అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ | Sakshi
Sakshi News home page

అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్

Published Sun, Oct 25 2015 8:31 PM

State Election Commissioner banvarlal at kanipakam

కాణిపాకం: తెలుగు రాష్ట్రాల ఎన్నికల కమిషనర్ భన్వర్‌లాల్ ఆదివారం కాణిపాకం వినాయక స్వామివారిని దర్శించుకున్నారు. భన్వర్‌లాల్‌కు ఆలయ అధికారులు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆయన ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించారు.

అనంతరం తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారిని భన్వర్‌లాల్ దంపతులు దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. కుంకుమార్చన సేవలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఆశీర్వాద మండపంలో అధికారులు ఆయనకు అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేశారు.

Advertisement
Advertisement