ఒంగోలు అర్బన్ : జిల్లాలోని దొనకొండనే రాజధానిగా ఎంపిక చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, జెడ్పీ వైస్ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ డిమాండ్ చేశారు. రాజధానికి కావాల్సిన అన్ని అర్హతలూ ఆ ప్రాంతానికి ఉన్నప్పటికీ టీడీపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా పక్కనపెడుతోందని విమర్శించారు. స్థానిక వైఎస్ఆర్ సీపీ జిల్లా కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దొనకొండలో 55 వేల ఎకరాల ప్రభుత్వ భూమి, బ్రిటీష్ కాలంలో 136 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేసిన విమానాశ్రయం, 120 ఎకరాల్లో రైల్వేస్టేషన్ ఉన్నాయని తెలిపారు.
కేవలం ఆరు కిలోమీటర్ల దూరంలో సాగర్ కెనాల్, 20 కిలోమీటర్ల దూరంలో వెలిగొండ ప్రాజెక్టు, జాతీయ రహదారి ఉన్నాయన్నారు. రాజధానికి అవసరమైన ముఖ్య వసతులన్నీ ఇక్కడ ఉన్నాయని పేర్కొన్నారు. రాష్ట్రం మధ్యలో దొనకొండ ఉన్నందున అన్ని ప్రాంతాల ప్రజలకు అందుబాటులో ఉంటుందని, అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుందని చెప్పారు. రాయలసీమ సాధన సమితి కూడా రాజధానిని తమ ప్రాంతంలో ఏర్పాటు చేయాలని, లేకుంటే దొనకొండలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్న విషయాన్ని బాలాజీ గుర్తుచేశారు.
ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోంది...
రాష్ట్రంలోని ఉత్తరాంధ్రతో పాటు రాయలసీమ జిల్లాల ప్రజలందరికీ ఆమోదయోగ్యమైన దొనకొండను రాజధానిగా పరిశీలించకుండా ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని బాలాజీ విమర్శించారు. రాజధాని విషయంలో స్పష్టమైన వైఖరి అవలంబించకుండా దోబూచులాడుతోందని మండిపడ్డారు. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి విజయవాడ, గుంటూరు ప్రాంతాలనే పట్టుకుని వేలాడుతోందన్నారు. అక్కడ రాజధాని నిర్మించాలంటే భూ సేకరణకే వేల కోట్ల రూపాయలు అవసరమన్నారు. అసలే లోటు బడ్జెట్లో ఉన్న ప్రభుత్వం ఆ ప్రాంతంలో భూములు సేకరించి రాజధాని నిర్మించడం అసాధ్యమన్నారు.
దొనకొండలో భూముల కోసం రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదని, నిర్మాణాలపై దృష్టిపెడితే సరిపోతుందని బాలాజీ పేర్కొన్నారు. సముద్రమట్టానికి ఎత్తులో ఉండటం వల్ల ప్రకృతి వైపరీత్యాలు కూడా సంభవించవని తెలిపారు. దొనకొండను కాదని, విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో రాజధాని నిర్మిస్తే భవిష్యత్తులో మరో విభజన ఉద్యమం పుట్టే అవకాశముందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి దొనకొండనే రాజధానిగా ఎంపిక చేయాలని బాలాజీ సూచించారు.
ప్రజలకు అందుబాటులో ఎంపీ, ఎమ్మెల్యేలు...
వైఎస్ఆర్ సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, జిల్లాలోని ఆరుగురు ఎమ్మెల్యేలు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్నారని బాలాజీ తెలిపారు. పార్లమెంట్ జరిగే సమయంలో తప్ప మిగతా సమయంలో వైవీ సుబ్బారెడ్డి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులోనే ఉంటున్నారని చెప్పారు. గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్రెడ్డిపై అక్రమ కేసులు బనాయించడాన్ని ఆయన ఖండించారు. విలేకరుల సమావేశంలో వైఎస్ఆర్ సీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర కో ఆర్డినేటర్ పాలడుగు విజేంద్రబహుజన్, జిల్లా కన్వీనర్ కంచర్ల సుధాకర్, గ్రామీణ ఉపాధి కల్పనా విభాగం జిల్లా కన్వీనర్ బొగ్గుల శ్రీను పాల్గొన్నారు.
దొనకొండనే రాజధాని చేయాలి
Published Thu, Jul 31 2014 2:20 AM
Advertisement
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కూటమిపై గర్జించిన సీఎం జగన్.. దద్దరిల్లిన రాయలసీమ గడ్డ..
నామినేషన్కు ‘మృతుడు’.. కలెక్టరేట్లో కలకలం!
మీ బిడ్డ పాలనలోనే ఈ గొప్ప మార్పులు: సీఎం జగన్
సొంత వాళ్ళ దగ్గర పరువు పోయింది..బాబుపై కేశినేని నాని సెటైర్లు
ప్రచారంలో చంద్రబాబును ఏకిపారేసిన ఆర్కే రోజా
కుమారుడికి తాతగా నటించనున్న బ్రహ్మానందం
సీఎం జగన్ రాయల్ ఎంట్రీ
‘ డిబేట్కి ఎక్కడైనా రెడీ’.. ప్రియాంకా గాంధీకి స్మృతి ఇరానీ సవాల్
చికాగోలో తెలంగాణ విద్యార్థి అదృశ్యం ఆందోళనలో తల్లిదండ్రులు
కర్నూలు బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- జనసేనకు గాజుగ్లాసు గుర్తుపై వెనక్కితగ్గిన టీడీపీ
- SRH: కాస్త ఓపిక పట్టు.. నీకూ టైమ్ వస్తుంది: యువీ పోస్ట్ వైరల్
- PK: 'పులుసు కారుతోంది'..!
- ప్రచారంలో సీనియర్ హీరో స్టెప్పులు!
- SRH: వాళ్లిద్దరు పిచ్ను మార్చేశారు.. అతడొక అద్భుతం!
- సీఎం నితీష్కు షాకిచ్చి.. లాలూ చెంతకు బడా నేత!
- మా గురించి మాట్లాడేందుకు మీరెవరు?: వరలక్ష్మి శరత్కుమార్
- బాబు, పవన్, బాలయ్య, కిరణ్.. కూటమి ప్రముఖుల ఎదురీత
- నల్ల ఖజానా గేట్లు తెరచిన బాబు
- Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
Advertisement