జనవరిలో ఎస్సై పోస్టుల భర్తీ | Sakshi
Sakshi News home page

జనవరిలో ఎస్సై పోస్టుల భర్తీ

Published Sun, Dec 15 2013 5:02 AM

SI posts to be filled up in january

 ధర్మాజీగూడెం (లింగపాలెం), న్యూస్‌లైన్ : తూర్పు, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 150 ఎస్సై పోస్టులను జనవరి నెలలో భర్తీ చేయనున్నట్టు ఏలూరు రేంజి డీఐజీ విక్రమ్‌సింగ్‌మాన్ చెప్పారు. ప్రస్తుతం వీరు శిక్షణ పొందుతున్నారని తెలిపారు. శనివారం ధర్మాజీగూడెం పోలీస్‌స్టేషన్‌ను ఆయన తనిఖీ చేశారు. ముందుగా స్థానిక పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. స్టేషన్ రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ కానిస్టేబుళ్ల పోస్టులను కూడా భర్తీ చేస్తామని.. ఇందుకు అనుమతి రావాల్సి ఉందన్నారు. కోడిపందాలపై ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. ఏలూరు రేంజి పరిధిలో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయని చెప్పారు. మంచి ప్రవర్తనతో మెలిగి ప్రజలకు చేరువ కావాలని పోలీసులకు సూచించారు. ఆయన వెంట జంగారెడ్డిగూడెం డీఎస్పీ సుబ్బరాజు, చింతలపూడి సీఐ ఎం.వెంకటేశ్వరావు, ధర్మాజీగూడెం ఎస్సై కె.శ్రీనివాసరావు, ఏఎస్సై కె.నాగేశ్వరావు ఉన్నారు.
 

Advertisement
Advertisement