జగన్కు ఓటేస్తే పథకాలన్నీ కొనసాగింపు. పొరపాటున చంద్రబాబుకి ఓటేస్తే పథకాలన్నీ ముగింపు. చంద్రబాబుకి ఓటేస్తే చంద్రముఖి నిద్ర లేస్తుంది. ఐదేళ్లపాటు ప్రజల రక్తం తాగుగుతుంది. ఈ ఎన్నికలు పేదల భవిష్యత్తులను నిర్ణయించేది.. కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కాదు. .. 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు పేరు చెబితే ఒక్క పథకం కూడా గుర్తుకు రాదు. ఓటేసే ముందు ఎవరిది బోగస్ రిపోర్టు, ఎవరిది ప్రోగ్రెస్ రిపోర్టు అనేది చూడాలి. ప్రభుత్వ ఉద్యోగాల రిపోర్టు పరిశీలిస్తే.. జాబ్ రావాలంటే బాబు రావాలి అనే మాటలు గుర్తున్నాయా?. ఇంటింటికీ ఉద్యోగం ఇస్తానని చెప్పి చంద్రబాబు మోసం చేశారు. చంద్రబాబు తాను అధికారంలో ఉన్నప్పుడు ముష్టిలాగా ఉద్యోగాలిచ్చారు. కేవలం 31 వేల ఉద్యోగాలిచ్చారు. మన ప్రభుత్వం 58 నెలల కాలంలో 2 లక్షలకు పైగా ఉద్యోగాలిచ్చాం. ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో మనది ప్రోగ్రెస్ కార్డు.. చంద్రబాబుది బోగస్ కార్డు.వ్యవసాయం, రైతుల విషయంలో హామీలను చూద్దాం. రైతుల రుణమాఫీ అని మోసం చేశారు. బ్యాంకుల్లో తాకట్టు పెట్టిన బంగారం విడిపించలేదు. పెట్టుబడి సాయం ఇచ్చారా?. రైతులకు సమయానికి సబ్సిడీ ఇచ్చింది ఏనాడైనా ఉందా?. సున్నా వడ్డీ ఈ పెద్ద మనిషి ఇచ్చాడా?. మీ బిడ్డ జగన్ ఇచ్చాడా?. కనీసం పెట్టుబడితో రైతులకు భరోసా నిలిచారా?. వ్యవసాయం దండగా అని చంద్రబాబు మాట్లాడింది నిజం కాదా?. బషీర్బాగ్లో రైతులపైకాల్పులు జరిపించింది. ఉచిత కరెంట్ ఇస్తే బట్టలు ఆరేసుకోవాల్సి వస్తుందని అంది చంద్రబాబు కాదా?. రైతుల్ని నిట్టనిలువుగా ముంచిన చంద్రబాబుది బోగస్ రిపోర్ట్ కాదా?మీ జగన్ రైతులకు ఏం చేశాడో చూద్దాం. రైతు భరోసా ఇచ్చాం. పెట్టుబడికి సాయంగా ఇన్పుట్ సబ్సిడీ, రైతు భరోసా కేంద్రాలు తీసుకొచ్చింది, ఉచిత పంటల బీమా, పంటల కొనుగోలు ఇలా అన్నీ ఈ 58 నెలలకాలంలో మీ బిడ్డ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాదా?. ఇది కళ్లకు కనిపిస్తున్న ప్రోగ్రెస్.యెల్లో మీడియా చంద్రబాబుని డెవలప్మెంట్ కింగ్ అని పొగుడుతుంది. మరి చంద్రబాబు ఏం చేశారు?. మన పాలనలో గ్రామాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. విలేజ్ క్లినిక్లు కట్టించింది ఎవరు?. వేల రైతు భరోసా కేంద్రాలు కట్టింది ఎవరు?. ఉద్దానం సమస్యను తీర్చింది ఎవరు?. ఎయిర్పోర్టు విస్తరణ చేపట్టింది ఎవరు?. ఈ జగన్లా ఏదైనా అభివృద్ధి చేశావా? అని చంద్రబాబును సీఎం జగన్ నిలదీశారు. ఇలాంటి చంద్రబాబు డెవలప్మెంట్ విషయంలోనూ బోగస్రిపోర్టు ఇచ్చుకుంటున్నారు.ఓ చంద్రబాబూ.. ఇంటింటా ప్రతీ కుటుంబంలో వెలుగులు నింపింది ఎవరు?. పేదల సంకెళ్లను తెంచుకునేలా చదువుతో బాగు చేయించింది ఎవరు?. నాడు నేడుతో విద్యా వ్యవస్థలో మార్పులు తెచ్చింది ఎవరు? మీ హయాంలో ఎప్పుడైనా ఇలాంటి అభివృద్ధి జరిగిందా? అని అడుగుతున్నా. పచ్చ కామెర్లు వచ్చాయా?. కళ్లెదుట కనిపిస్తున్న రిపోర్టు కనిపించడం లేదా? అని సీఎం జగన్ మండిపడ్డారు.బోగస్ బాబు చేస్తున్న మరో దుర్మార్గం. పెన్షన్ల విషయంలో కుట్రను గమనించండి. 14 ఏళ్లు సీఎంగా ఉండి అవ్వాతాతల కష్టాలను ఏనాడైనాపట్టించుకున్నాడా?. పెన్షన్లను ఇంటికే అందిస్తున్న ఘనత మీ బిడ్డది. చంద్రబాబు కుట్రలు చేస్తూనే నెపం మీ బిడ్డ జగన్పై నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మళ్లీ మనపై ఆరోపణలు చేయడం కంటే దిగజారుడు తనం ఉందా?. చంద్రబాబు హయాంలో ఏనాడూ మంచి చేసిన చరిత్రలేదు. చంద్రబాబు ధ్యాస దోచుకోవడం, దోచుకోవడం పంచుకోవడం మీద కాబట్టే అక్కాచెల్లెమ్మలకు న్యాయం జరగలేదు. ఎవరి విశ్వసనీయత ఏమిటి అనేది అందరూ తెలుసుకోవాలి. 2014లో చంద్రబాబు ఇచ్చిన ప్రధాన హామీలు.. చేసిన మోసం గుర్తున్నాయా?. ఇంటింటికి జాబ్ అన్నారు. ఉద్యోగం ఇవ్వలేకపోతే కనీసం నిరుద్యోగ భృతి అయినా ఇస్తా అన్నారు. కనీసం ఒక్క రూపాయికూడా చంద్రబాబు ఇవ్వలేదు. ఇది మోసం కాదా?. వలంటీర్లు మన ఇంటికే రావాలన్నా. మన బతుకులు బాగుపడాలన్నా. మన ఆస్పత్రులు, బడులు బాగుపడాలన్నా. ప్రతీ ఒక్కరం ఫ్యాన్ గుర్తు మీద రెండు బటన్లు నొక్కాలి. 175కి 175 స్థానాలు, 25 ఎంపీ స్థానాలు తగ్గేలేదు. సిద్ధమేనా?.. మన గుర్తు ఫ్యాన్. మంచి చేసిన ఫ్యాన్ ఇంట్లో, చెడు చేసిన సైకిల్ ఇంటి బయట, తాగేసిన టీ గ్లాస్ సింక్లో ఉండాలి. మీ చల్లని దీవెనలతో.. ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆదిమూలపు సురేష్, ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్రెడ్డిలను గెలిపించాలని కోరుకుంటున్నా ప్రజలకు సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు. -
విజయవాడలో విషాదం.. డాక్టర్ ఘాతుకం.. కుటుంబ సభ్యుల్ని చంపి తానూ..
ఎన్టీఆర్, సాక్షి: విజయవాడలోని విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబంలోని ఐదుగురు అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. బాధిత కుటుంబాన్ని.. ఆర్థోపెడిక్ డాక్టర్ శ్రీనివాస్ కుటుంబంగా గుర్తించారు పోలీసులు. మృతుల్లో డాక్టర్ శ్రీనివాస్, ఆయన తల్లి, భార్యా ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే వాళ్ల మృతికి కారణాలపై స్పష్టత రావాల్సి ఉంది.గుంటూరు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదివిన శ్రీనివాస్.. ఏడాది క్రితం శ్రీజ అనే ఆస్పత్రిని విజయవాడలో ప్రారంభించాడు. అయితే ఆ ఆస్పత్రి సరిగా నడవటం లేదు. దీంతో ఆయన డిప్రెషలోకి వెళ్లారు. ఈ క్రమంలో ఆస్పత్రిని రెండు నెలల కిందట మరొకరికి అప్పగించనట్లు తెలుస్తోంది.మంగళవారం ఉదయం గురునానక్ నగర్లోని ఇంట్లో శ్రీనివాస్ కుటుంబం విగత జీవిగా కనిపించింది. ఇంటి ఆవరణలో శ్రీనివాస్ మృతదేహాం కొయ్యకు వేలాడుతూ కనిపించింది. దీంతో.. కుటుంబం మొత్తం ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందా? లేదంటే ఎవరైనా హత్య చేశారా?.. తాను ఆత్మహత్య చేసుకుని, అంతకు ముందు కుటుంబ సభ్యుల్ని శ్రీనివాస్ హత్య చేసి ఉంటాడా? అనే అనుమానాలు రేకెత్తాయి. అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.మృతులు డాక్టర్ శ్రీనివాస్ (40), ఉషారాణి (36), శైలజ (9), శ్రీహాన్(5), శ్రీనివాస్ తల్లి రమణమ్మ (65)ఘటనా స్థలాన్ని సీపీ రామకృష్ణ పరిశీలించారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ తనిఖీలు జరిపాయి. అయితే.. తన కారు తాళం తన అన్నకు ఇవ్వాలంటూ ఎదురింటి వాళ్ల పోస్ట్ బాక్స్లో డాక్టర్ శ్రీనివాస్ పేరిట ఒక లెటర్ దొరికింది. దీంతో ఇది సూసైడ్ కేసు అయ్యి ఉంటుందని పోలీసులు ఒక అంచనాకి వచ్చారు. అర్ధరాత్రి టైంలో కుటుంబ సభ్యులను చంపి, తెల్లవారుజామున శ్రీనివాస్ తానూ ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని భావిస్తున్నారు. ఆర్ధిక ఇబ్బందులు కారణంగా శ్రీనివాస్ ఈ ఘాతుకానికి పాల్పడినట్టు ప్రాథమికంగా నిర్థారించుకున్నారు.శ్రీనివాస్ చాలా సౌమ్యుడు.. ఎవరితోనూ విబేధాలు లేవు. సంవత్సరం క్రితం శ్రీజ హాస్పిటల్ పేరుతో సొంతంగా హాస్పటల్ ఏర్పాటు చేశాడు. కొంతకాలం హస్పటల్ సక్రమంగా నిర్వహించాడు.తరువాత హాస్పటల్ నిర్వహణలో ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. హాస్పిటల్ నిర్వహణ కోసం ఎదురు పెట్టుబడి పెడుతున్నాడు. కేవలం ఆర్థిక ఇబ్బందులు వల్లే చనిపోయాడని భావిస్తున్నాం. తల్లిని, భార్యను, ఇద్దరి పిల్లలను హత్య చేశాడంటే నమ్మలేకపోతున్నాం.:::సాక్షిటీవీతో డాక్టర్ శ్రీనివాస్ స్నేహితులు -
చంద్రబాబు గ్యాంగ్ను నమ్మితే రాష్ట్రం అధోగతి
సాక్షి ప్రతినిధి, విజయనగరం: అధికారం కోసం అర్రులు చాస్తూ నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్పడం చంద్రబాబు సహా టీడీపీ గ్యాంగ్ జన్మహక్కులా ఉందని, వారిని మళ్లీ నమ్మితే రాష్ట్రం గతి అధోగతి పాలవుతుందని ఉపముఖ్యమంత్రి, రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి పీడిక రాజన్నదొర అన్నారు. సాలూరులో సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ పాలనలో విశాఖ సదస్సు ద్వారా 13.11 లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. తద్వారా 3.47 లక్షల ఉద్యోగాలు రానున్నాయి. అంతకుముందు చంద్రబాబు 14 ఏళ్ల ముఖ్యమంత్రిగా ఎంత సంపద సృష్టించారో చెప్పమనండి. ఆయన పరిపాలనలోనే రాష్ట్రం కరువులో ఉంద’ని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం భూసంస్కరణల్లో భాగంగా శాశ్వత భూమి హక్కు కలి్పంచేందుకు సర్వే చేయాలని సూచించిందని, కానీ దాన్ని టీడీపీ వ్యతిరేకిస్తోందని ప్రస్తావించారు. రైతులే తమ భూసమస్యల శాశ్వత పరిష్కారానికి, పటిష్టమైన భూరికార్డుల కోసం భూసర్వే జరగాలని కోరుకుంటున్నారన్నారు. వ్యవసాయ రంగానికి చంద్రబాబు రూ.34,185 కోట్లు మాత్రమే కేటాయిస్తే జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రూ.55,215 కోట్లు కేటాయించిన విషయాన్ని మరచిపోకూడదన్నారు. గ్రామీణాభివృద్ధికి చంద్రబాబు కేవలం రూ.46,895 కోట్లు మాత్రమే కేటాయిస్తే జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రూ.92,655 కోట్లు ఖర్చు చేసిందని వివరించారు. ఇలా ఏ రంగం చూసినా చంద్రబాబు కన్నా జగన్మోహన్రెడ్డే నంబరు ఒన్గా ఉన్నారన్నారు. గిరిజన సంక్షేమానికి పెద్దపీట వేశారని చెప్పారు. చంద్రబాబు 2014 ఎన్నికల్లో చెప్పిన ఫేక్ హామీలను నమ్మి ఓట్లేసిన ప్రజలను తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత నట్టేటముంచారని విమర్శించారు. అందుకే 2019 ఎన్నికల్లో చారిత్రాత్మకమైన తీర్పుతో చంద్రబాబును హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ ప్యాలెస్కు పరిమితం చేశారన్నారు. ఇప్పుడు మళ్లీ 2024 ఎన్నికల్లో ఓట్ల కోసం ఫేక్ పథకాలను సూపర్ సిక్స్ అంటూ అబద్దాలు, గిమ్మిక్కులతో చంద్రబాబు గ్యాంగ్ వస్తున్నారని ఎద్దేవా చేశారు. వాటి అమలుకే సుమారు రూ.75వేల కోట్లు ఖర్చు ఉంటుందని, ఆచరణయోగ్యం కాకున్నా అధికార యావతో అన్నీ అమలుచేసేస్తామని చెబుతున్నారని విమర్శించారు. తమ వైఎస్సార్సీపీ ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలన్నీ అమలుచేసిందనీ, ఇకపై కూడా ఆయా పథకాల ద్వారా కలిగే ప్రయోజనాన్ని మరింత పెంచుతూ కొనసాగిస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి 2024 మేనిఫెస్టో విడుదల చేశారని చెప్పారు. దిగి్వజయంగా అమలవుతున్న ఈ మేనిఫెస్టోతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. అందుకు కళ్ల ముందు కనిపిస్తున్న అభివృద్ధి పనులే నిదర్శనమని రాజన్నదొర చెప్పారు. -
రెచ్చిపోయిన పచ్చమూక
టీడీపీ శ్రేణుల రౌడీయిజం రోజురోజుకూ పెచ్చుమీరిపోతోంది. యథేచ్ఛగా దౌర్జన్యాలకు తెగబడుతోంది. బెదిరింపులతో వైఎస్సార్సీపీ నేతలను భయపెట్టాలని యతి్నస్తోంది. ఎన్నికల ప్రచారం సైతం సజావుగా సాగకుండా అడ్డుకునేందుకు పన్నాగాలు పన్నుతోంది. చివరకు పోలీసుల పహరాలో ఓట్టు అభ్యర్థించునే పరిస్థితిని కల్పిస్తోంది. కాణిపాకం: పూతలపట్టు మండలం వేపనపల్లె గ్రామంలో వైఎస్సార్సీపీ నేతలపై సోమవారం టీడీపీ నాయకులు దౌర్జన్యానికి దిగారు. ఎమ్మెల్యే అభ్యర్థి సునీల్కుమార్కు వస్తున్న ప్రజాదరణను ఓర్వలేక నానా రాద్ధాంతం సృష్టించారు. బడా నాయకుల డైరక్షన్లో గొడవకు యత్నంచారు. తమ ఊర్లో వైఎస్సార్సీపీ ప్రచారం జరగకూడదని, ఓట్లు అడిగేందుకు వీలులేదంటూ రెచ్చిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు అధిక సంఖ్యలో గ్రామానికి చేరుకున్నారు. పక్క గ్రామంలో పర్యటిస్తున్న సునీల్కుమార్ వద్దకు వెళ్లి వేపనపల్లెలో ప్రచారం వాయిదా వేసుకోవాలని సూచించారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రచారం చేసుకోవడం తన హక్కని ఆయన స్పష్టం చేయడంతో చేసేది లేక భద్రత కలి ్పంచారు. డీఎస్పీ రాజగోపాల్రెడ్డి, సీఐ సుదర్శనప్రసాద్, విశ్వనాథరెడ్డి అక్కడి చేరుకుని పటిష్ట బందోబస్తుతో వేపనపల్లెలో ప్రచారం చేసుకునేలా చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలో ఉదయం 10.45 గంటలకు వేపనపల్లె గ్రామానికి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సునీల్కుమార్ తదతరులు చేరుకున్నారు. ఇంతలో అక్కడ గుమికూడిన టీడీపీ శ్రేణులు ఒక్కసారిగా వైఎస్సార్సీపీ నేతలపైకి దూసుకొచ్చారు. పచ్చిబూతులతో దూషించారు. పోలీసుల సమక్షంలోనే ఊర్లో అడుగుపెడితే నరికేస్తామంటూ బెదిరించారు. వీరికి జనసేన కార్యకర్తలు సైతం వంతపాడారు. మొత్తం వ్యవహారం గమనించిన పోలీసులు రంగ ప్రవేశం చేశారు. పచ్చమూకకు గట్టిగా వారి్నంగ్ ఇచ్చారు. ఎన్నికల నియమావళి మేరకు అభ్యర్థుల ప్రచారం అడ్డుకుంటే కేసులు తప్పవని హెచ్చరించారు. ఎట్టకేలకు పోలీసుల పహరా నడుమ సునీల్కుమార్ గ్రామంలో ప్రచారం సాగించారు. అయినప్పటికీ పచ్చబ్యాచ్ నినాదాలు చేస్తూ.. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. పోలీసులను సైతం లెక్క చేయకుండా గొడవకు కాలుదువ్వారు. అయితే వైఎస్సార్సీపీ ఎమ్మెలే9్య అభ్యర్థి ప్రచారాన్ని ప్రశాంతంగా ముగించారు. కాగా, ఆరు నెలలకు కిత్రం ఆ గ్రామంలో నిర్వహించిన గడపగడప కార్యక్రమంలో గొడవ చోటుచేసుకుంది. అప్పుడు కూడా కొందరు ఇలానే ప్రవర్తించారు. అప్పుడు ఆరుగురిపై పోలీసులు కేసు నమోదుచేశారు. ఈ కక్షతోనే ఇప్పుడు మళ్లీ గొడవ చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.ప్రజాస్వామ్య విరుద్ధం వేపనపల్లెగ్రామంలో జనసేన, టీడీపీ కార్యకర్తలు, నాయకులు ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా వ్యవహరించారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సునీల్కుమార్ మండపడ్డారు. ఎన్నికల ప్రచారం తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై రాళ్ల దాడి చేసినప్పుడే ఓపికతో వ్యవహరించామన్నారు. ప్రశాంతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించుకుంటుంటే అడ్డగించడం కరెక్ట్ కాదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతో ముందుకు వెళుతున్నామని వెల్లడించారు.
Advertisement
Photos
View allVideo
View allమారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఎండుతున్న జలకళ
రెండు యుద్ధాలు – ఒక నాయకుడు
షూటింగ్... పార్టీయింగ్...
బాక్ సరికొత్త అనుభూతి ఇస్తుంది : తమన్నా
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
టీమిండియా కెప్టెన్కు టాలీవుడ్ స్టార్ హీరో విషెస్..!
బిందువే సిరుల సింధువు
చెన్నైకి గేమ్
తప్పక చదవండి
- కోటి 50 లక్షలు పోగొట్టుకున్నా.. జనసేన మాజీ నాయకురాలు సుభాషిణి
- లిక్కర్ కేసు: మనీష్ సిసోడియాకు మళ్లీ చుక్కెదురు
- ఎంపీ రాఘవ్ చద్దా ఎక్కడా?.. స్పందించిన ఆమ్ ఆద్మీ పార్టీ
- ప్రియాంకాజీ మీ ప్రభుత్వం ఏం చేస్తోంది.. అమిత్ ప్రశ్నల వర్షం
- కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన 'బిగ్బాస్' శోభాశెట్టి.. వీడియో వైరల్
- చత్తీస్గఢ్లో మళ్లీ ఎన్కౌంటర్.. ఏడుగురు మావోయిస్టుల మృతి
- లాలూ కుమార్తె ఆస్తిపాస్తులెంత? అఫిడవిట్లో ఏముంది?
- ఓటర్ల సంఖ్యను పెంచడానికి కొత్త వ్యూహం.. ప్రతి రెండు గంటలకు ఓ విన్నర్
- అలాంటి సినిమాలే చేస్తా.. వివాదంపై స్పందించిన నయనతార
- National Bubble Tea Day 2024: అసలేంటీ బబుల్ టీ, అందరూ తాగొచ్చా?
Advertisement