ఐఆర్‌సీటీసీ ఆధ్వర్యంలో వారణాసికి ప్రత్యేక రైలు | Sakshi
Sakshi News home page

ఐఆర్‌సీటీసీ ఆధ్వర్యంలో వారణాసికి ప్రత్యేక రైలు

Published Thu, Sep 12 2013 4:15 AM

Special Train to Varanasi under IRTC

విజయవాడ, న్యూస్‌లైన్ : వారణాసి పుణ్యక్షేత్రాన్ని సందర్శించే ప్రయాణికుల సౌకర్యార్థం ప్రతి సోమవారం సికింద్రాబాద్ నుంచి ఒక రైలు నడుపుతున్నట్లు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ ట్యూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) విజయవాడ రీజనల్ మేనేజర్ ఎన్‌డి భుజంగరావు తెలిపారు. ఈ రైలులో 5 రాత్రులు, 6 రోజులు ప్రయాణించడానికి ఒక్కొక్కరికి రూ.7,170 ధర నిర్ణయించామన్నారు. ఆయా ప్రదేశాల్లో రోడ్డు రవాణా, వసతి, గైడ్ సర్వీసు రుసుము కూడా దీన్లో కలిపి ఉందన్నారు. వివరాలకు 0866-2572281 ఫోనులో సంప్రదించాలని ఆయన సూచించారు.

Advertisement
Advertisement