►అవినీతి బయటకుండా ఉండేందుకు పథకం
►విజిలెన్స్ అధికారులను ప్రసన్నం చేసుకునే యత్నం
►కాళంగి, స్వర్ణముఖి నదిలో పొర్లుకట్టల నిర్మాణాల్లో అవినీతి
సాక్షి ప్రతినిధి, నెల్లూరు : స్వర్ణముఖి.. కాళంగి నదిలో ఏర్పాటు చేసిన పొర్లుకట్ట పనుల్లో భారీ ఎత్తున అవినీతి అక్రమాలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. టీడీపీ నేతలు చేపట్టిన పొర్ల్లుకట్టల పనుల్లో నాణ్యతకు తిలోదకాలిచ్చి కోట్ల నిధులు దుర్వినియోగం చేశారానే ఆరోపణలపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు విచారణ చేపట్టారు.అందులోభాగంగా మంగళవారం సూళ్లూరుపేట నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు.
విజిలెన్స్ అధికారులు వస్తున్నారని తెలుసుకున్న తమ్ముళ్లు అవినీతి బాగోతం బయటపడకుండా ఉండేందుకు విజిలెన్స్ అధికారులను ప్రసన్నం చేసుకునే పనిలో పడినట్లు విశ్వసనీయ సమాచారం. జిల్లాలో నీటిపారుదలశాఖ ఆధ్వర్యంలో గతంలో రూ.కోట్ల నిధులతో భారీ ఎత్తున అభివృద్ధి పనులు చేపట్టారు. పనులను ఎక్కువ శాతం టీడీపీకి చెందిన నేతలే బినామీ పేర్లతో చేపట్టినట్లు సమాచారం. ప్రపంచబ్యాంక్ నిధులతో స్వర్ణముఖి, కాళంగి, చెరువు పనులు చేపట్టారు. నదిలో చేపట్టిన పొర్లకట్టల పనుల్లో నాణ్యతకు తిలోదకాలిచ్చినట్లు అధికారుల ప్రాథమిక విచారణలో తేలినట్లు తెలిసింది. స్వర్ణముఖి, కాళంగి నది కుడి, ఎడమవైపున గ్రావెల్, మట్టితో కట్టలా పోసి లెవల్ చేయాల్సి ఉంది.
అయితే టీడీపీ నేతలు చేపట్టిన పొర్లకట్ట పనుల్లో నదిలోని ఇసుకనే తీసి కట్టలా ఏర్పాటు చేసినట్లు తెలిసింది. దానిపై మట్టిచల్లి భారీ ఎత్తున నిధులు స్వాహా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. టీడీపీ జిల్లా కార్యదర్శి ఒకరు రూ.2 కోట్ల పనులు చేపడితే.. అందులో రూ.కోటి వరకు నిధులు స్వాహా చేసినట్లు అధికారులకు ఫిర్యాదులు అందాయి. కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరిన ఓ ముఖ్యనాయకుడొకరు రూ.10 కోట్లు విలువచేసే వివిధ పనులు చేపట్టారు. అందులో భారీ ఎత్తున అవినీతి జరిగిందని స్థానికులు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేశారు. అదేవిధంగా జిల్లాలో చేపట్టిన 127 చెరువులకు ఖర్చుచేసిన రూ.90 కోట్ల నిధులు సైతం భారీఎత్తున దుర్వినియోగం అయినట్లు అధికారవర్గాలు వెల్లడించాయి.
అధికారులను ప్రసన్నం చేసుకునే పనిలో తమ్ముళ్లు
పొర్లకట్టలు.. చెరువు పనుల్లో జరిగిన అవినీతి అక్రమాలపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టర్ మనోహర్, అడిషనల్ డెరైక్టర్ శ్రీనివాస్, రీజినల్ ఏఎస్పీ రాంప్రసాద్, డీఈ సుధాకర్, నీటిపారుదలశాఖ ఎస్ఈ రెడ్డెప్ప తదితరులు మంగళవారం నాయుడుపేట పరిధిలోని గ్రద్దగుంట చెరువు, స్వర్ణముఖి నదిలో చేపట్టిన పొర్లకట్టల పనులు, ఓజిలి మండలపరిధిలోని చెరువు పనులను పరిశీలించారు. విజిలెన్స్ అధికారులు వస్తున్నారన్న సమాచారం అందుకున్న టీడీపీ నేతలకు చెందిన రెండు బృందాలు నాయుడుపేట పరిధిలో ఎదురుచూడటం కనిపించింది. అయితే అధికారులు వారు వేచి ఉన్న ప్రాంతం వైపు నుంచి కాకుండా వేరొకమార్గం నుంచి వెళ్లినట్లు తెలిసింది. విషయం తెలుసుకున్న తమ్ముళ్ల బృందం వారు ఎక్కడ ఏ పనులు పరిశీలిస్తున్నారో తెలుసుకునే పనిలో నిమగ్నమయ్యారు. కా గా విజిలెన్స్ అధికారులు పనులు నాశిరకంగా జరి గిన ప్రాంతంలో కాకుండా మెరు గ్గా ఉన్నచోట్ల పరి శీలించడం స్థాని కులను ఆశ్చర్యానికి గురిచేసింది.
దారి కాచిన తమ్ముళ్లు
Published Wed, Feb 11 2015 3:43 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ నాలుగు ముక్కలు
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- వైఎస్ భాస్కర్రెడ్డికి బెయిల్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
Advertisement