ఆ తండ్రి హృదయం కొడుకును చూడాలని తపించింది. రెండు నెలలు ఆశగా నిరీక్షించింది. బిడ్డ క్షేమంగా ఉంటే చాలని భావించింది. జైలులో ఉన్న కొడుకు కోసం ఆకలిదప్పులు మరచిపోయాడా తండ్రి. మంచినీళ్లయినా ముట్టలేదు. నిద్రకు దూరమయ్యాడు. భోంచేయమని ఎవరెంత నచ్చచెప్పినా వినలేదు. ఫలితంగా కొడుకును చూడకుండానే కన్నుమూశాడు. తండ్రి మరణ వార్త కొడుక్కి ఇప్పటికీ తెలియకపోవడం మరో విషాదం. గుండెలు పిండేసే ఈ హృదయ విదారక పరిణామం కొయ్యూరు మండలంలో జరిగింది.
కొయ్యూరు : మూడు నెలల కిందట జంగాలతోటలో నరేశ్ను మావోయిస్టులు హతమార్చారు. అతని హత్యలో సంబంధం ఉందని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వై.రామవరం పోలీసులు కిలో పద్మనాభంను అరెస్టు చేసి జైలులో ఉంచారు. దీంతో పద్మనాభం తండ్రి ఆనందరావు (50) తీవ్ర మనోవేదనకు గురయ్యా డు. కొడుకు విడుదల కావాలని తపన పడ్డాడు. తిండీతిప్పలు మాని చివరకు ఆ బెంగతో ప్రాణాలే కోల్పోయాడు. ఇంటి పెద్ద మరణించాడు. చెట్టంత కొడుకు జైలు పాలయ్యాడు. చేయని తప్పుకు శిక్ష అనుభవిస్తున్నామని పద్మనాభం తల్లి, భార్య బిడ్డలు కన్నీటి పర్యంతమవుతున్నారు.
యు.చీడిపాలెం పంచాయతీ గొంధికోటకు చెందిన కిలో పద్మనాభం ఐదు సంవత్సరాల కిందట ముంచింగ్పుట్ మండలం తామరాపల్లి నుంచి వలస వచ్చి వ్యవసాయం చేసి జీవిస్తున్నాడు. పద్మనాభం తన తండ్రి ఆనందరావును కిందటి సంవత్సరం గొంధికోటకు తీసుకువచ్చాడు. మూడు నెలల కిందట వై.రామవరం పోలీసులు పద్మనాభంపై కేసు నమోదు చేసి, జైలుకు పంపారు. అప్పటి నుంచి తండ్రి ఆనందరావు కొడుకుపై బెంగ తో మంచం పట్టాడు. కొడుకు వచ్చేంత వరకు పచ్చి మంచినీళ్లు కూడా ముట్టేది లేదని శపథం చేశాడు. రెండు నెలలపాటు ఆకలితో చిక్కిశల్యమైన ఆనందరావు చివరకు ఈనెల 8న మరణించాడు. మంగళవా రం పసుపునీళ్లు (పెద్దకర్మ)ను నిర్వహించారు.
మరణించిన రోజే వచ్చిన పోలీసులు
ఆనందరావు మరణించిననాడు తూర్పుగోదావరి పో లీసులు గొంధికోట వచ్చారు. మీ కారణంగానే ఆనందరావు మరణించారని కుటుంబ సభ్యులు పోలీసుల పై ఆరోపణలు చేశారు. ఏ తప్పూ చేయని పద్మనాభా న్ని నరేశ్ కేసులో ఇరికించారని ఆవేదన చెందారు. ఈ విషయం పద్మనాభంకు తెలియజేస్తామని చెప్పి పోలీ సులు వెళ్లిపోయారు. ఆనందరావుకు పద్మనాభం ఒక్క డే కొడుకు కావడంతో మృతదేహానికి తలకొరివి పెట్టేవారు లేక చివరకు గ్రామస్తులే కర్మకాండలు చేశారు. గొంధికోటను సందర్శించిన ‘న్యూస్లైన్’ ఎదుట పద్మనాభం భార్య శాంతి, తల్లి తులసమ్మ కన్నీరుమున్నీరయ్యారు.
పద్మనాభానికి ఎవరితో సంబంధాలు లేకపోయినా పోలీసులు తప్పుడు ఫిర్యాదును ఆధారంగా చేసుకుని కేసులో ఇరికించారని వారు ఆవేదన చెందారు. బెయిల్ పెట్టేందుకు ఆర్థిక స్థోమత లేదని చెప్పారు. కొడుకును చూడకుండానే తండ్రి కన్నుమూశారని, తల్లి కూడా కొడుకుపై బెంగతో అన్నం తినడం లేదని చెప్పారు. పద్మనాభానికి ఇద్దరు కొడుకులు.
నాన్న గుండె ఆగింది..
Published Fri, Nov 21 2014 12:39 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
షర్మిల ఆడియో లీక్
మాకు ఓటు వేయకుంటే కరెంట్ కట్: కాంగ్రెస్ ఎమ్మెల్యే బెదిరింపు!
తెలంగాణలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై నిషేధం.. 48 గంటలపాటు ప్రచారం ఆపేయాలన్న కేంద్ర ఎన్నికల సంఘం .. ఇంకా ఇతర అప్డేట్స్
సింగర్ హత్య కేసు నిందితుడిపై కాల్పులు.. స్పాట్లోనే!
అభివృద్ధి ఎంత జరిగిందో ప్రజల్లో ఉంటే తెలుస్తుంది బుగ్గన అర్జున్ రెడ్డి కామెంట్స్
హామీలు కాదు..చెవిలో పువ్వులు..టీడీపీ మేనిఫెస్టో చూసి మోదీ షాక్
కైకేయి.. శూర్పణఖ... ఏదైనా ఓకే
జయహో జోయా
మన సర్పంచులు @ ఐరాస
కృష్ణమ్మతో సత్యదేవ్ స్టార్ అవుతాడు: రాజమౌళి
తప్పక చదవండి
- జయహో జోయా
- రాష్ట్రంలో పోలింగ్ సమయం పెంపు
- చరిత్ర సృష్టించిన రుతురాజ్.. ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు
- సీఎం రేవంత్పై ’ఈసీ‘కి బీఆర్ఎస్ ఫిర్యాదు
- కాస్మొటిక్ సర్జీలు : యాక్టర్స్ విషాద మరణాలు (ఫొటోలు)
- రిలీజైన ఏడాది తర్వాత తెలుగులో పీరియాడికల్ చిత్రం!
- కేసీఆర్పై ఈసీ చర్యలు, ఎన్నికల ప్రచారంపై 48 గంటల నిషేధం
- తెలుగులో స్ట్రీమింగ్ అవుతోన్న భారీ బడ్జెట్ వెబ్ సిరీస్..!
- నా కుమారుడు వరల్డ్కప్ జట్టుకు ఎంపికవుతాడని స్వీట్లు, టపాసులు తెచ్చా: రింకూ తండ్రి ఆవేదన
- సుల్తాన్పూర్ లోక్సభ స్థానానికి మేనకా గాంధీ నామినేషన్ దాఖలు
Advertisement