స్వైన్‌ఫ్లూతో ఇద్దరి మృతి | Sakshi
Sakshi News home page

స్వైన్‌ఫ్లూతో ఇద్దరి మృతి

Published Thu, Jan 15 2015 12:12 AM

States for the death of two

  • వివిధ ఆస్పత్రుల్లో  చికిత్స పొందుతున్న మరో పది మంది
  • సాక్షి, హైదరాబాద్: స్వైన్‌ఫ్లూ వైరస్ విజృంభిస్తోంది. రోజురోజుకూ విస్తరించి ప్రజల ప్రాణాలను బలి తీసుకుంటోంది. సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో బుధవారం ఇద్దరు స్వైన్‌ఫ్లూతో మృతి చెందారు. నిజాంపేట, యాకుత్‌పురాలకు చెందిన ఇద్దరు రోగులు కొద్దిరోజులుగా ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మంగళవారం అర్ధరాత్రి ఒకరు, బుధవారం మధ్యాహ్నం మరొకరు గాంధీ ఆస్పత్రికి వచ్చారు. ఆస్పత్రికి వచ్చిన కొద్దిసేపటికే వీరు మృతి చెందారు. గత ఏడాది నగరంలో 31, ఈ ఏడాది కేవలం 14 రోజుల్లోనే 27 స్వైన్‌ఫ్లూ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో పదిమంది వివిధ కార్పొరేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.  
     

Advertisement
Advertisement