నిలువ నీడ లేకుండా చేశారన్నా! | Sakshi
Sakshi News home page

నిలువ నీడ లేకుండా చేశారన్నా!

Published Mon, Jul 23 2018 7:31 AM

Sisters Sharing Their Problems In Praja Sankalpa Yatra - Sakshi

తూర్పుగోదావరి :‘ఖాళీ స్థలంలో నివాసం కోసం వేసుకున్న పాకను తొలగించడమే కాక సూటిపోటి మాటలతో మా అమ్మానాన్నలను క్షోభపెట్టా’రంటూ పాదయాత్రలో ఉండూరులో  జగన్‌ ఎదుట గ్రామానికి చెందిన అడపా దుర్గాభవాని కంటతడి పెట్టింది. నిలువ నీడలేని నిరుపేదలమని, అందరిలానే నాన్న గ్రామంలోని ఖాళీ స్థలంలో పాక వేసుకుని నివాసముండేవారని, ఉన్నట్టుండి ఆ స్థలంలోని రెండు వందల మందికి చెందిన పాకలను అధికారులు తొలగించారని వాపోయింది. ఇదేమని అడిగితే కొందరు నానా మాటలన్నారంటూ ఆవేదన చెందింది.  తమ కుటుంబం ఎటూ తోచని స్థితిలో ఉందని, చివరకు ఇంటర్‌ చదివే తనను మానిపించేశారంటూ కన్నీరు మున్నీరైంది. పేదరికంలో ఉన్న తమలాంటి వాళ్ళకు ‘న్యాయం చేయాలన్నా!’ అంటూ జగన్‌ను కోరింది. 

Advertisement
Advertisement