కరెంట్ షాక్ తో విద్యార్థినికి గాయాలు | Sakshi
Sakshi News home page

కరెంట్ షాక్ తో విద్యార్థినికి గాయాలు

Published Sun, Feb 28 2016 10:33 AM

Student injuried with an electric shock

కళాశాల ఆవరణలో విద్యుదాఘాతం కారణంగా ఓ విద్యార్థిని గాయాలపాలైంది. నల్లగొండ జిల్లా దామరచర్ల మండల కేంద్రంలోని గిరిజన గురుకుల కళాశాలలో ఆదివారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న డి.సుజాత కళాశాల ఆవరణలో ఉన్న వేపచెట్టును పట్టుకోవడంతో విద్యుత్ ఎర్త్ వైరు తగిలి షాక్‌తో కింద పడిపోయింది. అక్కడే ఉన్న రాయి తగలడంతో గాయపడింది. ఆమెను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.

 

Advertisement

తప్పక చదవండి

Advertisement