విజయనగరం కంటోన్మెంట్, న్యూస్లైన్ : ఆరు అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లు ఆడేందుకు భారతదేశ పర్యటనకు వచ్చిన శ్రీలంక మహిళా జట్టు వార్మప్ మ్యాచ్లో విజయం సాధించింది. ఈ నెల 19 నుంచి 28 వరకు మూడు వన్డేలు..మూడు టీ-20 మ్యాచ్లు ఆడేం దుకు వచ్చిన శ్రీలంక మహిళా జట్టు వార్మప్ మ్యాచ్లో భారత్-ఎ జట్టుపై 12 పరుగుల తేడాతో విజయం సాధించి ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకుంది. విజ యనగరం సమీపంలోని నార్త్జోన్ క్రికెట్ అకాడమీలో శుక్రవారం జరిగిన మ్యాచ్లో భారత్-ఎ జట్టుతో తలపడిన శ్రీలంక ప్రధాన జట్టు 12 పరుగుల తేడా తో గెలుపొందింది. నిర్ణీ త 50 ఓవర్లకు నిర్వహిం చిన మ్యాచ్లో టాస్ గెలిచిన భారత్-ఎ మహి ళా జట్టు ఫీల్డింగ్ ఎంచుకోవడంతో శ్రీలంక జట్టు బ్యాటింగ్కు దిగింది. మ్యాచ్లో 49.5 ఓవర్లలో శ్రీలంక మహిళా జట్టు 10 వికెట్లు కోల్పోయి 186 పరుగులు చేయగలిగింది. జట్టు బ్యాటింగ్ విభాగంలో యశోదా మెండిస్ 62 బంతుల్లో ఎనిమిది ఫోర్లు, ఒక సిక్స్తో 53 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించగా... మిగిలిన క్రీడాకారుల ఆటపట్టు 30, దీపిక 17, శిరివర్ధనే 11 పరుగులతో రాణిం చారు. మ్యాచ్లో తొలి వికెట్ భాగస్వామ్యానికి ఆటపట్టు, యశోదా మెండిస్ 87 పరుగులు జోడించారు. బౌలింగ్ విభాగంలో భారత్-ఎ జట్టు క్రీడాకారిణులు ప్రీతి బోస్ మూడు వికెట్లు దక్కించుకుంది.
అనంతరం లక్ష్య సాధన కోసం బ్యాటింగ్కు దిగిన భారత్-ఎ జట్టు 47.3 ఓవర్లలో కేవలం 174 పరుగులతో మొత్తం వికెట్లు కోల్పోవటంతో 12 పరుగులు తేడాతో ఓటమి పాలైంది. జట్టులో స్మృతిమందానా 49 పరుగులు, వేదాకృష్ణమూర్తి 19, స్నేహా మోరే 27, షికాపాండే 32 పరుగులతో రాణించారు. భారత్-ఎ జట్టులో క్రీడాకారి ణులు స్నేహామోరే, షికా పాండేలు ఏడో వికెట్ భాగస్వామ్యానికి 38 పరుగులు జోడించి పర్వాలేదని పించారు. బౌలింగ్లో శ్రీలంక జట్టు క్రీడాకారిణులు ఒషాది రనషింగ్ రెండు వికెట్లు దక్కించుకుంది. భారత్-ఎ జట్టులో భారత ప్రధాన జట్టులో ఉన్న వేదాకృష్ణమూర్తి వార్మప్ మ్యాచ్కు కెప్టెన్గా వ్యవహరించగా... స్మృతి మందానా అనే మరో క్రీడాకారిణి ఆడారు.
జిల్లాకు అంతర్జాతీయ ఖ్యాతి...
క్రీడలకు పుట్టినిల్లుగా పేరుగాంచిన విజయనగరానికి అంతర్జాతీయ స్థాయి ఖ్యాతి దక్కింది. ఇప్పటికే వివిధక్రీడాంశాల్లో జిల్లాకు చెందిన క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణించి పలు పతకాలు దక్కించుకోవటం ద్వారా జిల్లా కీర్తి ప్రతిష్టలు ఎల్లలు దాటిస్తుండగా.. అంతర్జాతీయ క్రికెట్కు ఆతిథ్యం ఇవ్వటం ద్వారా ఆ ఖ్యాతి మరింత పెరగనుందని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నెల 19 నుంచి 28 వరకు శ్రీలంక మహిళా జట్టు భారత పర్యటనలో భాగంగా ఆరు అంతర్జాతీయ మ్యాచ్లు ఆడనుండగా అందులో ఒక వార్మప్ మ్యాచ్తో పాటు మరో రెండు టీ-20 మ్యాచ్లు జిల్లాకు సమీపంలో గల నార్త్జోన్ క్రికెట్ అకాడమీలో జరగనున్నట్లు ఏసీఏ మీడియా ఇన్చార్జి ప్రకటించారు. తద్వారా జిల్లాకు అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి పెరగటంతో పాటు జిల్లా క్రికెట్ అభివృద్ధికి ఇటువంటి మ్యాచ్లు దోహదపడనున్నాయి.
టీ-20 మ్యాచ్లకు ఆతిథ్యం...
శ్రీలంక మహిళా జట్టు భారత్ పర్యటనలో భాగంగా ఆడనున్న రెండు టీ-20 మ్యాచ్లకు నార్త్జోన్ క్రికెట్ అకాడమీ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ మేరకు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ మీడియా ఇన్ఛార్జి సిఆర్.మోహన్ మ్యాచ్ షెడ్యూల్ను ప్రకటించారు. శ్రీలంక మహిళా జట్టుతో భారత మహిళా జట్టు మూడు టీ-20 మ్యాచ్లు ఆడాల్సి ఉండగా అందులో మొదటి, రెండవ మ్యాచ్లు విజయనగరం సమీపంలో గల నార్త్జోన్ క్రికెట్ అకాడమీలో జరగనున్నాయి. ఈ నెల 25, 26 తేదీల్లో ఈ మ్యాచ్లు జరగనున్నాయి.
కేక పెట్టించిన లంక
Published Sat, Jan 18 2014 4:32 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
నెల ముందే ప్రమోషన్.. ఇప్పుడు జాబ్ పోయింది: అగ్రరాజ్యంలో టెకీ ఆవేదన
జేక్ ఫ్రేజర్ విధ్వంసం.. కేవలం 19 బంతుల్లోనే! వీడియో వైరల్
ల్యాండ్ టైట్లింగ్ చట్టం సమగ్ర స్వరూపం ఇదే..
25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
ఈహెచ్టీని ఢీ కొట్టిన లారీ
రాజస్తాన్తో ఢిల్లీ కీలక పోరు.. కొత్త ప్లేయర్లు ఎంట్రీ
యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
ఒక్క మూవీతో సెన్సేషన్.. ఈ పాన్ ఇండియా హీరోని గుర్తుపట్టారా?
తప్పక చదవండి
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement