ముగిసిన సిరిమానోత్సవం | Sakshi
Sakshi News home page

ముగిసిన సిరిమానోత్సవం

Published Tue, Jan 26 2016 5:55 PM

ముగిసిన సిరిమానోత్సవం

మక్కువ (విజయనగరం జిల్లా) : ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం శంబర పోలమాంబ ఉత్సవం సోమవారం ప్రారంభమైన సంగతి తెల్సిందే. పోలమాంబ అమ్మవారి జాతరలో ప్రధాన ఘట్టమైన సిరిమానోత్సవం మంగళవారం ముగిసింది. సిరిమాను పూజారి జన్నిపేకాకు రామారావు మధ్యాహ్నం 3.27 గంటలకు అధిరోహించారు.

ఈ ఏడాది ఈ ఉత్సవాలను తిలకించడానికి సుమారు లక్షన్నర మంది భక్తులు వచ్చారని నిర్వాహకుల అంచనా. గతేడాది సుమారు 3 లక్షల మంది భక్తులు ఈ ఉత్సవానికి హాజరయ్యారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement