ఎస్ఐ ముందే టీడీపీ నాయకుని వీరంగం
రావికమతం: టీడీపీ నాయకుడు, మండల పరిషత్ వైస్ఎంపీపీ భర్త గెంజి వెంకటరమణ ఎస్ఐ ముందే రావికమతం స్టేషన్లో గురువారం వీరంగం సృష్టించాడు. మచ్చా శ్రీను అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కోపోద్రిక్తుడైన సదరు నాయకుడు స్టేషన్కు వెళ్లి ఫిర్యాదిని బెదిరించడమే కాక ఎస్ఐ ముందే చేయి చేసుకున్నాడు. దీనిపై రావికమతం ఎస్ఐ కేసు నమోదు చేశారు. వివరాలిలా ఉన్నాయి. రావికమతం వైఎస్ఎంపీపీ గెంజి కనక భర్త వెంకట రమణ ఐదు రోజుల క్రితం హాస్టల్ స్థలం ఆక్రమణకు యత్నించాడు.
అక్కడి విలువైన చెట్టును కూడా నరికేశాడు. అలాగే రావికమతం హైస్కూల్ ప్రహరీ నాణ్యత లేకుండా నిర్మిస్తున్నాడంటూ గ్రామానికి చెందిన మచ్చా శ్రీను ఎంపీడీవో, విలేకర్లకు నాలుగు రోజుల క్రితం ఫిర్యాదు చేశారు. దీనిపై ఆగ్రహం చెందిన వెంకట రమణ బుధవారం రాత్రి శ్రీను ఇంటికి వెళ్లి దౌర్జన్యం చేశాడు. ఈ మేరకు బాధితుడు రావికమతం ఎస్ఐకు గురువారం ఫిర్యాదు చేశాడు. ఇది తెలిసి వెంకటరమణ గురువారం స్టేషన్కు వెళ్లి ఎస్ఐ సురేష్కుమార్తో పాటు అందరూ చూస్తుండగానే శ్రీనుపై చేయి చేసుకున్నాడు. దీంతో కొందరు ఫోన్ చేయడంతో కొత్తకోట సీఐ మల్లేశ్వరరావు ఎకాయెకిన రావికమతం స్టేషన్కు వచ్చి సదరు నాయకున్ని తీవ్రంగా మందలించారు. ఆపై తదుపరి చర్యలకు ఆదేశించి వెళ్లిపోయారు. శ్రీను ఫిర్యాదు మేరకు వెంకటరమణపై కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ తెలిపారు.
నామీదే ఫిర్యాదిస్తావా!
Published Fri, Mar 13 2015 1:41 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
ఓటెత్తిన జనం!
వెనుదిరిగిన ఓటర్లు
సీపీ సుడిగాలి పర్యటన
ఓటేసిన ప్రముఖులు
● ఈవీఎంల్లో అభ్యర్థుల భవితవ్యం ● ప్రశాంతంగా ముగిసిన పోలింగ్ ● జిల్లాలో 66.53శాతం ఓటింగ్ నమోదు ● అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే తగ్గిన ఓటింగ్
లెక్కలేస్తున్న అభ్యర్థులు
సంతోషంగా ఉంది
ప్రశాంత వాతావరణంలో పోలింగ్
తొలిసారి ఓటేసిన యువత
ఓటేసిన ట్రాన్స్జెండర్లు
తప్పక చదవండి
- ప్రోటీన్ సప్లిమెంట్లను వినియోగించొద్దు! హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- హోర్డింగ్ కూలి 14 మంది మృతి.. ఆనంద్ మహీంద్రా ట్వీట్
- ప్రయాణికులతో కిక్కిరిసిన మెట్రో రైళ్లు.. నేడు అదనపు ట్రిప్పులు
- మీ పిల్లలను సరైన క్రమంలో తీర్చిదిద్దాలంటే ఇలా చేయండి!
- మళ్లీ హెడ్కోచ్గా రవిశాస్త్రి?
- తెలుగు సినిమాతో పరిచయమైన హీరోయిన్.. గుర్తుపట్టారా?
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- ‘గాజాపై అణు బాంబు వేయనివ్వండి’
- జేసీ కుటుంబంపై కేసు నమోదు
Advertisement