సభ్యత్వ నమోదు వేగవంతం చే యండి | Sakshi
Sakshi News home page

సభ్యత్వ నమోదు వేగవంతం చే యండి

Published Sat, Nov 15 2014 2:13 AM

సభ్యత్వ నమోదు వేగవంతం చే యండి - Sakshi

నగరి : తెలుగుదేశం పార్టీ స భ్యత్వ నమోదు వేగవంతం చే యూలని మాజీ ఎమ్మెల్యే గాలి ముద్దుకృష్ణమ నాయుడు అ న్నారు. నగరి నియోజకవర్గ సభ్యత్వ నమోదు పరిశీలకుడు శ్రీనివాస చౌదరి పట్టణానికి విచ్చేసిన సందర్భంగా శుక్రవా రం స్థానిక పార్టీ కార్యాల యంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆ యన మా ట్లాడారు. సభ్యత్వం తీసుకుంటే అనేక ప్రయోజనాలు కలిగే వి ధంగా పార్టీ అధిష్టానం పథక ర చన చేసిందన్నారు.

తాను  ఓడి నా ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేస్తానని తెలి పారు.  తన కృషి ఫలితంగా ఏకాంబరకుప్పం రైల్వే ఓవర్‌బ్రిడ్జ్ నిర్మాణానికి 2.95కోట్లు మంజూరైందన్నారు. ఇందుకు సంబంధించిన జీవోను స్థానిక నాయ కులకు అందించారు. ఈ   పార్టీ ఎస్టీ సెల్ వైస్ ప్రెసిడెంట్ కె.నరహరివరప్రసాద్, నాయ కు లు ఉప్పలపాటి చందు, అహ్మద్ కార్మిక్, కృష్ణారెడ్డి, శ్రీహరినాయుడు, ఆనందనాయుడు, జ్యో తినాయుడు, బాలాజీ తదితరులు పాల్గొన్నారు.
 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement