సాక్షి, ప్రతినిధి, ఒంగోలు : రాజధాని ఎంపిక కోసం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ ఎట్టకేలకు ఆదివారం ఒంగోలు రానుంది. ఉదయం కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సేవా సంస్థలు, పౌర సమాజ వేదిక నేతలు, ప్రజలతో సమావేశం అవుతుంది.
ఈ కమిటీ ముందు తమ వాదనలు వినిపించేందుకు ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నేతలు సన్నద్ధమవుతున్నారు. ఈ కమిటీ ప్రతినిధులు ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత కొత్తపట్నంలోని వాన్పిక్ భూములు, దొనకొండలోని ప్రభుత్వ భూములను సందర్శిస్తారు.
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాజధాని విషయంలో ముందుగానే ఒక నిర్ణయానికి రావడం వల్ల ప్రకాశం జిల్లాను నిర్లక్ష్యం చేస్తున్నారనే ఆరోపణలున్న నేపథ్యంలో ఈ కమిటీ ఏ విధంగా స్పందిస్తుందనేది చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర పునర్విభజన చట్టం ఆధారంగా రాష్ట్రానికి కేటాయించిన 11 జాతీయ సంస్థల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా జిల్లాకు కేటాయించకపోవడం పట్ల ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది.
రాజధాని నిర్మాణానికి జిల్లాలో ఉన్న అనుకూలతలివీ..
* జిల్లాలోని దొనకొండ దగ్గర మొత్తం 54,483 ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉందని అధికారులు లెక్కలు తేల్చారు. ఇందులో 34 వేల ఎకరాలు యధాతథంగా ఉపయోగించుకునే అవకాశం ఉంది. మిగిలిన 20 వేల ఎకరాలు అటవీ భూమి. దీన్ని డీ-నోటిఫై చేస్తే సరిపోతుంది.
* దొనకొండకు పది కిలోమీటర్ల దూరంలోనే సాగర్ కాలువ ప్రవహిస్తుండటంతో, ఇక్కడ తాగునీటికి కూడా ఇబ్బంది ఉండదు.
* దొనకొండలో ప్రస్తుతం ఉన్న విమానాశ్రయాన్ని రెండో ప్రపంచ యుద్ధ సమయంలో దాదాపు 1939వ సంవత్సరంలో నిర్మించారు. ఇక్కడ సమాచార వ్యవస్థ ఇప్పటికీ పనిచేస్తూనే ఉంది. అయితే మిగిలిన భవనాలు శిథిలావస్థలో ఉన్నాయి.
రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఇక్కడ ఇంధనం నింపుకోవడానికి, సిబ్బంది విశ్రాంతి తీసుకోవడానికి ఉపయోగించారు. ఇటీవల ఈ శిథిల భవనానికి కంచె కూడా వేశారు. ప్రస్తుతం ఈ విమానాశ్రయం ఆధీనంలో 136 ఎకరాల భూములున్నాయి. శిథిల భవనాలను వాడుకలోకి తీసుకురావడంతో పాటు, ఈ భూములను అభివృద్ధి చేస్తే విమానాశ్రయం కూడా అందుబాటులోకి వస్తుంది. రాజధాని నిర్మాణానికి ఈ ప్రాంతం అన్ని విధాలా అనుకూలంగా ఉంటుందని గతంలోనే కేంద్ర ప్రభుత్వానికి ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవీఆర్ కృష్ణారావు నివేదిక పంపిన సంగతి తెలిసిందే.
* దొనకొండ ప్రాంతం భౌగోళికంగా రాయలసీమకు దగ్గరగా ఉండటంతో ఈ ప్రాంతంలో రాజధానిని ఏర్పాటు చేస్తే వెనుకబడిన ప్రాంతం కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంది.
* ఈ ప్రాంతం జిల్లా మంత్రి శిద్దా రాఘవరావు ప్రాతినిధ్యం వహిస్తున్న దర్శి నియోజకవర్గంలో ఉన్నా రాజధాని నిర్మాణంపై ఆయన స్పందించలేదు.
* ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి చొరవ తీసుకుని ఢిల్లీలో ఈ కమిటీని కలిసి ప్రకాశం జిల్లా పర్యటనకు రావాలని కోరడం, రాజధాని సాధన సమితి ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపడుతుండటంతో దొనకొండను రాజధానిని చేయాలంటూ మంత్రివర్యులు ఒక ప్రకటన చేసి ఊరుకున్నారు. వాన్పిక్ ప్రాజెక్టు కోసం కేటాయించిన భూములను ప్రభుత్వం వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో అక్కడ కూడా రాజధానిని ఏర్పాటు చేసేందుకు అనుకూలంగా ఉంటుందని జిల్లా ప్రజలు తమ వాదన వినిపించనున్నారు.
శివరామకృష్ణన్ కమిటీ సభ్యుల పర్యటన సాగేదిలా..
ఒంగోలు టౌన్: శివరామకృష్ణ కమిటీ సభ్యులు ఆదివారం జిల్లాకు వస్తున్నట్లు కలెక్టర్ జీఎస్ఆర్కేఆర్ విజయకుమార్ శనివారం తెలిపారు. కమిటీ సభ్యుల పర్యటన వివరాలను ఆయన వెల్లడించారు.
* ఉదయం 10 గంటలకు ఒంగోలు చేరుకుంటారు.
* 10.30 గంటలకు స్థానిక సీపీఓ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా అధికారులు, జిల్లాకు చెందిన పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులతో సమావేశమవుతారు.
* 11.30 గంటలకు రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, సివిల్ సొసైటీస్ ప్రతినిధులతో సమావేశమవుతారు.
* మధ్యాహ్నం 12 గంటలకు సీపీఓ కాన్ఫరెన్స్ హాలులో ప్రజల నుంచి అభిప్రాయాలు స్వీకరిస్తారు.
* 12.30 గంటలకు కొత్తపట్నంలోని వాన్పిక్ భూములను కమిటీ పరిశీలిస్తుంది.
* 1.30 నుంచి 2.30 గంటల వరకు స్థానిక ఎన్ఎస్పీ అతిథిగృహంలో లంచ్ బ్రేక్ తీసుకుంటారు.
* 2.30 గంటలకు దొనకొండకు ఒంగోలు నుంచి బయలుదేరతారు.
* సాయంత్రం 4 గంటలకు దొనకొండలోని భూములను పరిశీలిస్తారు.
* 5 గంటలకు అక్కడ నుంచి కడపకు వెళతారు.
స్పందిస్తారా?
Published Sun, Aug 10 2014 2:49 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోలవరంపై అమిత్ షాకు సజ్జల స్ట్రాంగ్ కౌంటర్
'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
వరల్డ్కప్ సెలక్టయ్యాడు.. వరుసగా రెండో మ్యాచ్లో గోల్డెన్ డక్
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (05-05-2024)
సైబర్ మోసం.. తెలిసి మరీ లక్షలు పోగొట్టుకున్న నటుడి భార్య
స్కూల్లో బెత్తం దెబ్బలు తిన్నా: సుప్రీం చీఫ్ జస్టిస్
చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
తప్పక చదవండి
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వంటకం! ఎలా చేస్తారంటే..?
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement