ఆత్మకూరు రూరల్
అధికారులు, అధికార పార్టీ నేతల అండదండలతో స్వయం సహాయక సంఘాల నాయకులు అక్రమాలకు తెరలేపారు. సభ్యులందరికీ మంజూరైన నిధులను కొందరికి ఇచ్చి.. మరికొందరికి ఎగనామం పెట్టారు. గ్రామీణ ప్రాంతాల్లోని స్వయం సహాయక సంఘాల బలోపేతానికి కృషి చేయాల్సిన ఐకేపీ కార్యాలయం అక్రమార్కులకు అడ్డాగా మారింది. గుట్టుగా సాగుతున్న వీరి అవినీతి బాగోతం సమాచార హక్కు చట్టంతో రట్టు అయింది. వెంటనే బాధితులు అక్రమార్కులపై డీఎస్పీకి ఫిర్యాదు చేశారు.
దీంతో అధికారులు, గ్రామైక్య సంఘ లీడర్లు కేసును నీరుగార్చేందుకు బాధితుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. వివరాలిలా ఉన్నాయి. ఆత్మకూరు మండలంలోని నల్లకాల్వ గ్రామంలో భవానీ, అపరంజీ, సమీర అనే మూడు గ్రామైక్య సంఘాలు ఉన్నాయి. దళిత, గిరిజన ఉప ప్రణాళికలో భాగంగా దళిత, గిరిజనులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఈ ఏడాది ఏప్రిల్ నెలలో గ్రామంలోనీ భవానీ గ్రామైక్య సంఘంలో 34 మందికి రూ.10.50 లక్షలు మంజూరయ్యాయి. అయితే గ్రామైక్య సంఘం అధ్యక్షురాలు సరళమ్మ, ఆమె భర్త శ్రీనివాసులు అధికారులతో కుమ్మక్కై లబ్ధిదారులకు ఆ రుణాలు ఇవ్వకుండా తమకు అనుకూలమైన వారికి కొంతమేర రుణాలు అందజేశారు.
రూ.40 వేలు వచ్చిన వారికి రూ.20 వేలు, రూ.30 వేలు వచ్చిన వారికి రూ.15 వేల చొప్పున కేవలం 14 మందికి మాత్రమే ఇచ్చారు. అయితే రికార్డుల్లో, బాండు పేపర్లలో మాత్రం లబ్ధిదారులకు మాత్రమే రుణాలు ఇచ్చినట్లు రాసుకున్నారు. రుణాల విషయాలను నిలదీసిన వారికి మాత్రం గుట్టుచప్పుడు కాకుండా రూ.10 వేల చొప్పున ఇద్దరికి ఇచ్చినట్లు సమాచారం. గ్రామంలో కొందరికి మాత్రమే రుణాలు రావడంతో కొన్ని సందర్భాల్లో రుణాల విషయాలను తమకు తెలపాలంటూ అధికారులను, గ్రామైక్య సంఘాల లీడర్లను, సభ్యులను అడిగినా వారు సరైన సమాచారం ఇవ్వకపోవడంతో అనుమానం వచ్చిన బాధితులు సమాచార హక్కు చట్టంతో అక్రమాలను బయటకు తీశారు.
వెంటనే తమకు న్యాయం చేయాలని డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. అక్రమాలు బయట పడడంతో అవినీతికి పాల్పడిన గ్రామైక్య సంఘ లీడర్లు, సంబంధిత అధికారులకు ముచ్చెమటలు పట్టాయి. దీంతో వారు కేసును నీరుగార్చేందుకు బాధితుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. బాధితులు నరసింహుడు, బాలనాగమ్మ, మహానంది, సామేలు, శేఖర్, ప్రభుదాసు, పక్కీరయ్య, జయపాల్, నాగేశ్వరరావు అక్రమార్కులపై కేసు నమోదు చేసి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.
సమాచార హక్కు చట్టం లేకుంటే తమను పట్టించుకునే వారు కాదని, ఆ నిధుల గురించి తెలిసేది కాదని బాధితులు వాపోతున్నారు. ఇవే కాకుండా గ్రామంలోని మూడు గ్రామైక్య సంఘాల్లో అభయహస్తం, ఆమ్ఆద్మీ, విద్యార్థుల స్కాలర్షిప్పులు, జీవనోపాదుల కింద గొర్రెలు, బర్రెల కోసం మంజూరు చేసిన నిధులలో దాదాపు రూ.40 లక్షల మేర అవినీతి జరిగిందని బాధితులు ఆరోపిస్తున్నారు. అందువల్ల అవినీతి అక్రమాలకు పాల్పడిన గ్రామైక్య, సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.
అక్రమార్కులకు అధికార టీడీపీ అండ
గ్రామంలో అక్రమార్కులకు, అధికారులకు అధికార పార్టీ నేతల అండదండలు ఉండడంతో వారిని ఎదురించేందుకు ఎవ్వరూ సాహసించడంలేదు. ఫలితంగా వచ్చిన డబ్బునంతా నేతలు, వారి బంధువులు, అధికారులు మాత్రమే పంచుకుంటున్నారు. ఈ విధంగా వారి అక్రమాలు మూడుపువ్వులు ఆరుకాయలుగా సాగుతోంది. అంతేకాకుండా ప్రతి సంవత్సరానికి గ్రామైక్య, గ్రూపు లీడర్ల మార్పు జరగాలి. కానీ అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. గ్రామైక్య సంఘ లీడర్లుగా వారే గత 12 సంవత్సరాలుగా కొనసాగుతున్నారు. గతంలో మాజీ మంత్రి ఏరాసు అనుచరులుగా, ప్రస్తుతం శిల్పా అనుచరులుగా ఉంటున్నారు. అధికారులు సైతం అక్రమార్కులకే కొమ్ము కాస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.
రుణాలతో వడ్డీ వ్యాపారం
బ్యాంకుల ద్వారా, జీవనోపాదుల కింద, ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ నిధులు, ఐకేపీ ప్రత్యేక నిధులు మంజూరైతే అటు గ్రామైక్య సంఘ లీడర్లు, ఇటు అధికారులు కొందరికి మాత్రమే ఇస్తున్నారు. మిగిలిన డబ్బులతో వడ్డీ వ్యాపారం చేస్తున్నట్లు సమాచారం. ఈ విధంగా వీరు అక్రమంగా సంపాదిస్తూ అందరికీ అన్యాయం చేస్తున్నారని బాధితులు మండిపడుతున్నారు.
జిల్లా అధికారులకు ఫిర్యాదు చేయనున్న బాధితులు
అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని డీఎస్పీకి ఫిర్యాదు చేసినా బాధితులకు న్యాయం జరగడంలేదు. నాలుగు రోజులుగా విచారిస్తున్నా చర్యలు తీసుకోకపోవడంతో జిల్లా అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు బాధితులు తెలిపారు.
Breadcrumb
Related news
-
తమ్ముళ్ల బరితె గింపు!
► వైఎస్సార్ సీపీ నిజనిర్ధారణ కమిటీ పర్యటన విజయవంతం కావడాన్ని జీర్ణించుకోలేక టీడీపీ కవ్వింపు చర్యలు ► అమరావతి మండలం నరుకుళ్ళపాడులో ఇరువర్గాల ఘర్షణ ► మొత్తం 12 మందికి గాయాలు.. గుంటూరు పెద్దాసుపత్రిలో చికిత్స ► వైఎస్సార్సీపీ కార్యకర్తలను పరామర్శించిన కావటి మనోహర్ నాయుడు సాక్షి, గుంటూరు : అధికార పార్టీ కార్యకర్తలు అడ్డగోలు రాజకీయాలకు తెరతీశారు. గ్రామాల్లో ప్రశాంత వాతావరణాన్ని భగ్నం చేస్తూ దాడులకు తెగబడుతున్నారు. అమరావతి సదావర్తి సత్రం భూముల కుంభకోణంపై వైఎస్సార్ సీపీ ఏర్పాటు చేసిన నిజనిర్ధారణ కమిటీ ఆదివారం జరిపిన పర్యటన విజయవంతమైంది. దీన్ని జీర్ణించుకోలేని తెలుగు తమ్ముళ్లు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో సోమవారం అమరావతి మండలం నరుకుళ్లపాడులో వైఎస్సార్సీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ తలెత్తింది. మొత్తం 12 మంది గాయపడగా, వారిలో ఆరుగురు వైఎస్సార్సీపీ కార్యకర్తలు కాగా, ఆరుగురు టీడీపీ కార్యకర్తలు ఉన్నారు. అమరావతిలోని సదావర్తి సత్రం భూముల కుంభకోణంపై ఆదివారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిజనిర్ధారణ కమిటీ అమరావతిలో పర్యటించింది. ఈ క్రమంలో పార్టీ పెదకూరపాడు నియోజకవర్గ శ్రేణులు ఈ పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దీన్ని జీర్ణించుకోలేని తెలుగు తమ్ముళ్ళు అమరావతిలో నిజనిర్ధారణ కమిటీని అడ్డుకుని ఉద్రిక్తత వాతావరణం సృష్టించే ప్రయత్నం చేశారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తలు పూర్తి సం యమనం పాటించిన క్రమంలో పోలీసులు జోక్యం చేసుకుని టీడీపీ కార్యకర్తలను చెల్లాచెదురు చేశారు. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున కమిటీకి ఘనస్వాగతం పలకడంతోపాటు పర్యటనను విజయవంతం చేశారు. దీంతో టీడీపీ గ్రామస్థాయి నేతల్లో ఆక్రోశం మొదలైంది. ఈ క్రమంలో అమరావతి మండలం నరుకుళ్ళపాడు ఎస్సీ కాలనీలో టీడీపీ, వైఎస్సార్ సీపీ వర్గాల మధ్య జరిగిన పరస్పర దాడిలో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. టీడీపీ కార్యకర్తలు కవ్వింపు చర్యలకు పాల్పడి రెచ్చగొట్టి తొలుత వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడి చేశారు. దీంతో కార్యకర్తలు మేకల విజయ్, మేకల బుల్లెబ్బాయి, మేకల సురేష్, మేకల భారతి, మేకల రాంబాబు, రాణిలపై దాడి చేయగా తీవ్ర గాయాలయ్యాయి. వీరు కూడా వారిని ప్రతిఘటించి క్రమంలో ఎదురు దాడి చేయటంతో ఆ వర్గంలో కూడా ఆరుగురికి గాయాలయ్యాయి. అమరావతి సీఐ మురళీకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నరుకుళ్లపాడు దాడిలో గాయపడిన వైఎస్సార్ సీపీ కార్యకర్తలను పెదకూరపాడు నియోజకవర్గ సమన్వయకర్త కావటి మనోహర్నాయుడు పరామర్శించి ఆస్పత్రి సిబ్బందితో మాట్లాడి మెరుగైన వైద్యం కోసం గుంటూరు తరలించారు. గాయపడిన వారిని పరామర్శించిన వారిలో మండల పార్టీ నాయకులు కోటహరిబాబు, ఆలా లక్ష్మీనారాయణ, మేకల హనుమంతరావు, చింకా వెంకటేశ్వర్లు, నాగేశ్వరరావు, హష్మీ, పాపారావు, రాయల సాంబశివరావు, నెహ్రూ, రోశయ్య, శ్రీనివాసరెడ్డి తదితరులు ఉన్నారు. కఠినంగా శిక్షించాలి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కవ్వింపు చర్యలకు పాల్పడి గ్రామాల్లో ప్రశాంత వాతావరణాన్ని భంగపరుస్తున్నారని పెదకూరపాడు నియోజకవర్గ సమన్వయకర్త కావటి మనోహర్నాయుడు మండి పడ్డారు. సోమవారం రాత్రి ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. పార్టీ నిజనిర్ధారణ కమిటీ పర్యటన విజయవంతమైందనే అక్కసుతో గ్రామంలో కవ్వింపు చర్యలకు పాల్పడి తమ పార్టీ కార్యకర్తలపై దాడిచేశారని, టీడీపీ ప్రభుత్వం గ్రామాల్లో చిచ్చుపెడుతూ పబ్బం గడుపుతుందని మండి పడ్డారు. దీనిపై జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేసి చర్యలు తీసుకోవాలని కోరనున్నట్లు తెలిపారు. -
‘రఘుపై నిర్భయ కేసు నమోదు చేయాలి’
అనంతపురం : గుమ్మఘట్ట మండలం బైరవానితిప్పకు చెందిన ఇద్దరు మహిళలను వంచించిన అధికార పార్టీ నేత సోదరుడు రఘుపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేయాలని వైఎస్సార్సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు బోయ సుశీలమ్మ డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమెతో పాటు రాష్ట్ర కార్యదర్శి కేఎల్ దేవి, జిల్లా ప్రధాన కార్యదర్శులు టి.కృష్ణవేణి, కె.పార్వతి, బీకేఎస్ కొండమ్మ మాట్లాడారు. రఘు ఓ బాలికతో వివాహేతర సంబంధం కొనసాగిస్తూనే మరోవైపు తన అక్క కూతురిని వివాహం చేసుకున్నాడన్నారు. వివాహేతర సంబంధం విషయం తెలిసి మనస్థాపానికి గురైన కట్టుకున్న భార్య గతంలో ఆత్మహత్య చేసుకుందని గుర్తు చేశారు. మరోవైపు గర్భవతి అయిన బాలిక పెళ్లి చేసుకోవాలని కోరడంతో అధికారబలంతో బెదిరింపులకు పాల్పడ్డాడని ఆరోపించారు. దీంతో సదరు బాలిక కూడా ఆత్మహత్య చేసుకుందన్నారు. తన సోదరుడు టీడీపీ నాయకుడనే ధైర్యంతోనే రఘు బరి తెగించాడని ధ్వజమెత్తారు. ఇద్దరు యువతుల జీవితాలతో చెలగాటం ఆడిన రఘును కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో అఖిలపక్ష మహిళా సంఘాలతో కలిపి ఉద్యమిస్తామని హెచ్చరించారు. -
టీడీపీలో విభేదాల కుంపటి!
► పనులు, పదవులు కొందరికే ఇవ్వడంపై ద్వితీయ శ్రేణి నాయకుల ఆగ్రహం ► మంత్రి సతీమణి వద్ద వాపోతున్న నేతలు ► పాలక పార్టీలో వర్గపోరుతో అధికారులకు శిరోభారం యడ్లపాడు: గ్రామాల్లో సాధారణంగా వివిధ పార్టీలకు చెందిన వర్గాలు ఉంటాయి. యడ్లపాడు మండలం లో ప్రతి గ్రామంలోనూ అధికార పార్టీలోనే రెండు వర్గాలు ఉండడం విశే షం. గ్రామాల్లో ఆధిపత్యం, ప్రభుత్వ కార్యాలయాలు, పోలీస్స్టేషన్లో అధికారులపై పెత్తనం, పదవులు పందేరం, కాంట్రాక్టు పనులు కైవసం చేసుకోవడంపై పార్టీ నాయకుల మధ్య పొత్తు కుదరకపోవడంతోనే విభేదాల కుంపటి రాజుకుంది. గతంలో మాటలతోనే సర్దుకుపోయేవారు. ఇప్పుడు ఆయా వర్గాల వారు గొడవలు పడి పోలీస్స్టేషన్ పంచాయతీలకు సైతం వెళ్లడం గమనార్హం. ఒక వర్గం అదే పార్టీకి చెందిన వ్యక్తికి సపోర్టు చేస్తే రెండోవర్గం వారు దానిని వ్యతిరేకిస్తారు. అవసరమైతే మంత్రి నివాసంలో పంచాయతీ ఏర్పాటు చేస్తారు. ఇలా గ్రామాల్లో ప్రతిచోటా టీడీపీలోనే రెండు వర్గాలు తయారయ్యాయి. ఈ రెండు వర్గాల నడుమ సామాన్యుడు నలిగిపోతున్నాడు. ద్వితీయశ్రేణి నాయకులకు రిక్తహస్తం ఎన్నికల సమయంలో పార్టీ గెలుపుకోసం అందరం సమష్టి కృషి చేసినా గ్రామాల్లో ప్రధాన నేతలకే పనులు, పెత్తనం కట్టబెట్టారని ద్వితీయ శ్రేణి నాయకులు ఆరోపిస్తున్నారు. తమను పట్టించుకోవడం లేదని గుర్రుగా ఉన్నారు. రెండు గ్రూపుల్లో ఒకవర్గం మంత్రిని కలిసి కాంట్రాక్టులు చేజిక్కించుకుండగా, రెండోవర్గం వారు మంత్రి సతీమణిని ఆశ్రయించి పనులు, పదవుల పంపకంలో తమకు జరిగిన అన్యాయాన్ని వెళ్లబోసుకుంటున్నారు. ఏ పని చేయాలన్నా దిగువ శ్రేణి నాయకులను పూర్తిగా విస్మరిస్తున్నారంటూ రగిలిపోతున్నారు. పార్టీకోసం పనిచేసిన వారికి కాకుండా తమ గ్రామంలో ఇతరులకు పనులు అప్పగించడంపై మండిపడుతున్నారు. మండలంలోని ఓ ఐదారుగురికి మినహా మిగిలిన వారిని పట్టించుకునే పరిస్థితి కన్పించడం లేదంటూ తెలుగు తమ్ముళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సామాజిక వర్గం, డబ్బు, నోరేసుకుని పడేవారికే పరపతి, పదవులు దక్కుతున్నాయంటూ వాపోతున్నారు. అధికారులకు శిరోభారం మొదట మంత్రి వద్ద మార్కులు కొట్టేసేందుకు అధికారపార్టీ నేతల అడుగులకు మడుగులొత్తిన అధికారులకు ఇప్పుడు శిరోభారంగా మారింది. గ్రామస్థాయి, మండలస్థాయి సమావేశాల్లో ఎవరిని పిలిస్తే ఏమవుతుందోనని భయపడుతున్నారు. టీడీపీ వర్గీయులు చెప్పినట్లు పనులు చేస్తున్న అధికారులు ఇప్పుడు రెండు వర్గాలు ఉండడంతో ఎవరికి పనులు చేస్తే రెండోవర్గం తమపై మంత్రి ఎదుట ఎలాంటి ఫిర్యాదు చేస్తారోనని ఆందోళన చెందుతున్నారు. -
ఎమ్మెల్యే కొమ్మాలపాటి ముసుగుదొంగ
వైఎస్సార్ సీపీ నేత బొల్లా క్రోసూరు:‘ పెదకూరపాడు శాసనసభ్యుడు కొమ్మాలపాటి శ్రీధర్ చాల గొప్పవాడు, ఘనుడు అంటూ గతంలో చెప్పుకునేవాళ్లు, ఇపుడే ఆయన చేసిన అక్రమాలతో కొమ్మాలపాటి ముసుగుదొంగ అని తేలిపోయింది’ అని వైఎస్సార్ సీపీ వినుకొండ నియోజకవర్గ ఇన్చార్జి బొల్లా బ్రహ్మనాయుడు పేర్కొన్నారు. క్రోసూరులోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం నియోజకవర్గ పార్టీ ఇన్చార్జి పానెం హనిమిరెడ్డితో కలిసి ఆయన విలేకర్లతో మాట్లాడారు. కొమ్మాలపాటి ముసుగులో చేసిన అక్రమాల గుట్టు రాష్ట్రస్థాయిలో గుప్పుమందన్నారు. సదావర్తి సత్రం స్థలాల కుంభకోణం, ఇసుక అక్రమ వ్యాపారం, అభినందన రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఎన్నో అక్రమాలకు పాల్పడ్డాడని విమర్శించారు. అవినీతి ఎమ్మెల్యే కొమ్మాలపాటిపై సీబీఐ లేదా సీబీసీఐడీతో విచారణ జరిపించాలని ముఖ్యమంత్రి చంద్రబాబును వైఎస్సార్ సీపీ డిమాండ్ చేస్తోందని అన్నారు. అధికారపార్టీ నేతల కనుసన్నల్లోనే తహశీల్దార్ వ్యవహరిస్తున్నారని ఆర్డీవో శ్రీనివాసరావుకు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారు. నియోజకవర్గంలో మట్టి, ఇసుక దందాలు నానాటికీ పేట్రేగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు టీడీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. అక్రమంగా కోట్లు గడిస్తునార్నని తెలిపారు. క్రోసూరు ముస్లిం కమ్యూనిటీకి చెందిన మశీదు కాంప్లెక్స్ విషయంలో పోలీసు అధికారులు అధికారపార్టీ మాటలు విని మశీదు పెద్దలకు పార్టీలంటగట్టి కేసులు పెట్టడటం దుర్మార్గమని అన్నారు. మండల రెవెన్యూ అధికారులు ముడుపులిచ్చేవారికే గుట్టుచప్పుడుగా పనులు చేస్తున్నారని , అధికారపార్టీ నేతల కనుసన్నలలోనే తహసీల్దార్ కార్యాలయం నడుస్తుండటం శోచనీయమని పేర్కొన్నారు. వెబ్లాండ్లో క్రోసూరు భూములకు డాట్ పెట్టటంతో రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయని ప్రజలు వాపోతున్నా తహసీల్దార్ మాత్రం పట్టించుకోవటం లేదని తెలిసిందన్నారు. -
నీరు-చెట్టు.. అవినీతిదే పెమైట్టు
► అడిగిన కాడికి ఇస్తేనే చెరువుల పూడిక తీత ► అగ్రిమెంట్ వసూళ్లలో పోటీ పడుతున్న నీటిపారుదల శాఖ అధికారులు కర్నూలు సిటీ: నీరు చెట్టు కార్యక్రమం లక్ష్యం నీరుగారుతోంది. అధికారులు, అధికార పార్టీ నేతలు ఈ కార్యక్రమాన్ని ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారు. 100 ఎకరాల్లోపు ఆయకట్టు ఉన్న చెరువులను ఆయా గ్రామ పంచాయతీల్లో ఉన్న జన్మభూమి కమిటీలతో, ఆపైన ఆయకట్టు ఉన్న చెరువులను నీటి వినియోగదారుల సంఘాలతో పూడికతీత పనులు చేయించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే పనులు చేయించే వ్యక్తితో అగ్రిమెంట్ చేసుకోవాలని అందులో పేర్కొంది. దీనిని అవకాశంగా తీసుకున్న నీటిపారుదల శాక అధికారులు అగ్రిమెంట్ చేసేందుకు నీటి సంఘాలకు ఓ రేటు, జన్మభూమి కమిటీలకు మరో రేటు పెట్టి వసూళ్లు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చేసిన వసూళ్లలో అధికారపార్టీ నేతలకు సైతం వాటాలు ఇస్తున్నట్లు సమాచారం. అగ్రిమెంట్ వసూళ్లు ఇలా! జిల్లాలో చిన్న నీటి పారుదల శాఖ, పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో మొత్తం 634 చెరువులు ఉన్నాయి. ఈ ఏడాది మొత్తం 400 చెరువుల్లో పూడికతీత పనులు చేయాలని లక్ష్యం. ఇప్పటీ వరకు 323 పనులకు కలెక్టర్ అనుమతులు ఇచ్చారు. ఈనెల 13 వరకు 203 చెరువుల్లో మాత్రమే పూడికతీత పనులు ప్రారంభమయ్యాయి. నీటి సంఘం చేయించే పనికి రూ. 15 వేల నుంచి రూ. 40 వేల వరకు, జన్మభూమి కమిటీలకు అప్పగించిన వారి దగ్గర నుంచి రూ.10 వేల నుంచి రూ.30 వేల వరకు వసూళ్లు చేస్తున్నారు. నంద్యాల డివిజన్కు చెందిన ఓ చెరువు పూడికతీత పని చేయిస్తున్న వ్యక్తి అక్కడి సాంకేతిక విభాగం అధికారుల వసూళ్లపై ఫిర్యాదు చేసేందుకు ఇటీవల కర్నూలుకు వచ్చారు. ఎస్ఈ సెలవుల్లో వెళ్లారని తెలుసుకుని వెనక్కి వెళ్లారు. ఈ వసూళ్ల పర్యంపై ఓ అధికారిని అడిగితే నంద్యాల డివిజన్లో పని చేస్తున్న ఓ అధికారి వసూలు చేస్తున్నట్లు తెలిసిందని, కర్నూలు డివిజన్లో పని చేసే ఓ అధికారి కూడా అలా చేస్తున్నారని, అయితే అవి ఆఫీస్ ఖర్చులకు వాడుకుంటారని చెప్పడం గమనార్హం. ఈ అక్రమ వసూళ్లకు నంద్యాల ప్రాంతానికి చెందిన అధికార పార్టీ నేత అండ ఉండటంతో, అతనికి వాటా కూడా ముడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మొత్తంమీద వసూళ్ల పర్వంలో కర్నూలు డివిజన్ కంటే నంద్యాల డివిజన్ అధికారులే ముందున్నారని సమాచారం. విచారించి చర్యలు తీసుకుంటాం నీరు-చెట్టు కార్యక్రమం కింద పూడికతీత పనులను నీటి వినియోగదారుల సంఘాలకు, జన్మభూమి కమిటీలకు ఇస్తున్నాం. అయితే అగ్రిమెంట్ చేసుకునేందుకు నంద్యాల, కర్నూలు డివిజన్ల కార్యాలయాల్లో డబ్బులు వసూలు చేస్తున్నారనే విషయం మా దృష్టికి అయితే రాలేదు. విచారించి చర్యలు తీసుకుంటాం. అగ్రిమెంట్కు డబ్బులు ఇవ్వడం, తీసుకోవడం నేరం కిందికి వస్తుంది. - చంద్రశేఖర్ రావు, జల వనరుల శాఖ పర్యవేక్షక ఇంజినీర్
Related News by category
-
జగన్ పథకాలు కాపీ కొడుతున్న టీడీపీ
జగన్ చేసిన పనులు కళ్లెదుటే కనిపిస్తున్నాయి. ఆ విషయమే చెబుతుంటే నన్ను వైఎస్సార్సీపీ సపోర్టర్ అంటున్నారు.వాస్తవానికి వైఎస్సార్సీపీ పథకాలన్నీ కాపీ చేస్తున్న టీడీపీ.. జగన్ను సమర్థిస్తున్నట్లే కదా! - సినీ దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజతెలుగు రాష్ట్రాల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా మంచి ప్రయత్నాలు విద్య, వైద్య రంగంలో ప్రారంభమయ్యాయి. ఉద్దానం కిడ్నీ బాధితుల కోసం అంత పెద్ద ఆస్పత్రిని ఈ ప్రభుత్వ కట్టించింది. ఈ పని ఇంత కాలంగా ఎవ్వరూ చేయలేదు. పెద్ద సంఖ్యలో మెడికల్ కాలేజీలు వస్తున్నాయి. మరోవైపు నిన్న, మొన్నటి వరకూ ఎవరూ పట్టించుకోని గవర్నమెంట్ స్కూల్స్లో చాలా అద్భుతమైన మార్పులు తెచ్చారు. ఇంటింటికీ వచ్చి హెల్త్ చెకప్స్, మందులు పంపిణీ చేసే ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ కూడా నాకు చాలానచ్చింది. మొత్తంగా చూస్తే ప్రజలకు అత్యంత ప్రధానమైన ఈ రెండు రంగాలకు జగన్ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యాన్ని ఎవ్వరైనా ఒప్పుకుని తీరాల్సిందే. లంచాలకు బ్రేక్ పడింది ఈ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన వలంటీర్ వ్యవస్థ కూడా చాలా బాగుంది. ప్రజల ఇళ్ల దగ్గరకు వెళ్లి లబి్ధదారులకు పథకాలు అందించడం వినూత్న ప్రయత్నం. ఒకప్పుడు ప్రభుత్వ పథకాలు అందుకోవాలంటే చాలా కష్టమయ్యేది. లంచాలతో తప్ప పనయ్యేది కాదు. వలంటీర్ వ్యవస్థ అలాంటి సమస్యలకు పరిష్కారం చూపింది. గ్రామ సెక్రటేరియట్స్లోనూ చాలా వరకూ పనులు సులభంగా అవుతున్నాయంటున్నారు. అక్కడక్కడా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయంటున్నా.. కొత్త వ్యవస్థ కాబట్టి బాలారిష్టాలు తప్పవు. అయితే వీటి ప్రభావం వల్ల ఇప్పటికే ఉన్న రెవెన్యూ, పంచాయతీ రాజ్ వ్యవస్థ లాంటివి వృథాగా మారకుండా చూడాల్సిన అవసరం ఉంది. చేసిన అభివృద్ధిని చెప్పుకోలేకపోయారు మెడికల్ కాలేజీలు, బందరు పోర్ట్తో సహా నాలుగు పోర్ట్లు కడుతున్నారు. షిప్పింగ్ హార్బర్స్ నిర్మాణంలో ఉన్నాయి. ఇలాంటివన్నీ చెప్పుకోవడంలో ఈ ప్రభుత్వం వెనుకబడిందని నా అభిప్రాయం. ఇప్పుడు చెబుతున్నారు కానీ తాము చేసిన అభివృద్ధి గురించి వైఎస్సార్సీపీ ప్రభుత్వం మొదటి నుంచీ చెప్పుకుని ఉండాల్సింది. మద్యం రేట్లపై విపక్షాల హామీ దురదృష్టకరం మద్యపాన నిషేధంలో భాగంగా చాలా వరకూ బెల్ట్షాపులు తగ్గించారు. వినియోగం తగ్గించడానికి రేట్లు కూడా పెంచారు. ఈ చర్యలు తాగుబోతులకు నచ్చకపోవచ్చు. అందుకనే ఈ ఎన్నికలు తాగుబోతులకు నాన్ తాగుబోతులకు మధ్య అన్నట్టు మారాయి. ఎన్నికల ప్రచారంలో ‘నాణ్యమైన మద్యం ఇస్తాం... మ ద్యం రేట్లు తగ్గిస్తాం’ అంటూ ప్రతిపక్ష పారీ్టలు ప్రచా రం చేయడం చాలా దురదృష్టకరం. మద్యపాన నిషే« దం చేయలేదని విమర్శిస్తున్న వారు తాము చేస్తామని ధైర్యంగా చెప్పాలి గానీ... నాణ్యమైన మద్యం ఇస్తాం అనడం ఏమిటి? మొత్తంగా చూస్తే అత్యధిక సంఖ్యలో మహిళలు వైఎస్సార్సీపీ వైపే ఉన్నారు. తాగుబోతు భర్తల్ని మహిళలు అదుపు చేయగలిగితే మ రోసారి వైఎస్సార్సీపీ బంపర్ మెజారీ్టతో వస్తుంది. నవరత్నాలపై రాష్ట్ర నాశనం అన్నవారే ఫాలో అవుతున్నారు మొన్నటి దాకా నవరత్నాలు వృథా... అవి ఇవ్వడం వల్ల రాష్ట్రం నాశనం అయిపోతోంది అన్నారు. ఇప్పుడు పన్నెండున్నర రత్నాలు ఇస్తామంటున్నారు. వలంటీర్ల వల్ల నేరాలు ఘోరాలు అన్నారు. కానీ జీతాలు పెంచి మరీ కొనసాగిస్తామంటున్నారు. వీళ్లు అవన్నీ అనేసి నాబోటి వాళ్లని వైఎస్సార్సీపీ సపోర్ట్ అంటున్నారు. నిజానికి నేను బాగుందని మాత్రమే అంటున్నా ‘జగన్ పథకాలన్నీ తిరిగి తెస్తాం, జీతాలు పెంచి మరీ వలంటీర్లను కొనసాగిస్తాం.. గ్రామ సెక్రటేరియట్, నాడు నేడు వంటివన్నీ మేమూ అమలు చేస్తాం’ అంటున్నారంటే తమకు కూడా ఈ పథకాలన్నీ నచ్చాయని చెబుతున్నట్టే కదా.. అంటే తెలుగుదేశం వాళ్లు కూడా వైఎస్సార్సీపీ మద్దతు దారులన్నట్టే కదా. పోలవరం పూర్తయితే బాగుంటుంది పోలవరం వచ్చే ఐదేళ్లలో పూర్తయితే బాగుంటుందని ఆశిస్తున్నా. అలాగే విభజన హామీలు కూ డా పూర్తిగా సాధించాల్సి ఉంది. మరోవైపు అధికార ప్రతిపక్షాలు ఇకనైనా వ్యక్తిగత దూషణలు వదిలేసి రాష్ట్రం, రాష్ట్ర ప్రజల అభివృద్ధి గురించి మాత్రమే ఎక్కువగా మాట్లాడితే బాగుంటుంది. –సత్యార్థి -
చీకటి రాత్రులకు బ్రేక్
ప్రతి సర్వీసుకీ ప్రత్యేక ట్రాన్స్ఫార్మర్ విద్యుత్ ప్రమాదాలు జరగడానికి, సరఫరా నష్టాలు రావడానికి ఫీడర్లు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు, లైన్లు బలంగా లేకపోవడం, ఓవర్ లోడ్ కావడమే ప్రధాన కారణం. ఈ సమస్యను తగ్గించడానికి కొత్త సబ్స్టేషన్లు నిర్మించడంతో పాటు పాత సబ్స్టేషన్లలో ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యం పెరిగింది. ట్రాన్స్కో పరిధిలో ఉన్న 220కేవీ, 132 కేవీ లైన్లను పాతవి బాగుచేయడంతో పాటు కొత్తవి వేశారు.డిస్కంల పరిధిలోని 33 కేవీ, 11కేవీ లైన్లు మార్చారు. సబ్ స్టేషన్లలో పవర్ కెపాసిటర్లు ఏర్పాటు చేశారు.ప్రతి వ్యవసాయ సర్విసుకీ ప్రత్యేక ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసి విద్యుత్ ఇస్తున్నారు. ఫలితంగా ప్రస్తుతం రాష్ట్రంలో 19.92 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు నాణ్యమైన విద్యుత్ అందుతోంది. ‘మా ప్రాంతంలో మొత్తం విద్యుత్పై ఆధారపడే వ్యవసాయం చేస్తారు. గత ప్రభుత్వంలో 7 గంటలు విద్యుత్ అని ప్రకటించినా అందులో ఒకటి రెండు గంటలపాటు కోతలు ఉండేవి. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పగటి పూట 9 గంటలు నిరంతరాయంగా విద్యుత్ అందిస్తున్నారు. దీనివల్ల కూలీలతో పనిచేయించుకొని, చేను మొత్తం తడపడానికి వీలవుతోంది.గతంతో హెచ్టీ, ఎల్టీ లైన్లు ఒకే స్తంభంపై ఉండేవి. దీనివల్ల కొద్దిపాటి గాలికే కలిపిపోయి ట్రాన్స్ఫార్మర్, మోటార్లు కాలిపోయేవి. ఇప్పుడా సమస్య లేదు. గతంలో రోజుకి ఏడు గంటలు రాత్రి సమయాల్లో సేద్యానికి విద్యుత్ ఇవ్వడం వల్ల పొలాల్లోనే ఉండాల్సి వచ్చేది. ఇప్పుడు ఒకే స్పెల్లో ఇవ్వడంతో చేను మొత్తం ఒకేసారి తడుస్తోంది’. – సూర్పని రామకృష్ణ, ఉద్యాన రైతు, కొమ్ముగూడెం సాక్షి, అమరావతి: ‘సేద్యానికి విద్యుత్ లోటు రాకూడదు. రైతులకు ఇచ్చే విద్యుత్కు ఎంత ఖర్చయినా ప్రభుత్వమే భరిస్తుంది. వ్యవసాయ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దెబ్బతింటే 48 గంటల్లోనే బాగుచేయడం, లేదా కొత్తది ఇవ్వాలి. ఎలాంటి జాప్యం ఉండకూడదు. సర్విసు కూడా అడిగిన వెంటనే మంజూరు చేయాలి. రైతులకు ఎలాంటి ఇబ్బంది కలుగకూడదు’.అంటూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పిన మాటలను ఈ ప్రభుత్వం అక్షర సత్యం చేసింది.పంటలకు నీటి కొరత లేకుండా చేసి రైతుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు అవసరమైన అన్ని చర్యలను ఆచరణలో పెట్టింది. పగటిపూట 9 గంటలు నిరంతరాయంగా ఉచిత విద్యుత్ అందించేందుకు ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే చర్యలు చేపట్టింది. అందుకు అనుగుణంగా ముందుగా వ్యవసాయ విద్యుత్ ఫీడర్లను ఆధునీకరించి ఉచిత విద్యుత్ సరఫరాకు అనుకూలంగా మార్చింది. గతమెంతో ‘హీనం’ రాష్ట్రంలో వ్యవసాయ ఫీడర్లు ఏడాదికి దాదాపు 15,700 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగంలో ఉండేవి. ఇది రాష్ట్రంలో ఏడాదికి జరిగే 64 వేల నుంచి 66 వేల మిలియన్ యూనిట్ల వినియోగంలో దాదాపు నాలుగింట ఒక వంతు. జూన్ 2019కి ముందు, ఏడు గంటల విద్యుత్ సరఫరాకే గ్యారెంటీ ఉండేది కాదు.అప్పుడు దాదాపు 18 లక్షల వ్యవసాయ సర్విసులకు ఒకేసారి విద్యుత్ ఇవ్వాల్సిన అవసరం ఉండేది కాదు. అయినప్పటికీ వాటికే సరిపెట్టలేక రాత్రి పూట సహా రెండు, మూడు విడతల్లో విద్యుత్ అందించేవారు. కానీ ప్రస్తుత ప్రభు త్వం పగటి పూట విద్యుత్ సరఫరా అందిస్తోంది. దానికి తగ్గట్టుగా ప్రణాళికలు రచించి అమలు చేసింది. రెట్టింపైన ఫీడర్లు టీడీపీ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా 6,663 ఫీడర్లలో కేవలం 3,854 మాత్రమే వ్యవసాయ విద్యుత్ సరఫరా చేయడానికి అందుబాటులో ఉండేవి. దానిని మెరుగుపరచడం కోసం చంద్రబాబు ఏమాత్రం దృష్టి సారించలేదు. కానీ వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే దాదాపు రూ.1,700 కోట్లను కేటాయించింది.దీంతో ఏపీ ట్రాన్స్కో, ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు తమ తమ పరిధిలో ఫీడర్ల ఆధునికీకరణ చేపట్టాయి. రూ.1200.20 కోట్లతో 32 ప్యాకేజీలలో మౌలిక సదుపాయాల పనులను పూర్తి చేశాయి. పెరిగిన 6,735 ఫీడర్లలో 6,605 ఫీడర్లకు పగటిపూట 9 గంటల పాటు విద్యుత్ సరఫరా చేయగల సామర్థ్యం వచ్చింది. -
చిన్నమ్మ.. వెన్నుపోటులో పెద్దమ్మ..
సాక్షి ప్రత్యేక ప్రతినిధి: చిన్నమ్మ..తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై కనీస అవగాహన ఉన్నవారికి ఈ పేరు సుపరిచితమే. ఎన్టీఆర్ కుమార్తెగా, రాజకీయ నాయకురాలిగా తనకంటూ ఓ గుర్తింపు పొందారు పురందేశ్వరి. మెట్టినిల్లు దగ్గుబాటి ఇంట అడుగిడి రాజకీయ అరంగేట్రం చేశారు. రెండుసార్లు కేంద్ర మంత్రి పదవి చేపట్టారు. వీటితోపాటు తాజాగా ఆమె ఘనతలో మరోసారి ‘వెన్నుపోటుదారు’అనే అలంకారం చేరింది. అదికూడా రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తిస్తున్న బీజేపీ నుంచే కావడంతో చిన్నమ్మ మరింత చిన్నబోయారు. నాడు–నేడు బాబుకే చేదోడు సీఎం పీఠం కోసం అవమానకరంగా ఎన్టీఆర్ను పదవీచ్యుతుణ్ని చేసిన నారా చంద్రబాబునాయుడు వెన్నుపోటుదారునిగా అందరి నోళ్లలో నిత్యం నానుతూనే ఉన్నారు. ఈ వెన్నుపోటు వ్యవహారంలో పురందేశ్వరి భర్త, బాబుకు తోడల్లుడు డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు తనవంతు పాత్ర పోషించినట్లు పలు సందర్భాలలో బహిరంగంగానే పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. తన తండ్రికి వెన్నుపోటు పొడిచిన అంకంలో భర్తను గట్టిగా ప్రోత్సహించి, మరిది బాబుకు చేదోడువాదోడుగా నిలిచారని పురందేశ్వరి గురించి అయినవారంతా చెప్పుకుంటారు. ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా పొత్తుల ముసుగులో తన పార్టీకన్నా టీడీపీకే మద్దతిస్తున్నారని కమలం నేతలు గుర్రుగా ఉన్నారు. అధ్యక్షురాలిగా ఈ స్థాయిలో పార్టీకి వెన్నుపోటు పొడవటాన్ని అంతర్గత సమావేశాల్లో నాయకులు ప్రశ్నిస్తున్నారని సమాచారం. 5 ఎన్నికలు... 4 స్థానాలు పురందేశ్వరి రాజకీయ ప్రస్థానం గమనిస్తే కాంగ్రెస్కు వ్యతిరేకంగా తన తండ్రి టీడీపీని స్థాపించి అధికారంలోకి వస్తే.. ఈమె హస్తం పంచన చేరి, 2004 ఎన్నికల్లో బాపట్ల లోక్సభ స్థానం నుంచి గెలుపొందారు. బాబు తమ కుటుంబానికి చేసిన మోసం వల్లే కాంగ్రెస్లో చేరినట్లు సమరి్ధంచుకున్నారు. అదే వాస్తవమైతే ఇప్పుడు చంద్రబాబుకు అంతలా వత్తాసు ఎలా పలుకుతున్నారన్నది విశ్లేషకుల ప్రశ్న. బాపట్ల రిజర్వుడు స్థానం కావడంతో 2009లో విశాఖ నుంచి పోటీచేశారు. రెండుసార్లూ దివంగత మహానేత వైఎస్సార్ హవా తన విజయానికి బాటలు వేసింది.కేంద్ర మంత్రి పదవి కూడా దక్కింది. రాష్ట్ర విభజన సాకుతో యూటర్న్ తీసుకుని కాంగ్రెస్కు బద్ధశత్రువైన బీజేపీలో చేరారు. 2014లో రాజంపేట నుంచి ఎన్డీయే అభ్యర్థిగా కమలం గుర్తుపై పోటీచేసి వైఎస్సార్సీపీ అభ్యర్థి మిథున్రెడ్డి చేతిలో దారుణ ఓటమి చవిచూశారు. 2019లో విశాఖ నుంచి బీజేపీ అభ్యర్ధిగా 33,892 ఓట్లతో డిపాజిట్ కోల్పోయారు. ఇప్పుడు మళ్లీ ఎన్డీయే అభ్యర్ధిగా బీజేపీ తరఫున రాజమండ్రి ఎంపీ స్థానంలో పోటీకి దిగారు. స్వార్థమే పరమావధిగా... 2019లో దగ్గుబాటి వెంకటేశ్వరరావు పర్చూరు అసెంబ్లీ స్థానం నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీ చేయగా పురందేశ్వరి విశాఖ లోక్సభ స్థానం నుంచి బీజేపీ తరఫున బరిలో ఉండటం అప్పట్లో చర్చనీయాంశమైంది. డాక్టర్ దగ్గుబాటికి నాయకునిగా ప్రత్యేక గుర్తింపు లేకపోలేదు. గత ఎన్నికల తరువాత ప్రత్యక్ష రాజకీయాలకు ఆయన దూరమయ్యారు. చిన్నమ్మ కోసం పరోక్ష రాజకీయాలు చేస్తూ తెరమరుగవ్వాల్సి వచ్చిందని ఆయన వీరాభిమానులు వాపోతున్నారు. ఆయన మాత్రం తనకు రాజకీయాలంటే విముఖతని చెప్తూనే.. పురందేశ్వరి కోసం తాజాగా రాజమండ్రిలో తిష్ట వేయడం గమనార్హం. ఎన్టీఆర్ను మించిన నటి చిన్నమ్మ: నందమూరి లక్ష్మీపార్వతి ‘అవును, నేను చెబుతున్నది యదార్థం. ఎన్టీఆర్ స్క్రీన్పై కనిపించి మహానటుడిగా వినుతికెక్కారు. చిన్నమ్మ తెరవెనుక నటనలో మహానటిని మించారు. ఎన్టీఆర్కు వెన్నుపోటు వ్యవహారంలో కుటుంబపరంగా పురందేశ్వరి పాత్రను తెలుసుకున్న ఎన్టీఆర్ అభిప్రాయమిది. ఆ సమయంలో ప్రత్యక్ష సాక్షిగా ఉన్నందునే ఈ మాటలు చెప్పగలుగుతున్నానని’ నందమూరి లక్ష్మీపార్వతి ’సాక్షి’కి తెలిపారు. ‘చంద్రబాబు, రామోజీల వెన్నుపోటు కుట్ర గురించి దగ్గుబాటికి తొలుత తెలియదు.బాబుకు సహకరించే క్రమంలో పురందేశ్వరే కుటుంబ సభ్యులను కూటమి కట్టేలా చేసింది. భర్తను దగ్గరుండి వైశ్రాయ్ హోటల్కు పంపింది. ఆ వెంటనే ఎన్టీఆర్ వద్దకు వచ్చి పక్కన కూర్చుంద’న్నారు. చిన్నమ్మ నాటకాలు ఆ సమయంలో గుర్తించలేకపోయినా ఆ తరువాత వెన్నుపోటుకు సంబంధించిన వాస్తవాలన్నీ తెలిశాయని, నటనలో తనను కూతురు మించిపోయిందని ఎన్టీఆర్ పలు సందర్భాలలో ప్రస్తావించారని లక్ష్మీపార్వతి వివరించారు. బీజేపీకి భారీ వెన్నుపోటుటీడీపీ, జనసేనతో జట్టు కట్టిన బీజేపీ ఆరు లోక్సభ, పది అసెంబ్లీ స్థానాల్లో పోటీచేస్తుండగా, ఆయా స్థానాల ఎంపిక, అభ్యర్థుల మార్పులు చేర్పుల్లో మరిది బాబుతో కలిసి చిన్నమ్మ ఆడిన డ్రామాలను ప్రజలు గమనించకపోలేదు. అనపర్తిలో మాజీ సైనికుడు శివకృష్ణరాజును కాదని, టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి టికెట్ కట్టబెట్టారు. కడప జిల్లా బద్వేలు అభ్యర్థి రోశన్న టీడీపీ కండువా తీసేసిన మరునాడే బీజేపీ టికెట్ దక్కింది. సుజనాచౌదరి, కామినేని శ్రీనివాస్, ఆదినారాయణరెడ్డి, ఎన్.ఈశ్వరరావులు ఏ పార్టీ వారో అందరికీ తెలుసు.వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే వరప్రసాద్కు తిరుపతి ఎంపీ టికెట్ కేటాయించారు. అనకాపల్లి నుంచి లోక్సభకు పోటీచేస్తున్న సీఎం రమేశ్ చంద్రబాబు జేబులో మనిషి. కాపులకు బీజేపీ నుంచి ఒక్క టిక్కెట్ కూడా దక్కకపోవడానికి పురందేశ్వరే కారణమని ఆ వర్గం బాహాటంగానే ఆరోపిస్తోంది. తన కళ్ల ముందు ప్రధాని మోదీ ఫ్లెక్సీలను కొందరు టీడీపీ కార్యకర్తలు చింపుతున్నా, కనీసం వారించకుండా మౌనం వహించిన చిన్నమ్మ వైఖరి బీజేపీ శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి రేపుతోంది. -
ఆ కుటుంబ నైజం.. కస్సుబుస్సు
వృత్తి: ట్రాన్స్పోర్టు బిజినెస్ప్రవృత్తి: హత్యా రాజకీయాలు.. నేరాలు.. ఘోరాలుపదవి: ఉమ్మడి అనంతపురం జిల్లాలో కీలక దేశం నేతఅరాచకాలు,కేసులు: చెప్పలేనన్నిఅతనో నియంత.. అతనికెదురెళ్తే టిప్పర్ లారీకి ఎదురెళ్లినట్లే.. తన దురన్యాయాలను ఎవరైనా ప్రశ్నిస్తే ఆ రోజుతో వారికి భూమ్మీద నూకలు చెల్లినట్లే.. ఊళ్లలో ఫ్యాక్షన్ మంటలను ఎగదోసి, వాటితో చలికాచుకునే దుర్మార్గ రాజకీయం తన సొంతం.. అదే తన హాబీ కూడా.. రౌడీషీట్ తెరిపించుకున్న ఘనత ఆయన సొంతం. ఆయన తనయుడూ తక్కువేమీ తినలేదు. ప్రస్తుతం ఇతను ‘దేశం’ తరఫున పోటీ చేస్తున్నారు. సాక్షి, టాస్్కఫోర్స్ : ట్రావెల్స్ ద్వారా కండిషన్ లేని బస్సులను నడిపి ఆ ‘దేశం’ నేత ప్రయాణికుల జీవితాలతో చెలగాటమాడారు. 2013 అక్టోబరు 30వ తేదీన మహబూబ్నగర్ సమీపంలో పాలెం వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో దాదాపు 45 మంది అగ్నికి ఆహుతైన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆ సీనియర్ నేత భార్యను పోలీసులు అరెస్టు చేశారు. నకిలీ లీజు అగ్రిమెంట్లు సృష్టించారని ఆ నేతపై సీఐడీ అభియోగాలను మోపింది.2017లో విజయవాడ వద్ద ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో 11 మంది ప్రయాణికులు మృత్యువాతపడ్డారు. కాంట్రాక్ట్ క్యారేజ్ పేరుతో పర్మిట్లు తీసుకుని స్టేట్ క్యారేజ్గా బస్సులు నడపడంపై అప్పట్లో తెలంగాణ ప్రభుత్వం అడ్డుకట్ట వేసింది. తప్పు చేసింది కాకుండా తన మోసాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఆ నేత హైదరాబాద్ ఆర్టీఓ కార్యాలయాన్ని తన అనుచరులతో కలిసి ముట్టడించే ప్రయత్నం చేశారు. అక్రమాలకు పరాకాష్టగా బీఎస్ 3 వాహనాలు ఆ నేత అక్రమాలకు పరాకాష్టగా బీఎస్–3 వాహనాల కుంభకోణం నిలిచింది. ఓ ప్రముఖ సంస్థ వద్ద స్క్రాప్ ద్వారా కొనుగోలు చేసిన 154 బీఎస్–3 లారీలను బీఎస్–4 వాహనాలుగా నకిలీ ఎన్ఓసీ, ఇన్సూరెన్స్తో నాగాలాండ్లో అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించారు. ఈ వ్యవహారంలో రూ.కోట్లలో లబ్ధి పొందినట్లు ఆరోపణలున్నాయి. ఈ అక్రమాలపై సీబీఐ,ఈడీ దాడులు చేశాయి. 2020లో ఆ నేతతో పాటు ఆయన కుమారుడు, అనుచరుడు, మరికొందరిపై వివిధ పోలీసు స్టేషన్లలో 24 కేసులు నమోదయ్యాయి. బస్సులను సీజ్ చేయడంతోపాటు ఈ నేత, బినామీల పేరుపై ఉన్న రూ.22 కోట్లకు పైగా ఆస్తులను ఈడీ అటాచ్ చేసి, పలు రికార్డులు స్వా«దీనం చేసుకోవడంతోపాటు బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేసింది. ప్రభుత్వ నిధులూ స్వాహా...?తాడిపత్రి ఎమ్మెల్యే హోదాలో ప్రభుత్వ నిధులను పెద్ద ఎత్తున దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు ఎన్నో ఉన్నాయి. 2015æలో యాడికి మండలంలో గ్రామీణ సడక్ యోజన కింద రూ.2.40 కోట్లతో చేపట్టిన రోడ్డు పనులను కమీషన్ల కక్కుర్తితో నాసిరకంగా పూర్తి చేయించారు. రాయలచెరువులో నీరు–చెట్టు కింద పూడికతీత పనుల్లో రూ.2.5 కోట్లు దండుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.పెద్దవడుగూరు మండలంలో 2015లో రూ.6.45 కోట్లతో నీరు–చెట్టు కింద చేపట్టిన పనుల్లో ఎక్కువ శాతం చేయకుండానే పూర్తయినట్లు రికార్డుల్లో చూపించి నిధులు బొక్కేశారు. పెద్దవడుగూరు మండలంలోని పెద్ద వంక వద్ద జంగిల్ క్లియరెన్స్ పేరుతో దాదాపు రూ.8 లక్షలు కాజేశారు. చిన్నవడుగూరులో కుంట, కాలువల్లో ముళ్ల పొదల తొలగింపునకు దాదాపు రూ.18 లక్షలు, పెద్దవంకలో రూ.7 లక్షలను పనులు చేయకుండానే పక్కదారి పట్టించారు. కేసుల వివరాల► ఇప్పటికే రౌడీ షీట్ నమోదై ఉంది. ► 1996లో జరిగిన టౌన్బ్యాంకు ఎన్నికల సందర్భంగా జరిగిన హింసాత్మక సంఘటనల్లో టీడీపీకి చెందిన లక్ష్మీనారాయణ హత్యకు గురయ్యారు. ఈ కేసులో ఆయన నిందితునిగా ఉన్నారు. ► మున్సిపల్ చైర్మన్గా ఎన్నికైన తర్వాత వివిధ పోలీస్ స్టేషన్లలో మొత్తం 70కి పైగా కేసులు ఉన్నాయి. 1996 నుంచి 2024 వరకు తాడిపత్రి పట్టణ పోలీసు స్టేషన్లో 57 కేసులు, తాడిపత్రి అప్గ్రేడ్ రూరల్ పోలీసు స్టేషన్లో 5, పెద్దపప్పూరు పోలీసు స్టేషన్లో 6, యాడికిలో ఒక కేసు నమోదయ్యాయి. ► 2020లో నకిలీ ఇన్సూరెన్స్ కుంభకోణంలో తాడిపత్రి పట్ట ణ, అప్గ్రేడ్ రూరల్ పోలీసు స్టేషన్లలో 28 చీటింగ్ కేసుల నమోదు. బీఎస్ 3 వాహనాలను బీఎస్ 4 వాహనాలుగా మార్చి నాగాలాండ్లో అక్రమ రిజిస్ట్రేషన్లు చేయించడంతో ఆయనపై పోలీసులు ఒకేసారి 28 కేసులు నమోదు చేశారు. (1). ఎఫ్ఐఆర్ నెం. 28/2020. ఐపీసీ 420, 467, 468, 471, 472, 120(బి), 201 రెడ్విత్ 34 ఐపీసీ సెక్షన్లు. (2) ఎఫ్ఐఆర్ : 85/2020. ఐపీసీ 420, 467, 468, 471, 120–బి రెడ్విత్ 34 ఐపీసీ, 179, 182, 190 ఎం.వి.యాక్టు) మరో 27 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. ► 2023లో పెద్దపప్పూరులోని ఇసుక రీచ్లో అక్రమాలు జరుగుతున్నాయంటూ అనుచరులతో కలిసి వెళ్లిన ఆయన అక్కడున్న టిప్పర్ డ్రైవర్ వీరాంజనేయులుని కులం పేరుతో దూషించిన ఘటనపై ఎస్సీ, ఎస్టీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ► 1996 నుంచి 1999 వరకు జరిగిన పలు హింసాత్మక ఘటనల్లో ఆయన నిందితునిగా ఉన్నాడు. పీడీ యాక్ట్ ద్వారా పోలీసులు కేసు నమోదు చేసి హైదరాబాద్లోని చంచల్గూడ జైలుకు తరలించారు. తాడిపత్రి టౌన్ పోలీస్ స్టేషన్లో 2014లో ఎఫ్ఐఆర్ నెం. 142/14, సెక్షన్ 151 సీఆర్పీసీ కింద పీడీ యాక్టు నమోదైంది. అసెంబ్లీ పోటీలో ఉన్న తనయుడిపై కేసులు : ► ఆయన తనయుడిపై 30 కేసులు నమోదయ్యాయి. నకిలీ పత్రాలను సృష్టించి వాహనాలను విక్రయాలు జరిపిన నేరంపై 2022లో ఐపీసీ 420, 467,468,471,120బి రెడ్విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఈ కేసులో తండ్రీకొడుకులు కడప సెంట్రల్ జైలులో 50 రోజులు జ్యూడిíÙయల్ రిమాండ్లో ఉన్నారు. ► బీఎస్–3 వాహనాల కుంభకోణంలో బైయిల్పై వస్తూ తాడిపత్రి మండలం బొందలదిన్నె వద్ద సీఐ దేవేంద్ర కుమార్పై అనుచితంగా ప్రవర్తించినందుకు తండ్రితోపాటు తనయుడిపై ఎస్సీ, ఎస్టీ యాక్ట్ కింద కేసు నమోదైంది. మనీ ల్యాండరింగ్పై తాడిపత్రిలోని నివాసంలో ఈడీ అధికారులు దాడులు జరిపి ఆయన తనయుడిపై రెండు కేసులు నమోదు చేశారు. ఇంకా వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు చేసిన పలు కేసుల్లో తనయుడిపై కేసులు నమోదయ్యాయి. ఎన్నికల నిబంధనల ఉల్లంఘన కేసులూ నమోదయ్యాయి. డబ్బు కోసం దేనికైనా సై ► తాడిపత్రి మండలం హుస్సేన్పురం వద్ద రెండు వేల ఎకరాల్లో ఏర్పాటు చేసిన గెర్దావ్ స్టీల్ ప్లాంట్పై కన్నేసిన ఆ నేత కంపెనీ యజమానులను బ్లాక్మెయిల్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. సొంతంగా ట్రాన్స్పోర్టును ఏర్పాటు చేసి, స్టీల్ ప్లాంట్ ఉత్పత్తుల ఎగుమతులు, దిగుమతులకు తన లారీలనే వినియోగించుకునేలా వారిపై ఒత్తిడి చేశారు. సరుకు రవాణాకు సంబంధించి ట్రాన్స్పోర్టు వే బిల్లులు కాకుండా తాడిపత్రి లారీ అసోసియేషన్ ద్వారా చేయించి ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండికొట్టారు. బినామీ లెక్కలతో రూ.300 కోట్లకు పైగా అక్రమంగా ఆర్జించినట్లు ఆరోపణలున్నాయి. ► స్టీల్ ప్లాంట్లో డ్రైస్లాగ్ ద్వారా నెలకు దాదాపు రూ.15 కోట్ల చొప్పున ఆయన ఎమ్మెల్యేగా ఉన్న ఐదేళ్ల కాలంలో రూ.900 కోట్లు ఆర్జించారని సమాచారం. ► గుత్తి నుంచి తాడిపత్రి మండలం బొందలదిన్నె వద్ద ఉన్న వైఎస్సార్ జిల్లా సరిహద్దు వరకూ 63 కి.మీ. హైవే పనులకు రూ.275 కోట్ల అంచనా వ్యయంతో నేషనల్ హైవే అధికారులు ఆహా్వనించిన టెండర్లను నాటి టీడీపీ ఎంపీకి చెందిన కన్స్ట్రక్షన్ కంపెనీతో పాటు మరో విదేశీ కంపెనీ 13 శాతం తక్కువకు కోట్ చేసి దక్కించుకున్నాయి. విదేశీ కంపెనీకి మన దేశంలో అనుమతుల్లేవంటూ అధికారులను బెదిరించి ఆ టెండర్ను రద్దు చేయించారు. అనంతరం ఎంపీకి చెందిన కంపెనీతోపాటు మరో కంపెనీతో కలసి 4.9 శాతం ఎక్కువకు టెండర్ కోట్ చేయించి దక్కించుకున్నారు. ఈ అక్రమాలతో రూ.50 కోట్ల మేర ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టారు. ► మున్సిపాలిటీ ఆ«దీనంలోని కాంప్లెక్స్లోని మొదటి అంతస్తును తన ముఖ్య అనుచరుడు ఏడాదికి రూ.7.36 లక్షలు అద్దె చెల్లించేలా ఆ నేత లీజుకు ఇచ్చి, గుడ్విల్ రూపంలోనే దాదాపు రూ.2.66 కోట్లు పక్కదారి పట్టించారన్న ఆరోపణలున్నాయి. ► ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న కాంప్లెక్స్లో 6, 67, 68, 72 రూములను తక్కువ మొత్తంతో అద్దెకు తీసుకుని సబ్ లీజులకు ఇచ్చి పెద్ద మొత్తంలో వెనకేసుకున్నట్లు సమాచారం. ► పెద్దపప్పూరు మండలం జూటూరు భూముల్లో ఆయన అనుచరులు రూ. కోట్ల విలువైన ఇసుకను అక్రమంగా తరలించి సొమ్ము చేసుకున్నారు. పెన్నా, చిత్రావతి నదీ పరివాహక ప్రాంతాల్లో ఇసుక అక్రమ రవాణాలోనే వారి అనుచరులు రూ.40 కోట్లకు పైగా కూడబెట్టారు. ► తమ కుటుంబ సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించి యాడికి మండలం కోనుప్పలపాడు సమీపంలోని గనుల్లో లైమ్స్టోన్ వెలికి తీసే క్రమంలో చారిత్రక గుహలు వెలుగు చూడకుండా తొక్కిపెట్టారు. ►మట్కా డాన్గా పేరున్న ఓ వ్యక్తికి ఈ నేత పూర్తి అండదండలు ఉండేవి. అప్పట్లో కడప విజిలెన్స్ విభాగంలో పనిచేస్తున్న సీఐ, తన సిబ్బందితో కలసి మట్కా డాన్ ఇంట్లో తనిఖీలు నిర్వహించినప్పుడు తన అనుచరులను ఉసిగొల్పి పోలీసులపై దాడులు చేయించి, పోలీసు వాహనాలకు నిప్పంటించారు. -
నవతరం కదలాలి.. పోలింగ్ పెరగాలి...
యువతరమే ముందు యుగం దూతలు..పావన నవజీవన, బృందావన నిర్మాతలు... అని శ్రీశ్రీ ఒక పాటలో అభివర్మించారు.. వారు తల్చుకుంటే సమాజాన్ని అత్యద్భుతంగా ముందుకు తీసుకెళ్లగలరని కొనియాడారు. అది నూరు శాతం వాస్తవం. ముఖ్యంగా ఎన్నికల్లో వారి పాత్ర కీలకం... యువత ఇంటి నుంచి పోలింగ్ కేంద్రానికి రావాలే కానీ రాజకీయ తీరుతెన్నులే మారిపోతాయి. సంక్షేమానికి పట్టం కడుతున్నదెవరో, ఓట్ల కోసం మేనిఫెస్టోలనే బుట్టదాఖలు చేస్తున్నదెవరో యువత ఇట్టే గ్రహిస్తుంది.అణగారిన వర్గాలను ఉన్నత స్థానానికి తీసుకువెళ్లాలనే తపన పడేదెవరో– ఆ వర్గాల వంచకులెవరో గుర్తించే శక్తియుక్తులు వారికే ఉన్నాయి...దేశంలో ఈ సారి తొలిసారిగా ఓటుహక్కు వినియోగించుకోబోతున్న యువత 1.85 కోట్ల మంది. ఆంధ్రప్రదేశ్నే తీసుకుంటే మొత్తం ఓటర్లలో 20 శాతం 30 ఏళ్లలోపు యువతే ఉంది...ఎన్నికల సంఘం ఈ యువతను పోలింగ్ కేంద్రాలకు రప్పించే దిశగా చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తోంది. సాక్షి, అమరావతి: వచ్చే సార్వత్రిక ఎన్నికల ఫలితాలను యువ ఓటర్లు దిశా నిర్దేశం చేయనున్నారు. దేశవ్యాప్తంగా 96.88 కోట్ల మంది ఓటర్లు ఉండగా, అందులో 30 ఏళ్లలోపు ఓటర్ల సంఖ్య 20 కోట్లుగా ఉన్నట్లు కేంద్ర ఎన్నికల సంఘ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అందులో 18 నుంచి 19 ఏళ్లు ఉండి తొలిసారిగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న వారి సంఖ్య 1.85 కోట్లు. దీంతో ఈ సారి ప్రధాన రాజకీయ పార్టీలన్నీ యువ ఓటర్లను ఆకర్షించే దిశగా అడుగులు ముందుకేస్తున్నాయి. మన రాష్ట్ర విషయానికి వస్తే మొత్తం 4.10 కోట్ల ఓటర్లలో సుమారు 20 శాతం మంది 30 ఏళ్లలోపే ఉన్నారు.18 నుంచి 30 ఏళ్లలోపు మొత్తం 79.03 లక్షల మంది ఉంటే అందులో తొలిసారి ఓటు హక్కు వినియోగించుకుంటున్న 18–19 ఏళ్ల వారు 8.25 లక్షల మంది ఉన్నారు. ఈ సారి ఎన్నికల్లో యువ ఓటర్ల సంఖ్య అధికంగా ఉండటంతో వీరంతా విధిగా తమ ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ఎన్నికల సంఘం పెద్ద ఎత్తున ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు విలువను తెలియచేసే విధంగా సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పారి్టసిపేషన్ (స్వీప్) పేరిట కాలేజీలు, విశ్వవిద్యాలయాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు సెలబ్రెటీలతో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోంది. వయోవృద్ధులకు ఇంటి వద్దే.. రాష్ట్రంలో తొలిసారిగా 85 ఏళ్లు దాటిన వయోవృద్ధులు పోలింగ్ బూతులకు రావాల్సిన అవసరం లేకుండా ఇంటి వద్ద నుంచే ఓటు హక్కును వినియోగించుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేయలేమనుకున్న వారు ముందుగా నమోదు చేసుకుంటే అధికారులు ఇంటి వద్దకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ఏర్పాట్లు చేస్తారు. రాష్ట్రంలో 2.12 లక్షల మంది ఓటర్లు 85 ఏళ్లు దాటిన వారు ఉన్నారని, వీరు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని ఎన్నికల సంఘ అధికారులు వెల్లడిస్తున్నారు.దివ్యాంగులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా నేరుగా పోలింగ్ బూత్లోకి వెళ్లి ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ప్రతీ పోలింగ్ కేంద్రం వద్ద ర్యాంపులు ఏర్పాటు చేయాల్సిందిగా ఇప్పటికే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో మొత్తం 5.17లక్షల దివ్యాంగ ఓటర్లు ఉండటంతో వారు ఓటు హక్కు వినియోగించుకునే పోలింగ్ కేంద్రాలను గుర్తించి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. 2019లో జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలో 79.77 శాతం ఓటింగ్ నమోదు కాగా, ఇప్పుడు ఈ మొత్తాన్ని 83 శాతం దాటించాలని కేంద్ర ఎన్నికల సంఘం లక్ష్యంగా నిర్దేశించుకుంది.
Advertisement
Photos
View allVideo
View allTuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
టైటిల్ నిలబెట్టుకోవాలనే లక్ష్యంతో...
వాట్సప్లో మారిన రంగులు.. కారణం అదేనంటూ
బెయిర్ స్టో విధ్వంసకర సెంచరీ.. కేవలం 45 బంతుల్లోనే
లాయర్గా...
పరుగుల పంజా...
పరుగు ఇవ్వకుండానే 7 వికెట్లు
‘మిక్స్డ్’ ఫైనల్లో సురేఖ–అభిషేక్ జోడీ
చెడుపై గెలుపు
చరిత్ర సృష్టించిన పంజాబ్ కింగ్స్.. ప్రపంచంలోనే తొలి జట్టుగా
ఇదెక్కడి విధ్వంసం... కేవలం 28 బంతుల్లోనే! 8 సిక్స్లతో
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- sreemukhi: ఖతర్నాక్ అందాలతో కవ్విస్తోన్న అందాల యాంకర్ శ్రీముఖి (ఫొటోలు)
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- TCSS ఆధ్వర్యంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- RRR Movie : ఆ పాట కంటతడి పెట్టిస్తుందట
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
What’s your opinion
is snake reptile?
What is your fav car
ముంబై కెప్టెన్గా హార్దిక్ పాండ్యా నియామకం సరైందేనా?
AP : కూటమి మ్యానిఫెస్టోపై ఏమనుకుంటున్నారు?
నమ్మశక్యం కాని వాగ్దానాలిస్తారు
ఏ పార్టీకి నచ్చిన వాగ్దానాలు వారిస్తారు
Advertisement