ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న యువతి ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. చెప్పాపెట్టకుండా వే రే అమ్మాయితో పెళ్లికి సిద్ధపడ్డాడు. అలా ఎందుకు చేస్తున్నావని నిలదీసిన ప్రియురాలిని ‘నీ చావు నీవు చావుపో’ అంటూ కఠినంగా మాట్లాడాడు. తీవ్ర వేదనకు గురైన ఆ యువతి ఆత్మహత్యకు పాల్పడింది.
ఎర్రగుంట్ల: ప్రేమించి మోసం చేశాడని ఓ యువతి ఇంటిలో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తల్లిదండ్రులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. చిలంకూరులోని గుంత బజారు కాలనీలో నివాసముంటున్న అలమూరు దస్తగిరి, దస్తగిరమ్మకు ఇద్దరు కూతుర్లు. వారిలో పెద్ద అమ్మాయి దస్తగిరమ్మ, చిన్నమ్మాయి ఇమాంబీ. దస్తగిరి డ్రైవరుగా పని చేసుకుంటూ మరో పక్క కూడలిలో కూరగాయల అంగడి పెట్టుకొని జీవనం సాగిస్తున్నారు. పెద్దామ్మాయి దస్తగిరమ్మ నంద్యాలలోని బీటెక్ చదువుతుండగా, చిన్నమ్మాయి ఇమాంబీ ఎర్రగుంట్లలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీకాం ప్రథమ సంవత్సరం చదువుతుంది. ఇమాంబీ కళాశాలకు పోతుండగా అదే గ్రామానికి చెందిన నల్లమేకల ఉత్తమకుమార్రెడ్డి(ఉత్తమారెడ్డి) వెంట పడుతూ వేధించాడు. ఈ తరుణంలో ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఎనిమిది నెలలుగా అమ్మాయి చుట్టూ తిరిగాడు. తరుచూ ఫోన్ చేస్తుండేవాడు.
మరో అమ్మాయితో
వివాహం కుదరడంతో...
అయితే శనివారం మరో అమ్మాయితో అనంతపురంలోని పెళ్లికి పూనుకొని మార్చి 7,8 తేదీల్లో వివాహం ఖాయం చేసుకున్నారు. శనివారం ఇమాంబీకి ఫోన్ చేశాడు. ‘నీ చావు నీవు చావు అని, నాకు వివాహం కుదిరిందని చెప్పాడ’ని మృతురాలి బంధువులు తెలిపారు. ఇమాంబీ ఇంటిలో తల్లిదండ్రులు ఎవరూ లేని సమయంలో దూలానికి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మధ్యాహ్నం కూరగాయల అంగడి నుంచి తల్లి దస్తగిరమ్మ ఇంటికి వచ్చింది. తలుపులు వేసి ఉండడం గమనించింది.
కిటికిలో నుంచి చూడగా కూతురు ఉరి వేసుకొని వేలాడుతూ ఉండడం గమనిచింది. వెంటనే పక్కనే ఉన్న స్థానికులను పిలిచి తలుపులు పగలగొట్టి లోనికి పోయి వేలాడుతున్న ఇమాంబీని కిందకు దించారు. అప్పటికే మృతి చెందినది. తల్లిదండ్రులు బోరుమని విలపించారు. ఇమాంబీ మృతికి కారకుడైన ఉత్తమకుమార్రెడ్డిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. సంఘటన స్థలాన్ని ఎస్ఐ భానుమూర్తి సందర్శించారు. తల్లి దస్తగిరమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
ప్రియుడు మోసం చేశాడని..
Published Sun, Feb 22 2015 2:33 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
ఇజ్రాయెల్ ప్రధాని కీలక నిర్ణయం.. అల్ జజీరా ఛానెల్పై నిషేధం
‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ఆపాలని భూకజ్జాదారులు యత్నిస్తున్నారు’
'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
వరల్డ్కప్ సెలక్టయ్యాడు.. వరుసగా రెండో మ్యాచ్లో గోల్డెన్ డక్
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (05-05-2024)
సైబర్ మోసం.. తెలిసి మరీ లక్షలు పోగొట్టుకున్న నటుడి భార్య
తప్పక చదవండి
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement