హైదరాబాద్: కొత్త రాజధాని కేవలం అధికార కేంద్రంగానే కాకుండా ఆదాయం - అభివృద్ధికి అనువుగా ఉండటం - తెలుగుదనం ఉట్టిపడేవిధంగా - అందరికీ అందుబాటులో ఉండాలని శివరామ కృష్ణన్ కమిటీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పినట్లు తెలిసింది. కొత్త రాజధాని ఎంపిక కోసం సూచనలు చేయడానికి అర్బన్ డెవలప్మెంట్ మాజీ కార్యదర్శి కెసి శివరామ కృష్ణన్ అధ్యక్షతన అయిదుగురు సభ్యులతో ఏర్పడిన కమిటీ ఈ రోజు చంద్రబాబును కలిసింది. ఒక ప్రాథమిక నివేదికను ఆయనకు సమర్పించింది. ఈ కమిటీ ఇప్పటికే విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు నగరాలతోపాటు ప్రకాశం జిల్లాలో పర్యటించింది. రేపు రాయలసీమలో పర్యటించబోయే ఈ కమిటీ ఇప్పటి వరకు తాము పర్యటించిన ప్రాంతాల గురించి చంద్రబాబుతోపాటు ఉన్నతాధికారులకు ఈ కమిటీ పవర్పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించింది.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ కొత్తరాజధాని ఎంపిక విషయంలో కమిటీకి కొన్ని సూచనలు చేశారు. ఎటువంటి అడ్డంకులు లేకుండా కొత్త రాజధాని నిర్మించడం మన బాధ్యత అని చెప్పారు.
కమిటీకి ఆయన చేసిన కొన్ని సూచనలు:
1. కొత్త రాజధాని నగరం అధికారానికి ప్రధాన కేంద్రంగా ఉండటంతోపాటు ఆదాయ మార్గాలు కూడా కలిగి ఉండాలి.
2. అభివృద్ధి చెందడానికి అనువుగా ఉండాలి.
3. రాష్ట్ర ప్రజలు అందరికి అందుబాటులో ఉండాలి.
4.నగరం తెలుగుదనం ఉట్టిపడేవిధంగా మన సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిభింభించేలా ఉండాలి.
5.నూతన భవన నిర్మాణాలు చేపట్టడానికి అనువుగా తగిన మౌలిక సదుపాయాలు ఉండాలి.
6.తెలుగువారి బ్రాండ్ వాల్యూ ఉండాలి.
7. పరిశ్రమలను, పెట్టుబడులను ఆకర్షించేదిగా ఉండాలి.
8.రాజధాని నగరంలో ఉండే జనానికి సరిపడ సమృద్ధిగా నీరు అందుబాటులో ఉండాలి.
చంద్రబాబు నాయుడు సూచనలు, ఆయన చెప్పిన లక్షణాలు అన్ని ఒక్క విజయవాడ-గుంటూరు ప్రాంతానికే ఉన్నట్లు భావిస్తున్నారు. మొదటి నుంచి చంద్రబాబు కూడా ఈ ప్రాంతంపైనే దృష్టిపెట్టారు. అంతేకాకుండా ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం కూడా ఈ రెండు నగరాల మధ్యన ఉన్న ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న సువిశాల ఖాళీ స్థలంలో చేశారు. ఇప్పటి వరకు అందిన సమాచారాన్ని బట్టి కూడా ఎక్కువ మంది రాజకీయ నేతలు, అధికారులు, ప్రజలు ఈ ప్రాంతాన్నే కొత్త రాజధానికి అనువైనదిగా భావిస్తున్నట్లు తెలుస్తోంది.
కొత్త రాజధానికి ఉండవలసిన లక్షణాలు
Published Sat, Jun 14 2014 7:45 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
వామ్మో.. ఒక్క రోజులో ఇంత పెరిగిందా?
చంద్రబాబు బ్యాచ్ కుట్రలతో పెన్షన్ దారులకు మరిన్ని కష్టాలు
ఢిల్లీ ఎల్జీ కీలక నిర్ణయం.. 223 మంది మహిళా కమిషన్ ఉద్యోగులపై వేటు
ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై కూటమి అసత్యపు ప్రచారం చేస్తోంది
రాఘవ్ చద్దా కంటి అపరేషన్: విట్రెక్టమీ అంటే ఏమిటి? అంత ప్రమాదమా?
శివకార్తికేయన్ వల్లే ఇది సాధ్యమైంది!
'స్టార్ హీరోలు కథ గురించి పట్టించుకోవట్లే'..
‘ఫోన్ ట్యాపింగ్లో రేవంత్, హరీష్ రావు కూడా బాధితులే’
అందుకు ఏదైనా చికిత్స చేయించుకున్నారా?
బ్యాంకుల వద్ద పెన్షన్దారుల కష్టాలు
తప్పక చదవండి
- కిందకు దిగండిరా.. జెండా కూలీల్లారా..!
- జార్ఖండ్ కాంగ్రెస్ ‘ఎక్స్’ ఖాతా నిలిపివేత
- ఒకప్పుడు మోదీ ఫాలోవర్.. ఇప్పుడు వారణాసిలో పోటీ
- అరుదైన గుండె సమస్య.. 23 ఏళ్లకే రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లండ్ క్రికెటర్
- ‘ఆప్’- కాంగ్రెస్ ఆశలకు బీఎస్పీ గండి కొట్టనుందా?
- ఉద్యోగాల కోతలు.. ఏకంగా హెచ్ఆర్ హెడ్ ఔట్!
- జయహో జోయా
- ఏప్రిల్లో ‘ఆటో’ అమ్మకాలు అంతంతే
- రాష్ట్రంలో పోలింగ్ సమయం పెంపు
- చరిత్ర సృష్టించిన రుతురాజ్.. ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు
Advertisement