సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం, రణస్థలం: తుపాను ప్రాంతాల ప్రజలతో సీఎం ముఖాముఖీ కార్యక్రమం ఫక్తు ముఖస్తుతిగా మారింది. రణస్థలం మండలం కోష్ట జంక్షన్లో జరిగిన ఈ వీడియో కాన్ఫరెన్స్ జనం విస్తుపోయేలా చేసింది. తుపాను ప్రాంతాల్లో ఇంకా ఇబ్బందులెదురవుతున్నా, నష్టం అందకపోయినా, బాధితుల పట్ల అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నా నేరుగా సీఎంతోనే చెప్పుకోవచ్చని జిల్లా టీడీపీ నేతలు హడావుడి చేశారు. తీరా కార్యక్రమంలో మాట్లాడిన వారు మాత్రం.. తెలుగుదేశం సర్పంచ్, వైస్ ఎంపీపీ, మాజీ ఎంపీటీసీ, ఎంపీటీసీ, జిల్లా ఐకేపీ సభ్యులు, మహిళా కార్యకర్తలు, మహిళా సంఘాల నాయకులు.. వీరైన తాము, తమ తోటి ప్రజలు ఎదుర్కొంటున్న కష్టనష్టాలను సీఎంకు వివరించాల్సింది పోయి.. వచ్చిన అవకాశాన్ని సీఎంను పొగడటానికే సరిపెట్టారు. సీఎం మా గొప్పగా చేసేశారని, తమ ఎమ్మెల్యే సహా అధికారులు ముందుగానే తుపాను హెచ్చరికలు జారీ చేయడం వల్లే ప్రాణ నష్టం తగ్గిందని, బాధిత ప్రాంతాలకు నాలుగు రోజుల్లోనే కరెంటు వచ్చేసిందని చెప్పడం విస్మయం కలిగించింది. జిల్లాలోని ఇప్పటికీ పూర్తిస్థాయిలో విద్యుత్ రాకపోవడం గమనార్హం.
అసలు బాధితులకు అవకాశం లేదు
అసలు రైతులు, బాధితులు, తీర ప్రాంత వాసులకు సీఎంతో మాట్లాడే అవకాశమే లేకపోయింది. ఇదంతా గమనిస్తున్న అధికారులూ మిన్నకుండిపోయారు. ముఖాముఖి కార్యక్రమం ప్రారంభించిన వెంటనే తొలుత విశాఖ వాసులు మాట్లాడారు. తరువాత విజయనగరం వాసులు మాట్లాడాల్సి ఉన్నప్పటికీ లింక్ ఫెయిల్ కావడంతో వెంటనే శ్రీకాకుళం జిల్లా వాసులతో సీఎం మాట్లాడారు. వాస్తవానికి జిల్లా నలుమూలల నుంచి జనం వస్తారనుకుంటే అధిక శాతం ఎచ్చెర్ల నియోజకవర్గం వారినే రప్పించడంతో మిగతా ప్రాంతాలవారు ఉసూరుమన్నారు. స్థానిక ఎమ్మెల్యే కళా వెంకటరావు కార్యక్రమానికి హాజరుకాకపోయినా ఆయన్ని పదేపదే పొగడ్తలతో ముంచెత్తడం వెనుక ముందస్తు ప్రణాళిక స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యమంత్రే స్వయంగా హాజరైనట్టుగా ఏర్పాట్లు చేయడం, బందోబస్తు భారీగా ఉండటం విశేషం. అయితే ఆ స్థాయిలో జిల్లా నాయకులు, ఎంపీ, ఎమ్మెల్యేలు, మంత్రి, విప్ హాజరైతే బావుండేదని టీడీపీ కార్యకర్తలే వాపోతున్నారు.
ఒకరో..ఇద్దరో..
వీడియో కాన్ఫరెన్స్లో తుపాను కష్టాలు చెప్పుకున్నది ఒకరో ఇద్దరో..మిగతా వారంతా టీడీపీ ముందుగా ఏర్పాటు చేసిన భజన బృందమే. ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని, పంట నష్టం తొందరగా అందించాలని, నష్టాల సర్వే పారదర్శకంగా ఉండాలనే చెప్పారు తప్ప లోటుపాట్లు, పునరుద్ధరణ చర్యల్లో జాప్యంపై ఎవరూ నోరు విప్పలేదు. హాజరైన వారిలో డి. మహాలక్ష్మి టీడీపీ సర్పంచ్, పి. జగన్నాధం టీడీపీకి చెందిన మాజీ సర్పంచ్, పైడి అప్పడు దొర టీడీపీ నేత. డి.అశోక్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు. లంక శ్యామలరావు టీడీపీకే చెందిన రావడ గ్రామ సర్పంచ్. పిసిని అసిరి నాయుడు కోష్ట ఎంపీపీ. పల్లి చింతమ్మ మహిళా సంఘం అధ్యక్షురాలు. పిన్నింటి భాను రణస్థలం టీడీపీ నాయకుడు. వీరితోపాటు పైడిరాజు, రాంబాబు, లక్ష్మీ, కరిమజ్జి రమణ,సుధీర్, కెళ్ల గోవింద తదితరులు కార్యక్రమాన్ని రక్తి కట్టించారు.
బాధలు చెప్పకుండా.. భజనతో సరి
Published Thu, Oct 30 2014 1:25 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Watch Live: హిందూపురంలో సీఎం జగన్ ప్రచార సభ
డీబీటీ చివరిదశ చెల్లింపులకు మోకాలడ్డుతోన్న టీడీపీ.
కూలి పనికి పోతున్న కిన్నెర వాయిద్య కారుడు.. మాటలు చెబుతున్న సర్కారు
జగన్ మాటిచ్చాడంటే చేస్తాడు అనే నమ్మకమే నా వెంట ఇంత జనాన్ని నిలబెట్టింది
నా తొలి సంతకం వాళ్ళ కోసమే.. కూటమి మరో కుట్ర..!
శోభిత పోస్ట్.. సమంత స్టైలిష్ట్ రిప్లై
ముంబై ఎయిర్పోర్టులో 12 కోట్ల విలువైన బంగారం, ఐఫోన్లు సీజ్
ఎన్నికల వేళ కలకలం.. బీజేపీ మంత్రిని చంపేస్తామని బెదిరింపులు!
సంజయ్లీలా భన్సాలీ 'హీరామండి' వెబ్ సిరీస్ ఎలా ఉంది..?
నాడు మోదీకి వంట వండిన దీపక్.. ఇప్పుడేం చేస్తున్నారు?
తప్పక చదవండి
- కెనడాలో మనవడిని చూడ్డానికి వెళ్లి...మనవడితో సహా దుర్మరణం
- Banjara Hills: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం.. నిండు ప్రాణం బలి
- తెలంగాణలో భానుడి భగభగలు..!
- అందుకే ఓడిపోయాం.. అయినా సరే: హార్దిక్ పాండ్యా
- తాతా.. నీకు టాటా..
- రోహిత్ వేముల ఆత్మహత్య కేసు మళ్లీ దర్యాప్తు చేస్తాం
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
- తిరుమలలో వడగళ్ల వర్షం (ఫొటోలు)
- కందికుంట అడ్డంగా దొరికినా..
- నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు?
Advertisement