స్లాబ్ కూలి విద్యార్థి మృతి | Sakshi
Sakshi News home page

స్లాబ్ కూలి విద్యార్థి మృతి

Published Wed, Jan 22 2014 3:00 PM

Student dies in slab crash

ఒంగోలు: ప్రకాశం జిల్లా పుల్లలచెరువు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో  విషాదం నెలకొంది. పాఠశాల బాత్రూమ్ స్లాబ్ కూలి ఒక విద్యార్థి దుర్మరణం చెందాడు. వాటర్ ట్యాంక్ కోసం విద్యార్థి ఇటుకలు మోస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

స్లాబ్ కూలిన సమయంలో ఇటుకలు మోస్తున్న ఆరో తరగతి విద్యార్థి మేడికొండ నరేంద్ర  అక్కడికక్కడే మృతి చెందాడు. విద్యార్థులతో పనులు చేయించడంపై విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.

Advertisement
Advertisement