తాడికొండ/తాడేపల్లి రూరల్ : రాజధాని ప్రతిపాదిత గ్రామాల్లో భూ సమీకరణ లక్ష్యం నెరవేరే సూచనలు కనిపించడం లేదు. కేవలం శుక్ర, శనివారాలే గడువు ఉండడంతో అటు మంత్రులు, ఇటు అధికారులు ఇక సమీకరణ అసాధ్యమేనన్న నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల్లో తొలి విడతలో భాగంగా, 31,205 ఎకరాల భూములు సమీకరించాలని లక్ష్యంగా నిర్ణయించారు.
జనవరి 1 తేదీన సమీకరణ ప్రారంభం కాగా, ఇప్పటివరకు 18,700 ఎకరాలకు మాత్రమే రైతులు తమ అంగీకార పత్రాలు అందజేశారు. ఈ నెల 14వ తేదీతో సమీకరణ గడువు ముగియనుండడంతో దీనిపై నియమితులైన ప్రత్యేక అధికారులు, దగ్గరుండి సమీకరణ పనులు చూస్తున్న రాష్ట్ర పురపాలక శాఖా మంత్రి పి.నారాయణ, తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్కుమార్ ఆందోళనకు గురవుతున్నారు.
కేవలం ఈ రెండు రోజుల్లో 12,505 ఎకరాల భూములు ఎలా సమీకరించాలన్నది అంతుచిక్కని ప్రశ్నగా మిగిలిపోతోంది. దీంతో తొలివిడత సమీకరణ లక్ష్యం పూర్తి చేయడం అసాధ్యమని భావించిన అధికారులు ప్రత్యామ్నాయ ఆలోచనలు చేస్తున్నట్టు తెలుస్తోంది. సమీకరణ గడువు పెంచుతారా, లేక భూ సేకరణకు వెళతారా అనేది తెలియాల్సి ఉంది. మరో వైపు భూములు ఇవ్వబోమని అభ్యంతరం తెలుపుతూ 9.2 ఫారాలు అందజేస్తున్న రైతుల సంఖ్య గ్రామాల్లో పెరిగిపోతోంది. ఈ దశలో సేకరణకు దిగితే రైతుల నుంచే కాక అన్ని వర్గాల నుంచి తీవ్ర స్థాయిలో ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వస్తుందనే భయాందోళనలు ప్రభుత్వాధినేతల్లో వ్యక్తమవుతున్నట్టు సమాచారం.
పూర్తిస్థాయి వ్యతిరేకత
తాడేపల్లి రూరల్ : భూ సమీకరణ ప్రక్రియకు తాడేపల్లి మండలంలో పూర్తి స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమైంది. గత నెల 12వ తేదీన ఇక్కడ సమీకరణ ప్రారంభం కాగా, ఇప్పటివరకు 126 మంది రైతులు కేవలం 159.53 ఎకరాలు ఇచ్చేందుకు తమ అంగీకార పత్రాలు అందజేశారు. గ్రామాల వారీగా చూస్తే ఉండవల్లిలో 22 మంది రైతుల 19.73 ఎకరాలు ఇవ్వగా, దీనిలో 5.70 ఎకరాలు వివాదంలో ఉంది. పెనుమాకలో 88 మంది రైతులు 133.97 ఎకరాలు, తాడేపల్లిలో 16 మంది రైతులు 5.83 ఎకరాలు ఇచ్చారు. ఈ మండలంలోని అధిక శాతం మంది రైతులు ల్యాండ్ పూలింగ్కు తమ భూములు ఇవ్వడం లేదంటూ 9.2 దరఖాస్తులను అధికారులకు అందజేశారు.
సమీకరణపై మల్లగుల్లాలు
Published Fri, Feb 13 2015 3:11 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు కొత్తకోటకు సీఎం రేవంత్ రాక..
‘నీట్’కు ఏర్పాట్లు పూర్తి
ఐదుగురి నామినేషన్లు
పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా రాకేష్రెడ్డి
సుందర మున్నేరే లక్ష్యం..
నిరంతర విద్యుత్ సరఫరాకు చర్యలు
నేడు, రేపు డిప్యూటీ సీఎం భట్టి పర్యటన
పకడ్బందీగా విధులు నిర్వర్తించాలి
బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం
ముగ్గురు మంత్రులం ఉన్నాం..
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement