పీజీ ప్రవేశ పరీక్షలు ప్రారంభం | Sakshi
Sakshi News home page

పీజీ ప్రవేశ పరీక్షలు ప్రారంభం

Published Sat, May 3 2014 1:03 AM

start the pg entrance examinations

ఏఎన్‌యూ, న్యూస్‌లైన్, యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో 2014-15 విద్యాసంవత్సరంలో పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ప్రవేశ పరీక్షలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. గుంటూరు ఏసీ కళాశాల పరీక్ష కేంద్రంలో ఏర్పాట్లను వీసీ ఆచార్య కె. వియ్యన్నారావు పరిశీలించారు. ఏర్పాట్లపై పీజీ అడ్మిషన్ల డెరైక్టర్ డాక్టర్ జి.రోశయ్యను అడిగి తెలుసుకున్నారు. శుక్రవారం నిర్వహించిన ప్రవేశ పరీక్షలకు ఇంగ్లిష్ సబ్జెక్టుకు 183 మంది, హిందీ 26 , తెలుగు  109 మంది, సోషియాలజీ అండ్ సోషల్‌వర్క్ సబ్జెక్టుకు 534 మంది హాజరయ్యారని అడ్మిషన్ల డెరైక్టర్ డాక్టర్ రోశయ్య తెలిపారు.

 
Advertisement
 
Advertisement