డీపీవో అల్లూరి నాగరాజువర్మ
పెంటపాడు : భూమి విలువ ఆధారంగా ఇంటిపన్ను సవరణను జూలై ఒకటో తేదీ నుంచి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నట్టు జిల్లా పంచాయతీ అధికారి అల్లూరి నాగరాజువర్మ చెప్పారు. అపరిష్కృతంగా ఉన్న కబేళా సమస్య పరిష్కారంలో భాగంగా పెంటపాడు వచ్చిన ఆయన స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. నిర్మాణపు విలువ, స్కేర్ఫీట్ (ఎస్ఎఫ్టి) ప్రకారం పన్నును లెక్కిస్తామన్నారు. భూముల మార్కెట్ విలువ విపరీతంగా పెరగడం వల్ల పన్ను పెంపుపై నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. రిజిస్ట్రేషన్ విలువకు అనుగుణంగానే పన్ను ఉంటుందన్నారు. జిల్లాలోని 880 పంచాయతీలకు ఎస్ఎఫ్సీ తదితర పథకాల కింద రూ.41 కోట్లు విడుదల చేశామని పేర్కొన్నారు.
పంచాయతీ భవన నిర్మాణాలకు త్వరలో మోక్షం
జిల్లాలో శిథిలావస్థలో ఉన్న 97 పంచాయతీ భవనాల పునర్నిర్మాణానికి ప్రతిపాదనలు పంపామని డీపీవో తెలిపారు. ఐదు వేలు జనాభా దాటిన పంచాయతీలకు రూ.13.5 లక్షలు, ఐదు వేల లోపు జనాభా ఉన్న పంచాయతీలకు రూ.12 లక్షల నిధులు కేటాయించనున్నట్లు పేర్కొన్నారు. డంపింగ్ యార్డులు లేని గ్రామాల్లో స్థలసేకరణ చేయాలని రెవిన్యూ శాఖను కోరామన్నారు. జిల్లాలో 120 కార్యదర్శుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఈ ఏడాది 25 ఖాళీలు భర్తీ చేశామన్నారు. జిల్లాలో అనధికార లే అవుట్లపై నిఘా పెట్టామన్నారు.
నీటి ఎద్దడి నివారణకు ప్రణాళిక
జిల్లాలో తాగునీటి ఎద్దడి నివారణ కోసం వచ్చే వేసవి నుంచి సరికొత్త ప్రణాళిక రూపొందించనున్నట్లు నాగరాజువర్మ వెల్లడించారు. గ్రామాల్లో ఉన్న చెరువుల పరిమాణాలు పెంచడం, ఇతర చెరువులను తాగునీటికోసం వినియోగించడం, తదితర చర్యల వల్ల తాగునీటి సమస్య పరిష్కారమవుతుందని భావిస్తున్నామన్నారు. దీనివల్ల వేసవిలోనే కాక అన్ని కాలాలలో నిరంతరాయంగా తాగునీరు సరఫరా చేసే అవకాశం ఉందన్నారు. ట్యాంకర్ల ద్వారా నీరందించే పాతకాల పద్ధతికి స్వస్తి పలుకుతామన్నారు. ఎంపీడీవో జీవీకే మల్లికార్జునరావు, ఈవోపీఆర్డీ ఆర్.లక్ష్మికాంతం, కార్యదర్శులు పి.వెంకటేశ్వరరావు, షేక్ షంషుద్ధీన్ పాల్గొన్నారు.
ఇంటిపన్ను సవరణ కు ప్రత్యేక కార్యాచరణ
Published Fri, Jun 20 2014 12:48 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వైఎస్సార్సీపీ అభ్యర్థులకే మా మద్దతు
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
తప్పక చదవండి
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- 3 రోజులు తేలికపాటి వానలు!
- బాబును నమ్మితే మళ్లీ బానిస బతుకులే..
- రైతు భరోసా నిధుల విడుదల
- ఏబీసీ పార్టీలది ముస్లిం లీగ్ ఎజెండా: జేపీ నడ్డా
- డీజీపీగా హరీష్కుమార్ గుప్తా
- ‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
Advertisement