అనంతపురం సెంట్రల్ :
జలయజ్ఞం పథకం ద్వారా చేపట్టిన ప్రాజెక్టులను వేగవంతం చేయాలని అధికారులను పరిశీలన బృందం ఆదేశించింది. జలయజ్ఞం పనులను పరిశీలించేందుకు విశ్రాంత చీఫ్ ఇంజినీర్లు రెహ్మాన్, అబ్దుల్బషీర్, బీఎస్ఎన్రెడ్డిను ఓ బృందంగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. శనివారం అనంతపురానికి చేరుకున్న బృందం సభ్యులు హెచ్చెల్సీ కాలనీలోని సీఈ కార్యాలయంలో అధికారులతో వారు సమీక్ష నిర్వహించారు. జిల్లాలో జలయజ్ఞం పనులు నత్తనడక సాగుతున్నాయని ఈ సందర్భంగా వారు అసహనం వ్యక్తం చేశారు.
హంద్రీనీవా పథకానికి ప్రభుత్వం తొలి ప్రాధాన్యతనిస్తోందని, స్టేజ్ 1, 2 పనులు త్వరితగతిన పూర్తి కావాలంటే ఏమి చేయాలని ప్రశ్నించారు. ప్రాజెక్ట్ పనుల్లో ఎదురవుతున్న అవాంతరాలపై వెంటనే నివేదికలు తయారు చేయాలని సూచించారు. వచ్చే ఏడాదిలోగా పెండింగ్ పనులను పూర్తి చేసి నీటిని తీసుకు రావడానికి ఇబ్బందులు లేకుండా చూడాలని అన్నారు. ఈ సందర్భంగా సీఈ మనోహర్ మాట్లాడుతూ... 2004, 2005 మధ్య ఒప్పందం ప్రకారం కాంట్రాక్టర్లు టెండర్లు దక్కించుకున్నారని, పెరిగిన మెటీరియల్, కూలి వలన కాంట్రాక్టర్లు పనులు పూర్తి చేయలేకపోతున్నారని వివరించారు.
ఇప్పటి వరకూ చేసిన పనులను ముగించి, ఇక నుంచి చేపట్టే పనులకు కొత్త ధర వేయాల్సిన అవసరం ఉందని సూచించారు. జిల్లాలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా రెండేళ్ళ నుంచి హంద్రీనీవా ద్వారా నీటిని తీసుకుంటున్నామని, దీని వలన కొన్ని ప్యాకేజీల్లో పనులు పెండింగ్లో ఉన్నాయన్నారు. ముఖ్యంగా 13, 33వ ప్యాకేజీ పనుల్లో నీటిని తోడించి మిగిలిన పనులు చేయించాల్సిన అవసరం ఉందన్నారు. హెచ్చెల్సీలో డిస్ట్రిబ్యూటరీ కాలువలను అభివృద్ది చేయాలని, దీని వలన తొలుత రైతులకు ప్రయోజనకరంగా ఉంటుందని సూచించారు. సమగ్ర నివేదికలను త్వరలో తయారు చేసి, అందజేస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో హెచ్చెల్సీ ఎస్ఈ మురళీనాథ్రెడ్డి, హంద్రీనీవా ఎస్ఈ సుధాకర్బాబు, ఈఈలు, డీఈలు పాల్గొన్నారు.
జలయజ్ఞం వేగవంతం చేయండి
Published Sun, Nov 2 2014 1:58 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement