కామారెడ్డి, న్యూస్లైన్: విద్యార్థి శక్తి అంటే జాతీయ శక్తి అని, తెలంగాణ విద్యార్థుల శక్తి ముందు ఏ శక్తీ నిలువజాలదని తెలంగాణ రచయితల వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు నందిని సిధారెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలోని సత్యగార్డెన్స్లో టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో ‘తెలంగాణ పునర్నిర్మాణంలో విద్యార్థుల పాత్ర’ అనే అంశంపై నిర్వహించిన సదస్సుకు టీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చందు అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా నంది ని సిధారెడ్డి మాట్లాడుతూ..తెలంగాణ విద్యార్థి శక్తి సముద్రం కన్నా గొప్పదన్నారు. రాజకీయ నాయకత్వానికి వెన్నుదన్నుగా నిలిచిన విద్యార్థి శక్తి తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకభూమిక పోషించిందన్నారు. తెలంగాణ తల్లి సంకెళ్లను తెంపడానికి విరోచిత పోరాటాలు జరిపిన విద్యార్థులే హీరోలన్నారు. ఫిబ్రవరిలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తీరుతుందని, విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు.
ఇన్నేళ్లు ఎన్నో అవకాశాలు కోల్పోయిన విద్యార్థులకు ప్రత్యేక రాష్ర్టంలో న్యాయం జరుగుతుందన్నారు. సీమాంధ్ర నాయకుల కుట్రలను తిప్పికొట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఇన్నేళ్లుగా మన సంస్కృతి, చరిత్ర, సంప్రదాయాలు ఏ పుస్తకంలో లేవని, తెలంగాణ రాష్ట్రంలో వీటినన్నింటిని సాధించుకోవాల్సి ఉందన్నారు.
ఆందోళన వద్దు -కవిత, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు
పదమూడేళ్ల పోరాట ఫలితంగా తెలంగాణ రాష్ర్టం ఏర్పడుతోందని, ఆందోళన వద్దని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. వచ్చే రాష్ట్రంలో ఇప్పటిదాకా జరిగిన అన్యాయాలను సరిచేసుకోవాల్సి ఉందన్నారు. సీమాంధ్ర పాలకులు కొల్లగొట్టిన రెండు లక్షల ఉద్యోగాలను పొందాలన్నారు.
విద్యార్థులంతా కష్టపడి చదివి ఉన్నత ఉద్యోగాలు సంపాదించాలని, తద్వారా తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు. పుస్తకాలనే కాక ప్రపంచాన్ని చదవాలని, సమాజాన్ని అర్థం చేసుకుని ముందుకు సాగాలని ఆమె సూచించారు. సమైక్యవాదులది పైసల ఉద్యమమని, తెలంగాణది ప్రజల ఉద్యమమన్నారు. అనంతరం టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి, డీసీఎం ఎస్ చైర్మన్ ఎంకే ముజీబొద్దిన్ తదితరులు మాట్లాడారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నేతలు తిర్మల్రెడ్డి, భూంరెడ్డి, సుమిత్రానంద్, బాబూరావ్, మల్లేశ్యాదవ్, నవీనాచారి, విఠల్రావ్, సుమంత్, చంద్రశేఖర్రెడ్డి, పార్శి కాంశెట్టి, ముస్తాక్, బూక్య నర్సింలు, యాదవరెడ్డి, రాజిరెడ్డి, రమేశ్ తదితరులు పాల్గొన్నారు. సభకు ముందు విద్యార్థులు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు.
విద్యార్థి శక్తి జాతీయ శక్తి
Published Thu, Jan 30 2014 3:22 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రత్నగిరిపై కుండపోత
షెల్టర్ శ్లాబు కూలి యువకుడి మృతి
ఉపాధి కూలీలపై తేనెటీగల దాడి
పిడుగు పడి మేకల కాపరి మృతి
జగన్తోనే సంక్షేమం
కోనసీమలో పలుచోట్ల అకాల వర్షం
హమ్మయ్య చల్లబడింది
IPl 2024: శాంసన్ ఇన్నింగ్స్ వృథా.. రాజస్తాన్పై ఢిల్లీ ఘన విజయం
చాహల్ అరుదైన రికార్డు.. టీ20 క్రికెట్ చరిత్రలోనే
టీ20 వరల్డ్కప్కు ఐర్లాండ్ జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే?
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement