ఐటీ పరిశ్రమలకు సింగిల్ విండో విధానం | Sakshi
Sakshi News home page

ఐటీ పరిశ్రమలకు సింగిల్ విండో విధానం

Published Mon, Jun 30 2014 6:13 PM

ఐటీ పరిశ్రమలకు సింగిల్ విండో విధానం

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో ఐటీ పరిశ్రమల స్థాపన కోసం కృషి చేస్తున్నామని ఐటీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి అన్నారు. ఐటీ పరిశ్రమల అనుమతుల కోసం సింగిల్ విండో విధానం అమలు చేస్తామని చెప్పారు.

వంద రోజుల్లో కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేయిస్తామని రఘునాథ రెడ్డి తెలిపారు. పరిశ్రమలు ఏర్పాటు చేసేలా  జాతీయ, అంతర్జాతీయ కంపెనీలతో సంప్రదిస్తున్నామని చెప్పారు. విశాఖపట్నంలో ఐటీఐఆర్ ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు.

Advertisement
Advertisement