లభ్యత నీటినంతా పంచేసిన కృష్ణా బోర్డు
తెలంగాణకు 6.5, ఏపీకి 4.5 టీఎంసీల కేటాయింపు
హైదరాబాద్: శ్రీశైలం ప్రాజెక్టు ఖాళీ కానుంది. శ్రీశైలంలో వినియోగార్హమైన 11.24 టీఎంసీల నీటిని తక్షణ తాగునీటి అవసరాలకు ఇరు రాష్ట్రాలు వాడుకునేందుకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు అంగీకరించింది. వినియోగార్హమైన 11.24 టీఎంసీలలో తెలంగాణ 6.5 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్ 4.5 టీఎంసీలు కేటాయించింది. అందుబాటులో ఉన్న ఈ నీటితోనే వేసవిలో నెట్టుకురావాలని సూచించింది. ఈ మేరకు గురువారం ఇరు రాష్ట్రాలకు బోర్డు సభ్య కార్యదర్శి ఆర్కే గుప్తా లేఖలు రాశారు. ఈ ఆదేశాల ప్రకారం రాష్ట్రాలు నీటి వినియోగం మొదలుపెడితే ఏ క్షణమైనా ప్రాజెక్టు ఖాళీ కావడం ఖాయమని తెలుస్తోంది. నాగార్జున సాగర్ కుడి కాల్వ కింద తాగునీటి అవసరాలకు 4.5 టీఎం సీలు తక్షణమే విడుదల చేయాలని గత కొన్ని రోజులుగా ఏపీ సర్కారు బోర్డుకు మొరపెట్టుకుంటోంది. ఇదే విషయమై తెలంగాణ అధికారులతోనూ సంప్రదిస్తోంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ సైతం నల్లగొండ జిల్లాలోని 14 తాగునీటి పథకాలు, హైదరాబాద్ జంట నగరాల తాగునీటి అవసరాలకు నీటి విడుదల అంశాన్ని తెరపైకి తెచ్చింది. తమకు 6.5 టీఎం సీల నీటిని కేటాయించాలని విజ్ఞప్తి చేసింది.
లభ్యత నీరంతా పంపిణీ..
ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టులో 812.3 అడుగుల వద్ద 35.63 టీఎంసీల నీరు లభ్యంగా ఉండగా ఇందులో కనీస నీటి మట్టం 790 అడుగుల వద్ద 11.24 టీఎంసీలు మాత్రమే వినియోగర్హమైనదిగా బోర్డు తేల్చింది. ఇక సాగర్లో కనీస నీటిమట్టం 510 అడుగులకు దిగువన, 508.4 అడుగుల వద్ద 128.97 టీఎంసీల అడుగుల నీరుందని గుర్తించింది. అయితే సాగర్ నీటిని వాడుకునేందుకు అవకాశం లేకపోవడంతో శ్రీశైలంలో ఉన్న నీటిలో తెలంగాణకు 6.5 టీఎంసీలు, ఏపీకి 4.5 టీఎంసీలు పంచింది. శ్రీశైలం, సాగర్లలో కనీస నీటిమట్టాలకు దిగువన నీటిని తీసుకోవాలంటే మాత్రం ప్రభుత్వ స్థాయిలో నిర్ణయం జరగాలని తెలంగాణ ప్రభుత్వం చేసిన సూచనను ఈ సందర్భంగా బోర్డు ప్రశంసించింది.
వినియోగ లెక్కలపై భిన్న వాదనలు..
కృష్ణా బేసిన్లో నీటి వినియోగ లెక్కలపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సమర్పించిన లెక్కలతో బోర్డు విభేదించింది. కృష్ణా జలాల్లో ఇరు రాష్ట్రాలకు ఉన్న వాటాలు, గతంలో జరిగిన ఒప్పందాలను దృష్టిలో పెట్టుకుంటే మొత్తంగా కృష్ణాలో 193 టీఎంసీల నీరు లభించగా అందులో తెలంగాణ 66 టీఎంసీలు, ఏపీ 127 టీఎంసీలు వినియోగించుకున్నాయని బోర్డు తెలిపింది. అలాగే సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల పరిధిలో తెలంగాణ, ఏపీలు సమర్పించిన లెక్కలకు విరుద్ధంగా వినియోగం జరిగిందని బోర్డు తేల్చి చెప్పింది.
శ్రీశైలం ప్రాజెక్టు ఖాళీ!
Published Fri, Mar 18 2016 1:55 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
ఆర్టీసీ బస్సు– బైక్ ఢీ ●
వీడిన మహిళ హత్య కేసు మిస్టరీ
అంబేడ్కర్ కళాశాలలో దొడ్డమణి గోల్మాల్
తప్పక చదవండి
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- పారిస్ ఒలింపిక్స్కు భారత రిలే జట్లు అర్హత
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అందరివాడు జగన్ను ఆశీర్వదించండి
- పేదల అక్షరంపై కక్ష
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement