వేములవాడ, న్యూస్లైన్ : ఎడారి దేశంలో ఉపాధిని వెతుక్కుంటూ వెళ్లినవారు అక్కడి ఓ కంపెనీ వలలో చిక్కి విలవిల్లాడుతున్నారు. ఒప్పంద గడువు ముగిసినా వీరిని వదలకుండా పనులు చేయించిన కంపెనీ ఇప్పుడు స్వదేశానికి వెళ్లాలంటే ఒక్కొక ్కరు రూ. 20 వేల చొప్పున చెల్లించాలని ఒత్తిడి చేస్తోంది. మరోచోట పనిచేసే వీల్లేక, తిరిగివచ్చేందుకు డబ్బులేక బాధితులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. సౌదీ అరేబియాలోని జిద్దాన్ బల్దియాలో పనిచేసేందుకు యువకులు కావాలన్న ప్రకటనతో కరీంనగర్, నిజామాబాద్, అదిలాబాద్ జిల్లాలకు చెం దిన 16 మంది యువకులు ఒక్కొక్కరు రూ. లక్షకు పైగా చెల్లించి ఓ ప్రైవేటు కంపెనీ ద్వారా వెళ్లారు. తీరా అక్కడికి చేరుకున్నాక అసలు విషయం తెలిసి కంగు తిన్నారు.
ఒకచోట పని కల్పిస్తామని చెప్పిన కంపెనీవారు మరోచోట పనికి కుదిర్చారు. ఉత్తచేతులతో తిరిగి వెళ్తే అప్పులు తీర్చడం ఎలా అని కంపెనీవారు చూపిన పనులు చేశారు. గతేడాది డిసెంబర్లో వీరి ఒప్పంద గడువు ముగిసింది. ఇక తామే వెళ్తామని కంపెనీకి చెప్పడంతో ఇంకా కొద్ది రోజులు పనిచేయాలని కంపెనీ కోరింది. అలా రెండు నెలల క్రితం వరకు పని చేయించుకుని ఇక పనులు చూపడం మానేసింది. కార్మికులకు ఎనిమిది నెలల వేతనాలు చెల్లించకుండా పెండింగ్ పెట్టింది. ఆ మొత్తం ఇవ్వకపోవడంతో పాటు కార్మికులు ఒక్కక్కరు రూ. 20వేల చొప్పున కంపెనీకి కడితేనే అక్కడినుంచి పంపిస్తామని వేధింపులకు గురి చేస్తోంది. బాధితుల్లో కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలతోపాటు నిజామాబాద్ జిల్లాకు చెందిన బాల్సింగ్, గోపాల్, గంగారాం, జలేందర్, రామ్సింగ్ తదితరులున్నారు. వీరంతా జిద్దాన్లోలో చెట్ల కింద తలదాచుకుంటున్నామని, రోడ్డుపై తిరిగితే అక్కడి పోలీసులు అకామా కోసం ప్రశ్నిస్తారన్న భయంతో ఎటూ కదలాలేక, ఆకలికి తాళలేకపోతున్నారని మారుపాకకు చెందిన కంది రాజయ్య ఫోన్లో చెప్పినట్టు ఆయన బంధువొకరు ‘న్యూస్లైన్’కు తెలిపారు. ప్రజాప్రతినిధులు స్పందించి తమ వారు స్వదేశం వచ్చేలా చర్యలు తీసుకోవాలని బాధితుల బంధువులు కోరుతున్నారు.
సౌదీలో చిక్కుకుపోయిన పదహారు మంది
Published Wed, Nov 13 2013 6:20 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement