ప్రభుత్వంపై ఒత్తిడి తేండి | Sakshi
Sakshi News home page

ప్రభుత్వంపై ఒత్తిడి తేండి

Published Sun, Feb 22 2015 3:07 PM

students, teachers met jagan

వైఎస్సార్సీపీ అధినేత వెఎస్ జగన్ను చిలమత్తూరు విద్యార్థులు, గెస్ట్ టీచర్లు కలిశారు. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని వినతిపత్రం సమర్పించారు. తమ గురుకుల పాఠశాలలను కాలేజీ స్థాయికి పెంచాలని, వేతనాలు పెంచేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. అలాగే, హిందూపురం చర్చి ఫాస్టర్లు కూడా జగన్ను కలిశారు. అన్యాక్రాంతమవుతున్న తమ చర్చి ఆస్తులను కాపాడేలా ప్రభుత్వాలపై ఒత్తిడిపెంచాలన్నారు. ఇదిలాఉండగా, అంతకుముందు చిలమత్తూరులో జగన్‌కు జనం ఘన స్వాగతం పలికారు. ఆయనపై అభిమానులు పూల వర్షం కురిపించారు. ఇసుకేస్తే రాలనంత జనం చుట్టుముట్టారు. చేతిలో చేయి వేసేందుకు ఎగబడ్డారు. తమ అభిమాన నేతను చూసేందుకు చిలమత్తూరుతో పాటు చుట్టుపక్కల జనం తండోపతండాలుగా తరలివచ్చారు. చిలమత్తూరులో వైఎస్ఆర్ విగ్రహానికి ఆయన పూలమాల వేసి నివాళుర్పించారు.
 

Advertisement
Advertisement