ధర్మకర్తల మండలి తీర్మానాలు
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో లడ్డూ ప్రసాదం, అన్న ప్రసాదాలు తయారుచేసే 492 మంది పోటు కార్మికుల వేతనాన్ని రూ. 3 వేల చొప్పున పెంచుతూ మంగళవారం జరిగిన టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం తీర్మానించింది. టీటీడీ గుర్తింపు కార్డు, రూ. 300 టికెట్ల సుపథం ప్రవేశ మార్గం నుంచి శ్రీవారి దర్శ నానికి అనుమతితోపాటు పోటు కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు టీటీడీ ఆస్పత్రుల్లో వైద్య సౌకర్యాలు కల్పించాలని నిర్ణయిం చారు. తిరుపతిలో ఇప్పటికే శంకుస్థాపన చేసిన సైన్స్ మ్యూజియం ఏర్పాటుకోసం 19.25 ఎకరాల టీటీడీ స్థలాన్ని కౌలు ప్రాతిపదికన కేటాయించనున్నారు. ఈ మేరకు టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు నేతృత్వంలో ఇక్కడి అన్నమయ్య భవన్లో జరిగిన సమావేశంలో అనేక అంశాలను తీర్మానించారు.
మరికొన్ని తీర్మానాలివీ..
∙రూ. 2.5 కోట్లతో తిరుమలలో సర్వదర్శ నం భక్తుల కోసం కొత్త కాంప్లెక్స్ నిర్మాణం. ∙టీటీడీ కాటేజీ విరాళ పథకం కింద తిరుపతిలోని మాధవం విశ్రాంతి గృహంలో ఒక్కోగదికి రూ. 15 లక్షలు, విష్ణునివాసంలో రూ. 10 లక్షలు, ఒక్కో సూట్కు రూ. 18 లక్షలు చొప్పున భక్తుల నుంచి స్వీకరించా లని నిర్ణయం. ∙శ్రీవేంకటేశ్వర విశ్వ విద్యాలయంలోని స్వర్ణోత్సవ ఆర్చి వద్ద రూ. 29 లక్షలతో శ్రీవారి ఆలయ నిర్మాణం. ∙ఏపీ, తెలంగాణలోని పలు ఆలయాల అభివృద్ధి, జీర్ణోద్ధరణకోసం రూ. 3.51 కోట్లు కేటాయించారు. ∙తెలంగాణలోని నిజామా బాద్ జిల్లా బర్దీపూర్ గ్రామంలోని శ్రీవేంకటే శ్వరస్వామి, రాజేశ్వరస్వామి త్రితల రాజగో పురం నిర్మాణానికి ఆలయానికి రూ. 25 లక్షలు. ∙ఖమ్మం జిల్లా ఎర్రబోయినపల్లెలో సీతారామస్వామి ఆలయానికి రూ. 23.85 లక్షలు, నీలాద్రిలో వెలసిన శ్రీశివాలయానికి రూ. 46.35 లక్షలు, జమలాపురంలో సత్రం అభివృద్ధికి రూ. 28.70 లక్షల కేటాయింపు.
7 వేల కిలోల శ్రీవారి బంగారాన్ని దీర్ఘకాలిక డిపాజిట్లోకి మార్పు: ఈవో
టీటీడీ పలు బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన దాదాపు 7 వేల కిలోల శ్రీవారి బంగారానికి ప్రస్తుతం స్వల్పకాలిక డిపాజిట్పై కేవలం 1 శాతం వడ్డీ మాత్రమే వస్తోందని, త్వరలోనే దీర్ఘకాలికంగా డిపాజిట్ చేయనున్నామని, దీనిద్వారా 2.5% వడ్డీ వచ్చే అవకాశముందని టీటీడీ ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు తెలిపారు.
శ్రీవారి పోటు కార్మికులకు వేతనాలు పెంపు!
Published Wed, Apr 26 2017 2:54 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఫాప్, కోహ్లి విధ్వంసం.. గుజరాత్పై ఆర్సీబీ ఘన విజయం
విరాట్ కోహ్లి బుల్లెట్ త్రో.. గుజరాత్ బ్యాటర్ ఫ్యూజ్లు ఔట్! వీడియో
ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
వారికి వాడుకుని వదిలేసే అలవాటు: కాంగ్రెస్పై మండిపడ్డ జ్యోతిరాదిత్య సింధియా
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement