కేసీఆర్‌ను కలవలేకపోయిన సుజనాచౌదరి | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ను కలవలేకపోయిన సుజనాచౌదరి

Published Fri, Jan 23 2015 3:17 AM

Sujana chowdary missed to meet CM kcr

సాక్షి, హైదరాబాద్: కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ సహాయ మంత్రి సుజనాచౌదరి గురువారం తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కలవడానికి సచివాలయానికి వచ్చారు. అయితే సీఎం అక్కడ లేకపోవడంతో వెనుదిరిగారు. నిజానికి మధ్యాహ్నం మూడు గంటలకు కేంద్ర మంత్రి చౌదరి సీఎంను కలుస్తున్నారంటూ మీడియాకు సమాచారం అందింది. అనుకున్న సమయానికే సుజనాచౌదరి వచ్చినప్పటికీ ముఖ్యమంత్రి మాత్రం సచివాలయానికే రాలేదు. ఆయన క్యాంపు కార్యాలయంలోనే ఉన్నారు. ముఖ్యమంత్రికి ఆరోగ్యం బాగా లేదని, అందుకే సచివాలయానికి రాలేదని ఆయన పీఏ చెప్పడంతో కేంద్ర మంత్రి వెనుదిరిగారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement