కర్నూలు విద్య: ప్రభుత్వ ఆదేశాల మేరకు ‘బడి పిలుస్తోంది’ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నట్లు సర్వశిక్ష అభియాన్(ఎస్ఎస్ఏ) ప్రాజెక్టు ఆఫీసర్ మురళీధర్రావు తెలిపారు. బుధవారం ఆయన తన చాంబర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ విద్యా హక్కు చట్టం ప్రకారం 6 నుంచి 14 సంవత్సరాల వయస్సు బడి ఈడు పిల్లలందరినీ పాఠశాలల్లో చేర్పించడమే ఈ కార్యక్రమం ఉద్దేశమన్నారు.
ఈ ఏడాది మే నెల వరకు జిల్లాలో 5,192 మంది బడి ఈడు పిల్లలు పాఠశాలలకు వెళ్లడం లేదని గుర్తించామన్నారు. 2014-5 విద్యా సంవత్సరంలో పాఠశాలలు పునఃప్రారంభమైన రోజు నుంచి ఆయా శాఖల అధికారుల సహకారంతో ఈనెల 19వ తేదీ వరకు 4,548 మంది పిల్లలను పాఠశాలల్లో చేర్పించామన్నారు. మిగిలిన 644 మంది పిల్లలను బడి పిలుస్తోందిలో భాగంగా ఈనెల 25 నుంచి ఆగస్టు 2వ తేదీ వరకు రోజు వారీ ప్రత్యేక కార్యక్రమాలతో పాఠశాలల్లో చేర్పించేందుకు చర్యలు చేపడతామన్నారు.
కార్యక్రమాన్ని అనంతపురం జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. జిల్లాలో ఉప ముఖ్యమంత్రి కేఈ క్రిష్ణమూర్తి శుక్రవారం సునయన ఆడిటోరియంలో ప్రారంభిస్తారన్నారు. కార్యక్రమాన్ని జయప్రదం చేసేందుకు జిల్లా స్థాయిలో కమిటీ ఉంటుందన్నారు. చైర్మన్గా జిల్లాలోని సీనియర్ మంత్రి, వైఎస్ చైర్మన్గా కలెక్టర్, సభ్యులుగా జెడ్పీ చైర్మన్, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, డీఈఓ, అసిస్టెంట్ లేబర్ అధికారి.. కన్వీనర్గా సర్వశిక్ష అభియాన్ పీఓ వ్యవహరిస్తారన్నారు. మండల స్థాయిలో ఎంఈఓ అధ్యక్షతన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.
ప్రతిష్టాత్మకంగా ‘బడి పిలుస్తోంది’
Published Thu, Jul 24 2014 12:28 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వారి వల్లే మా ఎంగేజ్మెంట్ జరిగింది: అదితిరావు హైదరీ
పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటి (ఫోటోలు)
రాణించిన హెడ్, కమ్మిన్స్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'దీదీ గిరి' అంగీకరించను: పశ్చిమ బెంగాల్ గవర్నర్
బాబే కాదు ప్రధాని మోదీ కూడా యూటర్న్ తీసుకున్నారు: అమర్నాథ్
త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనున్న టాలీవుడ్ హీరోయిన్.. భర్తపై అలాంటి పోస్ట్!
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి నగదు
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
కాంగ్రెస్కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement